వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అందుబాటులో సరిపడా ఉల్లి నిల్వలు


సీజనల్ ధరల ఒత్తిళ్ల నియంత్రణ లక్ష్యంగా అవసరానికి అనుగుణంగా, నియంత్రిత విధానంలో బఫర్ నిల్వలు విడుదల చేస్తోన్న ప్రభుత్వం

ఉల్లిపాయలతో నాసిక్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన మొదటి కందా ఎక్స్‌ప్రెస్

రైల్వే ర్యాకులు, రోడ్డు రవాణా ద్వారా హైబ్రిడ్ రవాణా విధానంలో ప్రధాన వినియోగ కేంద్రాలకు సరఫరా

ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇతర రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కిలో రూ.35 చొప్పున ఉల్లి విక్రయాలు

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 8:49PM by PIB Hyderabad

రాబోయే నెలల్లో తగినంత లభ్యతను నిర్ధారించడంసీజనల్ ధరల ఒత్తిళ్లను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను అవసరాలకు అనుగుణంగాఅత్యంత నియంత్రిత విధానంలో విడుదల చేయడం ప్రారంభించిందిప్రస్తుత మార్కెట్ పరిస్థితులుధరల పోకడల ఆధారంగా... రైల్వే ర్యాక్‌లురోడ్డు రవాణాతో కూడిన హైబ్రిడ్ రవాణా నమూనా ద్వారా ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయలు సరఫరా చేస్తోంది.

అందుబాటులో సరిపడా ఉల్లి నిల్వలుపటిష్ఠంగా ఉత్పత్తి  

2025-26లో ఉల్లిపాయల ఉత్పత్తి అంచనా 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందిఇది గత ఏడాది ఉత్పత్తి 307.67 లక్షల మెట్రిక్ టన్నులకు ఇది దాదాపు సమానందీనివల్ల రాబోయే నెలల్లో దేశీయ అవసరాలకు సరిపడా ఉల్లిపాయల లభ్యత ఉంటుందని భావిస్తున్నారుమెరుగైన ఉత్పత్తిబఫర్ స్టాక్‌ల లభ్యతమార్కెట్‌లో ముందస్తు చర్యల కారణంగా... రాబోయే నెలల్లో తగినంత సరఫరా ఉంటుందనీసీజనల్ ధరల ఒత్తిడి నియంత్రణలో ఉంటుందనీ అంచనాఉత్పత్తికి సంబంధించిన ఈ సానుకూల పరిస్థితుల దృష్ట్యా... 2026-27 సంవత్సరానికి గానూ 'ధరల స్థిరీకరణ నిధిబఫర్ కోసం రబీ సీజన్ ద్వారా 2.00 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందిఈ సేకరణ ప్రక్రియ నాఫెడ్ఎన్‌సీసీఎఫ్ ద్వారా 2026 మే 15 ప్రారంభమైందిఇప్పటివరకు బఫర్ కోసం సుమారు 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు సేకరించారు.

నిల్వల నిర్వహణనుకార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా 2026-27 సంవత్సరానికి గానూ పీఎస్ఎఫ్ ఉల్లిపాయల బఫర్ నిల్వల ఏజెన్సీగా సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)ని మొదటిసారిగా నియమించారుఓనంగణేశ చతుర్థిదుర్గా పూజదసరాదీపావళి వంటి పండగలతో పాటు వివాహాల సీజన్ కావడంతో... అధిక డిమాండ్సరఫరా వ్యవస్థ సంబంధిత అంశాల కారణంగా ఉల్లి ధరలు సాధారణంగా ఈ సమయంలో పెరుగుతుంటాయి.

అవసరానికి అనుగుణంగాఅత్యంత నియంత్రిత విధానంలో బఫర్ ఉల్లి నిల్వల విడుదల

తగినంత లభ్యతను నిర్ధారించడంధరల హెచ్చుతగ్గులను నివారించడం లక్ష్యంగా ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి అవసరానికి అనుగుణంగాఅత్యంత నియంత్రిత విధానంలో ఉల్లి నిల్వలను విడుదల చేయడం ప్రారంభించిందిప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయల రవాణాను సులభతరం చేస్తూ... రైల్వే ర్యాక్‌లురోడ్డు రవాణాతో కూడిన హైబ్రిడ్ రవాణా నమూనా ద్వారా ఈ సరఫరా కొనసాగుతోందిప్రస్తుత మార్కెట్ పరిస్థితులుధరల పోకడల ఆధారంగా ఉల్లిపాయల విడుదల పరిమాణంపరిధిమార్గాలను మరింత విస్తృతం చేయనున్నారు.

కిలో రూ.35 చొప్పున ఉల్లిపాయల విక్రయం

మొబైల్ వ్యాన్‌ల ద్వారా... ఎన్‌సీసీఎఫ్నాఫెడ్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా... సఫల్కేంద్రీయ భండార్ అవుట్‌లెట్‌ల ద్వారా కిలో ఉల్లిపాయలు రూ.35 చొప్పున విక్రయించడం ప్రారంభించనున్నారుకింది మార్గాల ద్వారా ఈ అమ్మకాలు జరుగుతాయి:

  • ఎన్‌సీసీఎఫ్: 9 అవుట్‌లెట్‌లు, 40 మొబైల్ వ్యాన్లు

  • నాఫెడ్: 13 అవుట్‌లెట్‌లు, 50 మొబైల్ వ్యాన్లు

  • కేంద్రీయ భండార్: సుమారు 100 అవుట్‌లెట్‌లు

వినియోగదారులకు సరసమైన ధరకే ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం.

బఫర్ ఉల్లిపాయల సరఫరాను బలోపేతం చేస్తున్న కందా ఎక్స్‌ప్రెస్

ఉత్పత్తి ప్రాంతాల నుంచి వినియోగ కేంద్రాలకు బఫర్ ఉల్లిపాయలను తరలించడానికి 'కందా ఎక్స్‌ప్రెస్కార్యక్రమం ఒక సమర్థమైన రవాణా మార్గంగా ఆవిర్భవించింది. 2024-25 సంవత్సరంలోదాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బఫర్ ఉల్లి నిల్వలను 14 రైల్వే ర్యాకుల ద్వారా ఐదు నగరాలకు రవాణా చేశారు. 2025-26 సంవత్సరంలో ఈ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తూదేశవ్యాప్తంగా 16 నగరాలకు 86 రైల్వే ర్యాకుల ద్వారా సుమారు 88,000 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రవాణా చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనాసిక్ నుంచి న్యూఢిల్లీకి కందా ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉల్లిపాయల రవాణా ప్రారంభమైందిమొదటి కందా ఎక్స్‌ప్రెస్ నాసిక్ నుంచి ఇప్పటికే బయలుదేరిందిఇది త్వరలోనే ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు చేరుకోనుందిచెన్నైకోల్‌కతాఎర్నాకులంగౌహతివారణాసిలక్నోపాట్నాచండీగఢ్జమ్మూఅమృత్‌సర్ వంటి ఇతర ప్రధాన వినియోగ కేంద్రాలకు రోడ్డు రవాణా ద్వారా సరఫరా కొనసాగుతోందిప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినియోగ కేంద్రాలకు బఫర్ ఉల్లిపాయలను సకాలంలో తరలించడానికి ఈ హైబ్రిడ్ రవాణా నమూనా వీలు కల్పిస్తుంది.

సమర్థంగా కొనసాగుతున్న ఉల్లి ఎగుమతులు

ఉల్లిపాయల ఎగుమతులు సమర్థంగా కొనసాగుతున్నాయిఏప్రిల్-జూన్ 2026 కాలంలోసుమారుగా 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు నమోదయ్యాయిమలేషియాశ్రీలంకయూఏఈనేపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఎగుమతులు జరిగాయిఇది దేశీయంగా ఉల్లి లభ్యత సౌకర్యవంతంగా ఉందని స్పష్టం చేస్తోంది.

579 కేంద్రాల్లో రోజువారీ పర్యవేక్షణ

వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశవ్యాప్తంగా 579 కేంద్రాల్లో ఉల్లిపాయలు సహా 41 నిత్యావసర సరుకుల రోజువారీ ధరలను పర్యవేక్షిస్తోందిడిమాండ్-సరఫరాలతో పాటు ఈ మార్కెట్ పోకడలు... విడుదల చేయాల్సిన బఫర్ స్టాక్ పరిమాణంగమ్యస్థానాలపై నిర్ణయాలకు కీలక సమాచారంగా ఉపయోగపడతాయిప్రభుత్వం రాష్ట్రాలవ్యాప్తంగా ఉల్లి ధరలుసరుకుల సరఫరా-లభ్యతను నిశితంగా పర్యవేక్షిస్తోందితగినంత సరఫరాను నిర్ధారించడానికిఅనవసరమైన ధరల పెరుగుదలను నివారించడానికి అవసరమైన చోట మరిన్ని చర్యలు చేపడుతోంది.

స్థిరంగాపరిమిత స్థాయిలో కొనసాగుతున్న కీలక నిత్యావసర సరుకుల ధరలు

కందులుశనగమసూర్మినుములుపెసలు వంటి కీలక పప్పుధాన్యాలతో పాటు టమాటాబంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల ధరలు ప్రస్తుతం స్థిరంగాపరిమిత పరిధిలో కొనసాగుతున్నాయి.

26.08.2026 నాటికి అఖిల భారత సగటు చిల్లర ధరలు కింది విధంగా ఉన్నాయి:

సరుకులు

అఖిల భారత సగటు చిల్లర ధర

టమాట

₹38.33/kg

బంగాళాదుంప

₹22.63/kg

శనగ పప్పు

₹86.71/kg

గోధుమ పిండి

₹40.48/kg

కంది పప్పు

₹123.30/kg

పాలు

₹60.82/litre

ఉల్లిపాయలు

37.87/kg

 

గమనించదగ్గ విషయం ఏమిటంటే... టమాటాబంగాళాదుంపశనగ పప్పు ధరలు ఏడాది కిందటి కంటే తక్కువగా ఉన్నాయి.

వినియోగదారుల ప్రయోజనాల పరరక్షణ లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ

సమతుల్యమైనరుజువు-ఆధారిత ధరల స్థిరీకరణ విధానం ద్వారా రైతులకు లాభదాయకమైన రాబడిని అందిస్తూనేవినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిఉల్లి ధరలుసరఫరాలభ్యతడిమాండ్ పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందితగినంత సరఫరాను నిర్ధారించడంసీజనల్ ధరల ఒత్తిళ్లను నియంత్రించడం కోసం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బఫర్ స్టాక్ విడుదలల పరిమాణంపరిధిమార్గాలను సర్దుబాటు చేస్తున్నారు.

****


(రిలీజ్ ఐడి: 2303662) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Odia , Kannada , Malayalam