యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 'వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026'ను రేపు ప్రారంభించనున్నారు

చర్చల నుండి తీర్మానాల వైపు: నారీ శక్తి వందన్ : సమ్మిళిత వృద్ధిని పెంపొందించడం మరియు వికసిత్ భారత్ 2047 పై యువత మేథోమథనం

పార్లమెంటరీ విధానాలపై యువతకు ప్రత్యక్ష అనుభవం: పాలనా వ్యవస్థపై పరివర్తనాత్మక అవగాహన

యువత నేతృత్వంలోని దేశ నిర్మాణంలో, పాలనలో ఒక చారిత్రాత్మక ఘట్టం

प्रविष्टि तिथि: 15 JUN 2026 2:06PM by PIB Vijayawada

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు మరియు కార్మిక & ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా నాయకత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, 2026 జూన్ 15 నుండి 17 వరకు న్యూఢిల్లీలో 'విక్సిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026'ను నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి 'వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్'ను 2026 జూన్ 16న లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించనున్నారు. గత సంచికల విజయాల స్ఫూర్తితో, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తూ, యువ పౌరులకు పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తోంది.

ఈ కార్యక్రమం మూడు ప్రగతిశీల దశలలో సాగుతుంది, ప్రతి దశ యువత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేలా రూపొందించబడింది:

జిల్లా నోడల్ దశలు:

• '50 ఏళ్ల ఎమర్జెన్సీ: భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు' అనే అంశంపై 757 నోడల్ విశ్వవిద్యాలయాలు/సంస్థలలో విస్తృతమైన చర్చలు జరిగాయి, తద్వారా ఈ సంభాషణ దేశంలోని ప్రతి మూలకూ చేరింది.

• ప్రతి జిల్లా నుండి టాప్ 5 అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి రౌండ్లలో పాల్గొనే అవకాశం లభించింది.

రాష్ట్ర స్థాయి దశలు:

• అన్ని రాష్ట్రాల్లోని శాసనసభలు, ప్రముఖ ప్రభుత్వ వేదికలలో నిర్వహించబడిన ఈ రౌండ్లు, 'కేంద్ర బడ్జెట్ 2026: యువశక్తి ఆధారిత బడ్జెట్' అనే అంశంపై ప్రాంతీయ పాలనా నిర్మాణాలపై యువతకు అర్థవంతమైన అవగాహనను అందించాయి.

• రాష్ట్ర స్పీకర్లు మరియు గవర్నర్ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలు, ప్రజా చర్చలలో యువత గళాల స్థాయిని పెంచాయి.

జాతీయ రౌండ్ (జూన్ 15–17, 2026):

• అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతినిధులు గ్రాండ్ ఫైనల్ కోసం న్యూఢిల్లీలో సమావేశమవుతారు.

• జాతీయ స్థాయి కార్యక్రమం  అనేక ఆసక్తికరమైన అంశాలతో కూడి ఉంటుంది:

ప్రారంభ ప్రసంగాలు: ప్రతి బృందం నుండి ఒక ప్రతినిధి 'నారీ శక్తి వందన్: సమ్మిళితత్వాన్ని పెంపొందించడం మరియు వికసిత్ భారత్ 2047' అనే అంశంపై సభను ఉద్దేశించి 3 నిమిషాల పాటు ప్రసంగిస్తారు.

ప్రశ్నోత్తరాల సమయం: నిజమైన పార్లమెంటరీ స్ఫూర్తితో, బృందాలు ప్రశ్నలు అడగడం మరియు సమాధానాలు ఇవ్వడం (ప్రశ్నకు 3 నిమిషాలు, సమాధానానికి 3 నిమిషాలు) ద్వారా ఒక సామూహిక తీర్మానాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తాయి.

మాస్టర్ క్లాస్: ఒక ప్రముఖ వ్యక్తి ప్రసంగ కళ మరియు బహిరంగ ప్రసంగంపై మాస్టర్ క్లాస్‌ను నిర్వహిస్తారు, ఇది పాల్గొనే యువతలో నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

PM సంగ్రహాలయ సందర్శన: ప్రతినిధులు PM సంగ్రహాలయాన్ని సందర్శించడం ద్వారా భారతదేశపు గొప్ప రాజకీయ వారసత్వం మరియు నాయకత్వ చరిత్రను తెలుసుకుంటారు.

కొత్త పార్లమెంట్ సందర్శన: భారతదేశపు కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడం ద్వారా, దేశ ప్రజాస్వామ్య కేంద్రంతో పాల్గొనేవారికి ప్రత్యక్ష అనుబంధం ఏర్పడుతుంది.

అవార్డుల ప్రదానోత్సవం: యువ పాల్గొనేవారి విశేష కృషిని గుర్తిస్తూ, జూన్ 17న 'వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026' అవార్డులు ప్రదానం చేయబడతాయి.

'వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్' అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు — ఇది భారతదేశ యువత యొక్క శక్తి, ఆలోచనలు మరియు ఆశయాలను జాతీయ స్థాయి చర్చలో భాగం చేసే ఒక ఉద్యమం. సెంట్రల్ హాల్‌లో రూపొందించబడిన తీర్మానాలు ఈ మూడు రోజుల తర్వాత కూడా ప్రభావం చూపుతూనే ఉంటాయి; ఇవి 'వికసిత్ భారత్ 2047' దిశగా సాగుతున్న భారతదేశ ప్రయాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేలా యువ నాయకుల తరాన్ని ప్రేరేపిస్తాయి.


(रिलीज़ आईडी: 2272938) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Telugu , Kannada , Malayalam