నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025లో నౌకల రీసైక్లింగ్‌లో అగ్రగామిగా నిలిచిన భారత్

యూఎన్‌సీటీఏడీ ప్రకారం... 2025 నాటికి నౌకల రీసైక్లింగ్‌లో 35.4 శాతానికి పెరిగిన భారత్ వాటా

ఇది ప్రపంచస్థాయిలో అత్యధికం

మారిటైమ్ ఇండియా విజన్-2030 నౌకల రీసైక్లింగ్ లక్ష్యాన్ని అయిదేళ్ల ముందే సాధించిన భారత్

నౌకల రీసైక్లింగ్‌లో ప్రపంచస్థాయిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపిన ప్రధానమంత్రి నౌకా వాణిజ్య సంస్కరణలు: శ్రీ సర్బానంద సోనోవాల్

प्रविष्टि तिथि: 22 JUN 2026 5:54PM by PIB Hyderabad

2025 నాటికి నౌకల రీసైక్లింగ్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరించిన భారత్ప్రపంచస్థాయిలో తొలి స్థానంలో నిలిచిందిఐక్యరాజ్యసమితి వాణిజ్య-అభివృద్ధి సదస్సు (యూఎన్‌సీటీఏడీతాజా నివేదిక ప్రకారంప్రపంచ నౌకా రీసైక్లింగ్‌లో 2024లో 30.1 శాతంగా ఉన్న భారత్ వాటా... 2025 నాటికి 35.4 శాతానికి పెరిగిందిదేశంలో నౌకల రీసైక్లింగ్ 2024లో 1.86 మిలియన్ జీటీ (జీటీ)గా ఉండగా, 2025 నాటికి దాదాపు 60 శాతం పెరిగి 2.99 మిలియన్ జీటీకి చేరుకుందిఈ విజయంతోప్రపంచంలోనే అగ్రగామి నౌకా రీసైక్లింగ్ దేశంగా నిలవాలన్న మారిటైమ్ ఇండియా విజన్-2030 లక్ష్యాన్ని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన నౌకా వాణిజ్య విధాన సంస్కరణలువ్యాపార నిర్వహణను సులభతరం చేసిన కార్యక్రమాల ప్రభావాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుంది.

ఈ సందర్భంగా కేంద్ర నౌకాశ్రయాలునౌకాయానంజల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో నిరంతర విధాన సంస్కరణలుపరిశ్రమల కృషిఅంతర్జాతీయ పర్యావరణభద్రతా ప్రమాణాలను పాటించడం వంటి విజయాలకు నిదర్శనంగా భారత్ ప్రపంచంలోనే అగ్రగామి నౌకా రీసైక్లింగ్ దేశంగా ఆవిర్భవించిందిబాధ్యతాయుతమైనసుస్థిరమైన నౌకా రీసైక్లింగ్‌లో ప్రపంచస్థాయి కేంద్రంగా భారత్ స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందిఅని అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాలు

భారత నౌకా రీసైక్లింగ్ వ్యవస్థ బలోపేతంప్రపంచ మార్కెట్‌లో అధిక వాటాను దక్కించుకోవడం లక్ష్యంగా నౌకాశ్రయాలునౌకాయానంజల రవాణా మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టింది:

హాంగ్ కాంగ్ సదస్సు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా...:

నౌకల సురక్షితపర్యావరణ అనుకూల రీసైక్లింగ్ కోసం హాంగ్ కాంగ్ అంతర్జాతీయ సదస్సు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నౌకల రీసైక్లింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం నౌకల రీసైక్లింగ్ చట్టం-2019ని అమలు చేసిందిఈ చట్టాన్ని 2019లో భారత్ ఆమోదించింది.

నౌకల రీసైక్లింగ్ యార్డుల ఆధునికీకరణకు మద్దతుగా ప్రభుత్వం రూ.53.5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిందిదీంతో 115 కేంద్రాలు హెచ్‌కేసీ ప్రమాణాలకు అనుగుణంగా మారాయి.

షిప్-బ్రేకింగ్ క్రెడిట్ నోట్ పథకం:

ఎమ్‌వోపీఎస్‌డబ్ల్యూ ఈ 'షిప్-బ్రేకింగ్ క్రెడిట్ నోట్ స్కీమ్'ను ప్రారంభించిందిదీని కిందరీసైకిల్ చేసిన నౌకల స్క్రాప్ విలువలో 40 శాతానికి సమానమైన క్రెడిట్ నోట్‌ను నౌకా యజమానులు పొందుతారుఈ క్రెడిట్ నోట్‌నుభారతీయ షిప్‌యార్డ్‌లో నిర్మించే కొత్త నౌక విలువలో శాతం వరకు చెల్లింపు కోసం ఉపయోగించుకోవచ్చుతద్వారా ఇది నౌకల రీసైక్లింగ్దేశీయ నౌకా నిర్మాణం రెండింటినీ ప్రోత్సహిస్తుంది.

వాటాదారుల భాగస్వామ్యం:

సవాళ్లను గుర్తించిసంబంధిత పరిష్కారాలను అమలు చేయడానికి గుజరాత్ మారిటైమ్ బోర్డ్షిప్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలుక్యాష్ బయ్యర్లుక్లాసిఫికేషన్ సొసైటీలుఅంతర్జాతీయ సంస్థలతో ఎమ్‌వోపీఎస్‌డబ్ల్యూ నిరంతర సంప్రదింపులు జరుపుతుంది.

యూరోపియన్ యూనియన్ నౌకా రీసైక్లింగ్ నిబంధనలతో సమీకృతం:

యూరోపియన్ యూనియన్ ఆమోదించిన రీసైక్లింగ్ కేంద్రాల జాబితాలో భారతీయ షిప్ రీసైక్లింగ్ యార్డులను చేర్చడానికి భారత ప్రభుత్వం చురుగ్గా కృషి చేస్తోందిఆమోదాలను సులభతరం చేయడానికి సంబంధిత అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయి.

అలాంగ్ షిప్ రీసైక్లింగ్ యార్డ్ విస్తరణ:

ఆలాంగ్ షిప్ రీసైక్లింగ్ యార్డ్ ప్రణాళికాబద్ధమైన విస్తరణ ద్వారాభారత్ తన నౌకా రీసైక్లింగ్ సామర్థ్యాన్ని దాదాపు మిలియన్ లైట్ డిస్‌ప్లేస్‌మెంట్ టన్నులకు (ఎల్‌డీటీలకుపెంచడం ద్వారా దానిని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందిభవిష్యత్ డిమాండ్‌కు మద్దతునివ్వడానికిమౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికిప్రపంచ మార్కెట్‌లో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది.

బలమైన వృద్ధికి అవకాశాలు

బాల్టిక్అంతర్జాతీయ నౌకా వాణిజ్య మండలి ప్రకారం... రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 16,000 కంటే ఎక్కువ నౌకలను రీసైకిల్ చేయనున్నట్లు అంచనాప్రస్తుతం 35.4 శాతం మార్కెట్ వాటాతోభారత్ తన నౌకా రీసైక్లింగ్ సామర్థ్యాన్ని విస్తరిస్తూనేప్రతియేటా సుమారు 500 నుంచి 600 నౌకలను రీసైకిల్ చేయడానికి అనువైన స్థితిలో ఉంది.

నౌకా రీసైక్లింగ్ భవిత సుస్థిరం

ప్రపంచ నౌకా రీసైక్లింగ్‌లో భారత్ అగ్రస్థానానికి ఎదగడం... సుస్థిరతనియంత్రణ సంస్కరణలుమౌలిక సదుపాయాల అభివృద్ధిపరిశ్రమల సహకారాలపై దృష్టి సారించిన సమన్వయ వ్యూహాల ఫలితంభవిష్యత్తు కోసం బలమైన డిమాండ్అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారడంలో వృద్ధినిరంతర ప్రభుత్వ మద్దతుసర్క్యులర్ ఎకానమీసుస్థిర నౌకా వాణిజ్య అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తూనే... నౌకా రీసైక్లింగ్‌లో తన అగ్రస్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ పూర్తి సన్నద్ధతతో ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2276891) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil