ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర పర్భణీలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం
प्रविष्टि तिथि:
20 JUN 2026 6:53PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘మహారాష్ట్రలోని పర్భణీలో గోడ కూలడం వల్ల ప్రాణనష్టం సంభవించడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
***
(रिलीज़ आईडी: 2275794)
आगंतुक पटल : 8