ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో “సురక్షితమైన కృత్రిమ మేధ


సత్వర అమలు” అన్న అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 18 JUN 2026 5:01AM by PIB Hyderabad

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో “కృత్రిమ మేధను సురక్షితంగావేగంగాసమర్థంగా అమలు చేయడం” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన అవు‌ట్ రీచ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

మావన నాగరితక దిశను పునర్నిర్వచించగల సామర్థ్యం ఉన్న పరివర్తనాత్మక శక్తి కృత్రిమ మేధ అని ప్రధానమంత్రి అన్నారుఅయితేఅది ప్రజలకు సాధికారత కల్పించేలా కూడా ఉండాలని స్పష్టం చేశారుఈ విస్తృతమైన ఆలోచనతో.. ఈమధ్యే ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహించిందని వివరించారుఏఐ కోసం భారత్ అనుసరిస్తున్న మానవ కేంద్రక లేదా మానవ్ దార్శనికత గురించి తెలియజేశారుసమ్మిళిత్వంభద్రతప్రజాక్షేమం అనే సూత్రాలపై ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారపడి ఉండాలన్నారు.

సైబర్ స్పేస్‌ను ప్రపంచ మానవాళికి ప్రయోజనం చేకూర్చేదిగానే భారత్ పరిగణిస్తోందని ప్రధానమంత్రి చెప్పారుకీలకమైన సమాచార మౌలిక వసతులను భద్రపరిచేసైబర్ ముప్పును ఎదుర్కోవడంలో సాయపడే ఏఐ నమూనాలు ప్రజాస్వామ్య దేశాలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారుఏఐ అభివృద్ధిలో భద్రతనూవేగాన్నీసామర్థ్యాన్నీ కలిపి అందించే సమగ్ర విధానానికి ఆయన పిలుపునిచ్చారుఈ విషయంలో ఆయన నాలుగు సూచనలిచ్చారుఅవిరూపకల్పన స్థాయిలోనే ఏఐ వ్యవస్థలు సురక్షితంగా ఉండాలిఉమ్మడి ప్రమాణాలుప్రయోగ విధానాలుఉమ్మడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏఐ అమలు ఉండాలిడీప్‌ఫేక్‌లుఅసత్య సమాచారంసైబర్ నేరాలను నియంత్రించడంలో సమర్థవంతమైన ప్రపంచ సహకారం ఉండాలిసమ్మిళిత ప్రపంచాన్ని సాధించేలా గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం ఏఐ ప్రయోజనాలు చేరాలి.

మానవ సామర్థ్యాన్ని పెంపొందించేదిగామానవ ఎంపికకు సాధికారత కల్పించేదిగామానవ గౌరవాన్ని పరిరక్షించేదిగా ఏఐ ఉండాలని ప్రధానమంత్రి సూచించారుఈ లక్ష్యాలను ప్రోత్సహించడానికి భాగస్వాములతో కలసి భారత్ పనిచేస్తుందని తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2274516) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam