PIB Headquarters
కోవిడ్ -19పై పిఐబి రోజు వారీ బులిటన్
• ప్రస్తుతానికి దేశంలో 4067 కోవిడ్ -19 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి .109 మంది మరణించారు.
• కేంద్ర మంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి, కోవిడ్ -19 పై పోరాటంలో అప్రమత్తంగా, పట్టుదలతో ,ప్రేరణతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధానమంత్రి
• కోవిడ్ -19 నిర్వహణకు రెండు సంవత్సరాల పాటు (2020-21,2021-22)ఎంపిఎల్ ఎడిఎస్ నిధులు అమలులో లేకుండా చూసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
•
ఒకేరోజు ఆహారధాన్యాల రవాణాలో ఎఫ్సిఐ ఆల్టైమ్ రికార్డు
• 2500 కోచ్లను ఐసొలేషన్ కోచ్లుగా మార్చిన రైల్వే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 40,000 బెడ్లు సిద్ధం
Posted On:
06 APR 2020 6:43PM by PIB Hyderabad
- -19పై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అప్డేట్
ప్రస్తుతానికి దేశంలో 4067 కోవిడ్ -19 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 109 మంది మరణించారు.
291 మంది వ్యాధి నయమై కోలుకున్న తర్వాత డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం నిర్ధారిత కేసులలో 76 శాతం పురుషులు కాగా 24 శాతం మహిళలు. వయసుల వారీగా చూస్తే 47 శాతం మంది 40 సంవత్సరాల వయసులోపు వారు కాగా, 34 శాతం మంది 40 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య వయస్కులు. 19 శాతం మంది 60 సంవత్సరాలు అంతకు పైబడిన వారు ఉన్నారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611778
కేంద్ర మంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి, కోవిడ్ -19 పై పోరాటంలో అప్రమత్తంగా, పట్టుదలతో ,ప్రేరణతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధానమంత్రి
గరీబ్కళ్యాణ్య యోజన ప్రయోజనాలను నిరంతరాయంగా పర్యవేక్షించాలని, అది ఉద్దేశించిన లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా చూడాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ప్రధాన మంత్రి కోరారు. మంత్రులు రాష్ట్ర, జిల్లా పరిపాలనాయంత్రాంగంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని, అత్యవసర సమస్యలకు పరిష్కారాలను అందించాలని ఆయన అన్నారు. జిల్లా స్థాయి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాల్సిందిగా ఆయన కోరారు. ఆయా మంత్రిత్వ శాఖలు బిజినెస్ కంటిన్యుటీ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. COVID-19 ఆర్థిక ప్రభావంపై పోరాడటానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611687
కోవిడ్ -19 నిర్వహణకు రెండు సంవత్సరాల పాటు (2020-21,2021-22)ఎంపిఎల్ ఎడిఎస్ నిధులు అమలులో లేకుండా చూసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
కోవిడ్ -19 మహమ్మారిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పధకం (ఎంపిఎల్ఎడిఎస్)ను రెండు సంవత్సరాల పాటు (2020-21,2021-22) అమలు చేయరాదని నిర్ణయించారు. ఈ నిధులను దేశంలో కోవిడ్ -19 సవాలును, దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను బలోపేతం చేసేందుకు వినియోగించాలని నిర్ణయించారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611696
ఒకేరోజు ఆహారధాన్యాల రవాణాలో ఎఫ్సిఐ ఆల్టైమ్ రికార్డు
ఎఫ్.సి.ఐ 03-04-2020 , 04-04-2020 తేదీలలో రెండు రోజులపాటు వరుసగా 70 రేక్లలో 1.93 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేసి ఒక్కరోజుకు జరిగే సరకు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611458
దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాల్సిందిగా రాష్ట్రాలను కోరిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
మెడికల్ ఆక్సిజన్ సరఫరాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశంలో తగినంత మెడికల్ ఆక్సిజన్ సరఫరా జరగడం ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర మందుల జాబితాలోనూ, జాతీయ జాబితాలోనూ ఉన్నట్టు తెలిపారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611781
2500 కోచ్లను ఐసొలేషన్ కోచ్లుగా మార్చిన రైల్వే,స్వల్పవ్యవధిలోనే తొలుత నిర్ణయించిన సగం లక్ష్యాన్ని సాధించిన రైల్వే
2500 కోచ్లను ఐసొలేషన్ కోచ్లుగా మార్చడంతో , ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 40,000 ఐసొలేషన్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. సగటున రోజుకు 375 కోచ్లను భారతీయ రైల్వే ఐసొలేషన్ కోచ్లుగా మార్చడం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పనిని దేశంలోని 133 కేంద్రాలలో జరుగుతోంది.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611566
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మధ్య టెలిఫొన్ సంభాషణ
ఇరువురు నాయకులూ ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి గురించి, దీనిపై ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యూహాల గురించి చర్చించారు.ప్రస్తుత ఆరోగ్య సంక్షోభంపై ఇరుపక్షాల అనుభవాలను పరస్పరం పంచుకోవాల్సిన ప్రాముఖ్యతను, సమష్టి పరిశోధన కృషి ప్రాధాన్యతను ఇరువురు నాయకులూ గుర్తించారు.
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611586
కోవిడ్ -19పై తప్పుడు సమాచారాన్ని సత్వరం అరికట్టాలి: ఉపరాష్ట్రపతి
మూఢనమ్మకాలు, పుకార్ల వంటివి కోవిడ్ -19 పై మన పోరాటాన్ని బలహీన పరచరాదని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తప్పుడు సమాచార వ్యాప్తి ప్రత్యేకించి సామాజిక మాధ్యమాలలో ఇలాంటి ప్రచారం వైరస్ వంటిదని, దీనిని అరకట్టాలని పిలుపునిచ్చారు.
మరిన్నివివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611575
భువనేశ్వర్లో కోవిడ్ -19 ఆస్పత్రికి నిధులు సమకూర్చనున్న కోల్ ఇండియా సబ్సిడరీ ఎం.సి.ఎల్
మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎం.సి.ఎల్) సంస్థ, భువనేశ్వర్లో ఏర్పాటు కానున్న దేశంలోనే రెండో అతిపెద్ద కోవిడ్ -19 ఆస్పత్రి నిర్మాణానికి అన్ని ఖర్చులూ భరించనుంది. పేషెంట్ల కు అయ్యే చికిత్స ఖర్చులను కూడా ఈ సంస్థ భరించనుంది. ఇందుకు సంబంధించి ఈ సంస్థ ఇప్పటికే రూ 7.31 కోట్ల రూపాయలు తక్షణ అడ్వాన్సుగా విడుదల చేసినట్టు బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఈ విషయం తెలిపారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611655
కోవిడ్-19ని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ కేంద్రాలలో స్మార్ట్సిటీ మిషన్కు చెందిన
సమీకృత డాటా డాష్ బోర్డుల వినియోగం
పూణే, సూరత్, బెంగళూరు తుమకూరు స్మార్ట్ సిటీలు సమగ్ర డేటా డాష్బోర్డులను ఉపయోగిస్తున్నాయి, వీటిని డేటా విశ్లేషకులు వారి ఐసిసిసిలతో కలిసి పనిచేసే డేటా నిపుణులు అభివృద్ధి చేశారు (అనేక నగరాల్లో COVID-19 వార్ రూమ్లుగా కూడా ఇవి పనిచేస్తున్నాయి).ఇవి ఆయా నగరాలలోని వివిధ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611651
స్వల్ప వ్యవధిలో అద్భుత ఫలితాలు సాధించిన రైల్వేలో కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రీకృత కంట్రోల్ ఆఫీసు
రైల్వేలకు చెందిన కంట్రోల్ ఆఫీసు 24 గంటలూ పనిచేస్తూ, నిరంతరం నాలుగు కమ్యూనికేషన్, ఫీడ్బ్యాక్ ప్లాట్ఫారంలను పర్యవేక్షిస్తోంది. దీని హెల్ప్లైన్ 139,138. సోషల్ మీడియా ప్రత్యేకించి (ట్విట్టర్), ఈమెయిల్(railmadad@rb.railnet.gov.in) లను పర్యవేక్షిస్తోంది. రైల్వే పాలనాయంత్రాంగానిక, సాధారణ ప్రజలకు మధ్య లాక్డౌన్ కాలంలో సమాచారం నిరంతరాయంగా కొనసాగడానికి ఇది ఉపకరిస్తుంది.
మరిన్ని వివరాలకు https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611719
కోవిడ్ -19 నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, బాగోగుల పట్ల చర్యలను సూచించిన యుజిసి
కోవిడ్ -19 మహమ్మారి ముప్పు నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం,బాగోగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మానవ వనరుల అభివృద్ధి మంత్రి వివిధ అటానమస్ సంస్థల అధిపతులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా యుజిసి, అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మానసిక ఆరోగ్యం , మానసిక అంశాలు, విద్యార్ధుల బాగోగులకు సంబంధించి చర్యలు తీసుకోవలసిందిగా సూచించింది.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611662
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 132 లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు ఈరోజు వరకు 184 టన్నుల వైద్య సరకులను సరఫరాచేశాయి.
పౌరవిమానయాన మంత్రిత్వశాఖ చేపట్టిన ఉడాన్ లైఫ్ లైన్ కార్యక్రమం కింద 132 కార్గో విమానాలు దేశవ్యాప్తంగా మారుమూల, కొండ ప్రాంతాలకు ఇప్పటివరకూ వైద్య పరమైన కార్గోను తరలించింది.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611722
కోవిడ్ -19 మహమ్మారిపై పోరులో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఎన్సిసి కేడెట్లు
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో సేవలు అందించేందుకు నేషనల్ కేడెట్ కోర్కు చెందిన కేడెట్ల సేవలను పౌర, పోలీసు యంత్రాంగం రంగంలోకి దించడం ప్రారంభించింది.
మరిన్ని వివరాలు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611716
దేశవ్యాప్తంగా 769 విదేశీ పర్యాటకులు తాము భారతదేశంలో నిలిచిపోయినట్టు, స్ట్రాండెడ్ ఇండియా పోర్టల్లో తొలి ఐదు రోజుల్లోనే నమోదు
భారత ప్రభుత్వానికి చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ 2020 మార్చి 31న www.strandedinindia.com పోర్టల్ ను ప్రారంభించింది.
కోవిడ్ -`19 మహమ్మారి ఫలితంగా దేశంలో విధించిన లాక్డౌన్తో దేశంలో ని వివిద ప్రాంతాలలో నిలిచిపొయిన విదేశీ పర్యాటకులకు సహాయం చేసేందుకు ఈ పోర్టల్ను ఏర్పాటు చేశారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611589
పిఎం కేర్స్ ఫండ్కు రూ.7 కోట్ల విరాళం ఇచ్చిన షిప్పింగ్ మంత్రిత్వశాఖ పిఎస్యుల ఉద్యోగులు
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611588
షిప్పింగ్ మంత్రిత్వశాఖకు చెందిన పోర్టులు, పిఎస్యులు పిఎం కేర్స్ ఫండ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి 52 కోట్ల విరాళం
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611563
ఆన్లైన్ బోధన, అభ్యాస ప్రక్రియలకు సంబంధించి పలు చర్యలు తీసుకున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన
విద్యార్ధులకు విద్యను అందించేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన పలు ఆన్లైన్, డిజిటల్ పద్జతులను అందుబాటులోకి తె్చింది. విద్యార్థులు తమ చదువు కొనసాగించేందుకు వివిధ వనరులను అందుబాటులో ఉంచాల్సిందిగా కేంద్రీయ విద్యాలయ సంఘటన దాని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611513
ఉపరాష్ట్రపతి భవన్లో దివ్వెలు వెలిగించిన ఉపరాష్ట్రపతి , వారి సతీమణి,
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న చర్య, నోవెల్ కరోనా వైరస్ వల్ల నెలకొన్న అంధకారం, నిరాశలను తరిమికొట్టడానికి మన సంఘటిత శక్తిని, ఐక్యతను చాటేందుకు ఉద్దేశించినదని ఉపరాష్ట్రపతి అన్నారు. టీమ్ వర్క్ కుగల గొప్ప శక్తిని ప్రదర్శించిన దేశ ప్రజలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611493
వైరస్ ల వ్యాప్తిని అరికట్టే అద్భుత కోటింగ్ను అభివృద్ధి చేసిన జె.ఎన్.సి.ఎ.ఎస్.ఆర్
JNCASR develops versatile coating to stop spread of viruses
మరిన్ని వివరాలకు
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611779
పిఐబి ఫీల్డ్ ఆఫీసులనుంచి సమాచారం
ఈశాన్య రీజియన్
• ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అరుణాచల్ చాప్టర్, రాష్ట్రప్రభుత్వ సహకారంతో టెలిమెడిస్ సేవలుఅందిస్తోంది. దీనిని 104,1075 నెంబర్లతో అనుసంధానం చేశారు.
• కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలలో సేవలు అందించడానికి ఆసక్తి కనబరిచే డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ స్వచ్ఛంద రిజిస్ట్రేషన్కు అస్సాం ప్రభుత్వం వెబ్సైట్ను ప్రారంభించనుంద
• మణిపూర్లో తొలి కోవిడ్ పేషెంట్కు పరీక్షలలో నెగటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ మంత్రి నిర్ధారణ
• మేఘాలయ కోవిడ్ -19 రహిత ప్రాంతంగా కొనసాగుతోంది. గౌహతికి చెందిన కోవిడ్ -19 పాజిటివ్ పేషెంట్తో సన్నిహితంగా తిరిగిన వ్యక్యులకు పరీక్షలలో నెగటివ్ వచ్చింది.
• మిజోరంలో లాక్డౌన్ సమయంలో స్థానిక టాస్క్ ఫోర్స్ కు ప్రశంసలు
• నాగాలాండ్ లోని 11 జిల్లాలు ఒక్కొక్కటి 5లక్షల రూపాయలను ఎన్.ఎస్.డి.ఎం.ఎ కింద మంజూరరు చేశాయి. ఇంతకు ముందు ఆమోదించిన 31 లక్షల రూపాయలకు ఇది అదనం.
• గ్యాంగ్టక్లో వైరస్ పరిశోధనా ప్రయోగశాలను ఐసిఎంఆర్ ప్రొవిజన్ల కింద ఏర్పాటు చేస్తారు.
• త్రిపురలో ఇప్పటి వరకూ ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు
పశ్చిమ రీజియన్:
• గుజరాత్లో కోవిడ్ -19 కొత్తకేసులు పదహారింటిని గుర్తించడంతో ,మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 144 కు పెరిగింది. ఈవిషయాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం తెలిపింది. అహ్మదాబాద్ నుండి పదకొండు కేసులు, వడోదరాలో రెండు, పటాన్, మెహసానా, సూరత్ నుండి ఒక్కొక్కటి నమోదయ్యాయి.
•మహారాష్ట్రలో 33 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులను మహారాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం నిర్ధారించింది, రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 781 గా ఉంది.
•పూణే లోని డివై పాటిల్ మెడికల్ కాలేజీలో ఒక ప్రమాదంలో గాయపడిన పేషెంట్కు చికిత్స చేస్తుండగా అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ కాలేజీకి చెందిన 42 మంది డాక్టర్లు, 50 మంది ఇతర వైద్య సిబ్బందిని క్వారంటైన్కు పంపారు.
• రాజస్థాన్లో మరో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇందులో ఆరుగురు ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ కు హాజరైన వారు ఉన్నారని రాజస్థాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా కోవిడ్-19 కుసంబంధించి సవివరమైన, తాజా సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫేస్బుక్ చాట్బాట్ ప్రారంభించింది.
• గుజరాత్లో కోవిడ్ -19 మొత్తం కేసుల సంఖ్య 144 కు పెరిగింది.
ఛత్తీస్ ఘడ్ లో
ఇప్పుడు ఒకే ఒక క్రియాశీల కోవిడ్- 19 పాజిటివ్ కేసు ఉంది. 10 మంది రోగులలో 9 మంది నయమై డిశ్చార్జ్ అయ్యారు.
• సామాజిక దూర మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడంతోపాటు, కొన్ని సూచనలతో గోవా మత్స్య శాఖ ఈ రోజు నుండి రాష్ట్రంలో చేపల అమ్మకాన్ని అనుమతించింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి చేపల అమ్మకం అక్కడ ఆగిపోయింది.
దక్షిణాది రీజియన్
• కేరళ: కొల్లాం జిల్లాలో నమోదైన తొలి కోవిడ్ కేసు నయమై, ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ వైరస్ కారణంగా కేరళకు చెందిన ఒక వ్యక్తి ఈ రోజు యుకెలో మరణించారు.
• తమిళనాడు: 82 కొత్త కేసులు ,2 మరణాలు నిన్న నమోదయ్యాయి. దీనితో మొత్తం మరణాలు 5, మొత్తం కేసులు 571, చెన్నైలో గరిష్ఠంగా కేసులు 98, కోయంబత్తూరులో ఆదివారం నాడు కేసుల సంఖ్య 29 నుంచి 58 కి పెరిగాయి.
• కర్ణాటక: నఇన్న 12 కొత్త కేసులు, మైసూరు 7, బెంగళూరు 2, బాగల్కోట్ 2, మొత్తం కేసులు 151, మరణాలు 4,
• ఆంధ్రప్రదేశ్ : మొత్తం పాజిటివ్ కేసులు ప్రస్తుతానికి 266కు చేరుకున్నాయి. ఇందులో 243 కేసులు ఢిల్లీ మీటింగ్ తో సంబంధం ఉన్నవి. ఢిల్లీ మీటింగ్ కు హాజరై వచ్చిన వారు ప్రాధమికంగా ఎవరిని కలుసుకున్నారన్న దానికి సంబంధించిన వెరిఫికేషన్ దాదాపు పూర్తి అయింది. కర్నూలులో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
• తెలంగాణ : సూర్యాపేట నుంచి కొత్తగా మరో 6 కేసులు నమోదయ్యాయి దీనితో మొత్తం కేసుల సంఖ్య 340 కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటెడ్ కోవిడ్ -19 మానిటరింగ్ సిస్టం యాప్ను అమలులోకి తెచ్చింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని విశ్లేషించడానికి వీలు కలుగుతుంది. ఆరోగ్య సిబ్బందిపై దాడులను ఎదుర్కొనేందుకు స్థానిక పోలీసులు ,వైద్య బృందాల వాట్స
(Release ID: 1611830)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam