హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జిల్లా స్థాయి ఫోరెన్సిక్ మొబైల్ వ్యాన్ల వ్యవస్థ

प्रविष्टि तिथि: 05 AUG 2026 3:07PM by PIB Hyderabad

దేశంలో ఫోరెన్సిక్ సామర్థ్యాల ఆధునికీకరణ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలోని అన్ని జిల్లాలకురాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలకు (ఎఫ్ఎస్ఎల్) మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లను (ఎంఎఫ్‌వీలు) అందించడానికి రూ. 496.66 కోట్ల మొత్తాన్ని కేటాయించింది.

నేరం జరిగిన స్థలాల్లో శాస్త్రీయంగా తనిఖీలు చేపట్టడానికి ఆధారాల సేకరణకు వీలుగా ఈ వ్యాన్లలో ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలను అమర్చారు. ఈ వ్యాన్లలో నేర స్థలాల డాక్యుమెంటేషన్ఫోటోగ్రఫీవీడియోల చిత్రీకరణజీవసూక్ష్మ సాక్ష్యాల సేకరణవేలిముద్రలను గుర్తించడంసేకరించడంభౌతిక ఆధారాల ప్రాథమిక విశ్లేషణసేకరించిన ఆధారాలు పాడవకుండా సురక్షితంగా భద్రపరచడండిజిటల్ డాక్యుమెంటేషన్ఇతర అత్యవసర ఫోరెన్సిక్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 619 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లను కేటాయించారు. అయితే ఈ వ్యాన్ల సిబ్బంది నియామకంతో పాటు ఇతర రోజువారీ నిర్వహణ ఖర్చులను సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలే భరించాల్సి ఉంటుంది.

ఈ వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2294839) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali-TR , Tamil