ప్రధాన మంత్రి కార్యాలయం
రేపు జి20 ఆన్లైన్ సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి
Posted On:
25 MAR 2020 9:31PM by PIB Hyderabad
కరోనా వైరస్ సంబంధిత అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు జి20 దేశాల కూటమి ఆన్లైన్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో “ప్రపంచ మహమ్మారి కోవిడ్-19పై పోరాటంలో జి20 కూటమి అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. తదనుగుణంగా జి20 కూటమి అధ్యక్ష దేశం హోదాలో సౌదీ అరేబియా సమన్వయంతో రేపు ఆన్లైన్ ద్వారా సాగే సదస్సులో నిర్మాణాత్మక చర్చ జరుగుతుందని నేను భావిస్తున్నాను” అని ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
(Release ID: 1608251)
Visitor Counter : 94
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam