ప్రధాన మంత్రి కార్యాలయం
పార్శీ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
15 AUG 2026 10:16AM by PIB Hyderabad
ఈ రోజు పార్శీ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో పార్శీ సమాజం చేసిన విశేష కృషి మన దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేసిందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘పార్శీ నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. వివిధ రంగాల్లో పార్శీ సమాజం చేసిన విశేష కృషి మన దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేసింది. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ శాంతి, ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
నవరోజ్ ముబారక్!’’
(रिलीज़ आईडी: 2299821)
आगंतुक पटल : 7