కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026- 27 సంవత్సరానికి బీమా పరిధిలో ఉన్న వ్యక్తుల పిల్లల (వార్డ్ ఆఫ్ ఐపీ) కోటాలో


ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఈఎస్ఐసీ

దేశవ్యాప్తంగా 22 వైద్య కళాశాలల్లో 783 సీట్ల కేటాయింపు

ఈఎస్ఐసీ పరిధిలో ఉన్న కార్మికుల పిల్లలను సాధికారులను చేయడం లక్ష్యం

బీమా పరిధిలో ఉన్న కార్మికుల పిల్లలకు ధ్రువపత్రాల జారీ కోసం 2026 జూన్ 21 వరకు అందుబాటులో ఆన్‌లైన్ పోర్టల్

నాడు పోస్టు చేయడమైనది: 05 JUN 2026 12:08PM by PIB Hyderabad

2026-27 విద్యా సంవత్సరానికిగాను బీమా పరిధిలో ఉన్న కార్మికుల పిల్లల (వార్డ్ ఆఫ్ ఐపీకోటా కింద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీదరఖాస్తులను ఆహ్వానించిందిఉద్యోగుల రాజ్య బీమా (ఈఎస్ఐపథకం పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు మాత్రమే ఈ కోటాలో ప్రవేశానికి అవకాశం ఉంటుందిదేశవ్యాప్తంగా బీమా పరిధిలోకి వచ్చే కార్మికుల కుటుంబాలకు అర్థవంతమైన సామాజిక భద్రతతోపాటు విద్యాపరమైన ప్రయోజనాలను అందించడంలో ఈఎస్‌ఐసీ నిబద్ధతకు ఇది నిదర్శనం.

2026-27 విద్యా సంవత్సరానికి గాను వార్డ్ ఆఫ్ ఐపీ కోటా కింద దేశవ్యాప్తంగా మొత్తం 783 సీట్లను తాత్కాలికంగా కేటాయించారు. 22 వైద్యదంతనర్సింగ్ కళాశాలల్లో మొత్తం 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయివివిధ రాష్ట్రాల్లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలతోపాటు.. అర్హులైన కార్మికుల పిల్లల కోసం సీట్లను రిజర్వు చేసిన కొన్ని ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా ఇందులో ఉన్నాయికేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్నిర్వహించే కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రవేశాలు జరుగుతాయి.

కార్మికుల కుటుంబాల విద్యాపరమైన ఆకాంక్షలకు దన్నుగా నిలిచేందుకు ఈఎస్‌ఐసీ చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంక్షేమ కార్యక్రమాల్లో వార్డ్ ఆఫ్ ఐపీ కోటా ఒకటిఅర్హులైన విద్యార్థులు అత్యంత తక్కువ ట్యూషన్ ఫీజులతోనే ప్రొఫెషనల్ కోర్సులైన వైద్యనర్సింగ్ విద్యను అభ్యసించేందుకు ఈ పథకం దోహదపడుతుందిఈ కోటా కింద ప్రవేశం పొందే విద్యార్థులు ఎంబీబీఎస్బీడీఎస్ కోర్సులకు ఏడాదికి కేవలం రూ. 24,000, అలాగే బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఏడాదికి రూ. 10,000 ట్యూషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందిదీనివల్ల ఈఎస్‌ఐ పథకం లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య విద్య సులభంగాతక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి వస్తుందిఈ కోటాలో ప్రవేశాల కోసం ఎలాంటి క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్లు వసూలు చేయడానికి వీల్లేదు.

తల్లి లేదా తండ్రి ఈఎస్‌ఐ చట్టం కింద నమోదు చేసుకుని బీమా పొంది ఉండి, 2025 సెప్టెంబర్ 30 నాటికి ఈఎస్‌ఐ పథకానికి తమ వాటా చెల్లిస్తూ ఉంటే.. వారి పిల్లలు ఈ కోటాను పొందేందుకు అర్హులుదరఖాస్తుదారు సదరు బీమా పొందిన కార్మికుడి సంతానమై ఉండాలిఅలాగే నీట్ (యూజీ)- 2026 పరీక్షకు తప్పక హాజరై ఉండాలిఅలాగే జాతీయ వైద్యవిద్యా కమిషన్భారత దంతవైద్య విద్యా మండలిభారత నర్సింగ్ కౌన్సిల్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీమెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తిచేయాలివయోపరిమితి విషయానికొస్తే.. 2026 మార్చి నాటికి పురుష అభ్యర్థుల వయస్సు 21 ఏళ్లు దాటకూడదుఅయితే ఈఎస్‌ఐ చట్టం-1948 నిబంధనల ప్రకారంబీమా పరిధిలో ఉన్న కార్మికుడిపై ఆధారపడి ఉన్న అవివాహిత మహిళా (కుమార్తెలుఅభ్యర్థులకు వయోపరిమితి నిబంధన వర్తించదు.

ఈ ప్రవేశ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఈఎస్‌ఐసీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ‘వార్డ్ ఆఫ్ ఐపీ’ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుందిఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందే దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందిదీనిని ఈఎస్‌ఐసీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుఅభ్యర్థులు నిర్దేశిత వివరాలను అందించడంతోపాటు.. ఫొటోలువయస్సు ధ్రువీకరణ పత్రంనీట్(యూజీ)- 2026 అడ్మిట్ కార్డుఅవసరమైన చోట్ల సంబంధిత ఇతర సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ధ్రువీకరణ పత్రం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ 21. ఈ దరఖాస్తు ప్రక్రియ ఓటీపీతో ముడిపడి ఉన్నందున.. బీమా పరిధిలో ఉన్న కార్మికుడి మొబైల్ నంబరు ఈఎస్‌ఐసీ డేటాబేస్‌లో సరిగ్గా అప్‌డేట్ అయి ఉండేలా అభ్యర్థులు ముందుగానే సరిచూసుకోవాలివార్డ్ ఆఫ్ ఐపీ ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాతకేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడం కోసం.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీపోర్టల్‌లో అభ్యర్థులు విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రవేశ ప్రక్రియ గురించిన సమాచారం అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాల్సిందిగా.. యాజమాన్యాలుకార్మికులుప్రాంతీయ కార్యాలయాలుశాఖా కార్యాలయాలుహాస్పిటళ్లురాష్ట్ర ఈఎస్‌ఐ అధికారులు సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటికీ ఈఎస్‌ఐసీ విజ్ఞప్తి చేసిందిఈఎస్‌ఐ పథకం పరిధిలోకి వచ్చే యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఈ అవకాశం గురించి తెలియజేయాలనిపని ప్రదేశాల్లో ఈ అడ్మిషన్ నోటీసును అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని కోరిందిఅలాగే ఈఎస్‌ఐసీ రికార్డుల్లో కార్మికుల మొబైల్ నంబర్ల ధ్రువీకరణఅప్‌డేషన్ ప్రక్రియలో సహకరించాలని సూచించిందిదరఖాస్తులను సకాలంలో సమర్పించిప్రాసెస్ చేయడానికి వీలుగా అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని అందించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని క్షేత్రస్థాయి కార్యాలయాలకు సూచించింది.

ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటికార్మికులకువారి కుటుంబాలకు వైద్యఆరోగ్య సేవలను అందిస్తుందిప్రసూతి ప్రయోజనందివ్యాంగజనులూకార్మికులపై ఆధారపడిన వారికీ వివిధ సేవలతోపాటు సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను అందిస్తుందివార్డ్ ఆఫ్ ఐపీ కోటా వంటి పథకాల ద్వారా.. భారతీయ కార్మికుల సంక్షేమంసాధికారతసామాజిక ఆర్థిక పురోగతి పట్ల అంకితభావాన్ని ఈఎస్ఐసీ ఎప్పటికప్పుడు బలంగా చాటుకుంటోంది.

అర్హతదరఖాస్తు ప్రక్రియప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు ఈఎస్ఐసీ వెబ్‌సైట్‌ www.esic.gov.inమెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌ www.mcc.nic.in లను సందర్శించవచ్చు.  

***


(రిలీజ్ ఐడి: 2269341) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Malayalam