మంత్రిమండలి

అంత‌రిక్ష విభాగం పరిధి లో ఒక కొత్త కంపెనీ ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 19 FEB 2019 9:26PM by PIB Hyderabad

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ‘ఇస్రో’) కేంద్రాలు మరియు అంత‌రిక్ష విభాగం (డిఒఎస్‌) లో భాగమైన యూనిట్ లు చేప‌డుతున్న ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి [  ఆర్ & డి  ] కార్యకలాపాల ను వాణిజ్య స‌ర‌ళి లో వినియోగించుకోవ‌డం కోసం డిఒఎస్‌ పరిధి లో  ఒక నూతన కంపెనీ ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర‌ మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  

ముఖ్యాంశాలు:

ఐఎస్ఆర్ఒ కార్య‌క్ర‌మాల ను వాణిజ్య స‌ర‌ళి లో ఆచ‌ర‌ణాత్మ‌కం చేసేందుకు ఈ దిగువన పేర్కొన్న రంగాలు / మార్గాలు అవ‌కాశాల ను అందిస్తాయి:

1.  చిన్న ఉపగ్ర‌హాల కు సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని ప‌రిశ్ర‌మ కు బ‌ద‌లాయించ‌డం.  ఇందుకోసం కొత్త కంపెనీ డిఒఎస్‌/ ఐఎస్ఆర్ఒ ల నుండి లైసెన్సు ను తీసుకోవలసివుంటుంది.  ప‌రిశ్ర‌మ‌ల కు కంపెనీ స‌బ్-లైసెన్సు ను ఇవ్వాలి; 

2.  ప్రైవేటు రంగం స‌హ‌కారం తో చిన్న ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక (ఎస్ఎల్‌వి)ని త‌యారు చేయ‌డం;

3.  ప‌రిశ్ర‌మ ద్వారా పోలర్ ఎస్ఎల్‌వి ని ఉత్ప‌త్తి చేయ‌డం;

4.  ప్ర‌యోగం, ఇంకా అప్లికేశ‌న్స్ స‌హా అంత‌రిక్ష ఆధారిత ఉత్పత్తుల ను మ‌రియు సేవ‌ల‌ ను తయారు చేయడం, విక్ర‌యించ‌డం;

5.  డిఒఎస్ లో భాగ‌మైన యూనిట్ లు మ‌రియు ఇస్రో కేంద్రాలు అభివృద్ధిప‌ర‌చిన సాంకేతిక విజ్ఞానం బ‌దిలీ;

6.  కొన్ని ఉప సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ ను మ‌రియు ఉత్ప‌త్తుల‌ ను భార‌త‌దేశం లో, ఇంకా విదేశాల లో విక్ర‌యించ‌డం; మ‌రియు 

7.  భార‌త ప్ర‌భుత్వం యోగ్య‌మైన‌ద‌ని భావించిన మ‌రే ఇత‌ర విధినైనా నిర్వ‌ర్తించ‌డం.


**



(Release ID: 1565547) Visitor Counter : 317