వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేగాన్ని పుంజుకుంటున్న భారత్-జపాన్ పెట్టుబడుల భాగస్వామ్యం... జపాన్ నుంచి మరిన్ని సంస్థాగత పెట్టుబడులను ఆహ్వానించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


భారత పటిష్ఠమైన పురోగతి అంశాలు, సెమీకండక్టర్లు, ఏఐ, స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లోని అవకాశాలను ప్రస్తావించిన శ్రీ పీయూష్ గోయల్

భారత్‌పై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన జపాన్ ఆర్థిక సంస్థలు... పెట్టుబడి విధానాలు, లాభాలను స్వదేశానికి తరలించటంలో మరింత సౌలభ్యాన్ని కోరుకున్న కంపెనీలు

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 10:44AM by PIB Hyderabad

దీర్ఘకాలిక పెట్టుబడులను బలోపేతం చేయటంపెట్టుబడి భాగస్వామ్యాన్ని పెంపొందించటంభారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ భాగస్వామ్య విస్తరణపై ఆ దేశంలోని ప్రముఖ ఆర్థికపెట్టుబడి సంస్థల సీనియర్ నేతలతో కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ టోక్యోలో చర్చలు జరిపారు.

ఎంయూఎఫ్‌జీడెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ (డీబీజే), మిజుహోమోర్గాన్ స్టాన్లీనోమురానిప్పన్ లైఫ్ సంస్థల సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారుభారతదేశ ఆర్థిక దృక్పథంనూతన పెట్టుబడి అవకాశాలుభారత్‌లో జపాన్ సంస్థాగత పెట్టుబడులను మరింత సులభతరం చేసే చర్యలపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

భారత ఆర్థిక వ్యవస్థ బలాన్నిస్థిరత్వాన్ని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారుప్రపంచ అనిశ్చితుల మధ్య గతేడాది భారత్‌ 7.7 శాతం వృద్ధి రేటును సాధించిందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు కృషి చేస్తోందని తెలిపారుబలమైన భారత బ్యాంకింగ్ రంగంపటిష్ఠమైన పెట్టుబడుల సామర్థ్యంతగ్గిన మొండి బకాయిలుపెరుగుతున్న మధ్యతరగతి వర్గంపెరుగుతున్న వ్యక్తిగత ఆదాయాలునిలకడైన ఆర్థిక వృద్ధికి కీలక శక్తి అని తెలిపారు.

సెమీకండక్టర్లుకృత్రిమ మేధడేటా సెంటర్లుపునరుత్పాదక ఇంధనంగ్రీన్ హైడ్రోజన్అధునాతన తయారీడిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లోని గణనీయమైన అవకాశాలను జపాన్ పెట్టుబడిదారులకు మంత్రి వివరించారుఇంధన వినియోగం ఎక్కువగా ఉండే డిజిటల్ పరిశ్రమల అభివృద్ధికి భారతదేశంలో పెరుగుతున్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యంజాతీయ విద్యుత్ గ్రిడ్ కీలక ఆధారంగా నిలుస్తున్నాయని... తయారీసాంకేతిక రంగాల్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ నూతన అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు.

భారత్-జపాన్ సంబంధాల వ్యూహాత్మకసమగ్ర స్వభావాన్ని తెలియజేస్తూ... తయారీసాంకేతికతపెట్టుబడి రంగాల్లో ప్రపంచ కేంద్రంగా మారే ప్రయాణంలో జపాన్‌ను విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ భావిస్తోందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారుమేధో సంపత్తి హక్కుల పరిరక్షణఅత్యుత్తమ ప్రతిభావంతులను కలిగి ఉండటంవిధానపరమైన సంస్కరణలుమరింత అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడించారు.

 

భారత్‌తో పెరుగుతున్న భాగస్వామ్యాన్ని పంచుకుంటూ... దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై జపాన్ ఆర్థిక సంస్థలు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాయిశ్రీరామ్ ఫైనాన్స్‌లో సుమారు బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు పునరుత్పాదక ఇంధనంహైడ్రోజన్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నట్లు ఎంయూఎఫ్‌జీ పేర్కొందిభారత వ్యూహాత్మకతరియల్ ఎస్టేట్ అభివృద్ధివెంచర్ క్యాపిటల్ఇతర దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలపై పెరుగుతున్న ఆసక్తిని డీబీజే వివరించింది.

 

భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపనీస్ కంపెనీల లాభం పెరుగుతోందని, పుణేలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌తో సహా భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు మిజుహో వెల్లడించిందితమ కంపెనీకి అత్యంత కీలకమైన ప్రపంచ కేంద్రాల్లో భారత్‌ ఒకటని మోర్గాన్ స్టాన్లీ తెలిపిందిఇక్కడ 19,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారనిభారత్‌లోని కంపెనీ కార్యకలాపాలు అధిక విలువ గల మూలధన మార్కెట్లుఆర్థిక సేవల కార్యకలాపాల దిశగా ఎదుగుతున్నట్లు స్పష్టం చేసింది.

 

భారతదేశంలో దీర్ఘకాలిక ఉనికినిజపాన్ కంపెనీలనుగ్లోబల్ పరిశ్రమలను భారతీయ అవకాశాలతో అనుసంధానించటంలో కీలక పాత్ర పోషించినట్లు నోమురా సంస్థ స్పష్టం చేసిందికృత్రిమ మేధసైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక సామర్థ్యాల ద్వారా కూడా ఇది సాధ్యమవుతోందని వెల్లడించింది. "దీర్ఘకాలిక పెట్టుబడిప్రాముఖ్యతను నిప్పన్ లైఫ్‌ స్పష్టం చేసిందిభారత్‌లో తమ సంస్థ కార్యకలాపాల ద్వారా అత్యధిక రాబడులు పొందుతున్నట్లు తెలిపింది.

 

 

భారతదేశంలోకి జపనీస్ సంస్థాగత పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ చర్చలు దృష్టి సారించాయిలాభాలను స్వదేశానికి తరలించే ప్రక్రియను సరళతరం చేయటంభారత పెట్టుబడుల మార్కెట్లలోకి ప్రవేశాన్ని సులభతరం చేయటందీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మరింత నియంత్రణపరమైన నిలకడను కల్పించటం వంటి అంశాల ప్రాముఖ్యతను చర్చలో పాల్గొన్నవారు తెలియజేశారు.

 

భారత్‌పై దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథం సానుకూలంగానే ఉందని జపనీస్ సంస్థలు స్పష్టం చేశాయికరెన్సీ విలువలో హెచ్చుతగ్గులుకొన్ని నియంత్రణవిధానపరమైన అంశాలు... స్వల్పకాలిక పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాయిఈ అభిప్రాయాన్ని శ్రీ పీయూష్ గోయెల్ స్వాగతించారుసులభతర వాణిజ్యాన్ని నిరంతరం మెరుగుపరిచేందుకుఅనువైన పెట్టుబడి వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

 

జపాన్భారత్‌ మధ్య పెట్టుబడులను పెంపొందించటానికి వేదికగాభారత్‌లోని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ద్వారంగా గిఫ్ట్‌ సిటీని వినియోగించుకునే అవకాశాలను ఈ సమావేశం పరిశీలించింది.

 

పెట్టుబడులు మాత్రమే కాక సాంకేతికతనూతన ఆవిష్కరణలుతయారీ సామర్థ్యాలుఉపాధిప్రపంచ విలువ శ్రేణులతో అనుసంధానాన్ని పెంచే దీర్ఘకాలిక భాగస్వామ్యాలను భారత్ కోరుకుంటోందని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారునూతనఅభివృద్ధి చెందుతున్న రంగాల్లో... ఆధునీకరణసాంకేతిక నవీకరణకు అవసరమైన నిలకడైన వ్యాపార అవకాశాలను తెలియజేశారు.

 

రాబోయే దశాబ్ద కాలంలో జపాన్ నుంచి భారత్‌లోకి 10 ట్రిలియన్ యెన్ల ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించాలనే భారత్-జపాన్ సంయుక్త లక్ష్యానికి ఈ చర్చలు ఎంతో ప్రాధాన్యతనిచ్చాయిభారత వృద్ధి అవకాశాలపై ప్రముఖ జపాన్ ఆర్థిక సంస్థలకున్న ప్రగాఢ విశ్వాసాన్ని ఈ సమావేశం స్పష్టం చేసిందిద్వైపాక్షిక పెట్టుబడులుసాంకేతికతవాణిజ్య సంబంధాల విస్తరణకున్న భారీ అవకాశాలను వెల్లడించింది.

 

భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికిభారత్ తదుపరి దశ వృద్ధిలోకి జపాన్ సంస్థాగత పెట్టుబడులను దీర్ఘకాలికంగా పెంచేందుకు ఈ సమావేశం మరో కీలక ముందడుగా నిలిచింది.

 

***


(రిలీజ్ ఐడి: 2303090) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam