వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చరిత్రాత్మక కెనడా పర్యటనను ముగించుకున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతం, సీఈపీఏ చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో ఇండో-కెనడా సమాజం పాత్రను చాటేలా సాగిన పర్యటన

భారత ఆర్థిక పరివర్తననూ, భారత్ - కెనడా భాగస్వామ్య విస్తరణనూ చాటేలా.. టొరొంటో యూనివర్సిటీలోని మంక్ స్కూల్‌లో ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్

ఆంటారియో ఆవిష్కరణల కేంద్రం, కెనడా - ఇండియా టెక్ కనెక్ట్ ప్రతినిధులతో శ్రీ గోయల్ భేటీ.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్ సహకారంలో అవకాశాలపై చర్చ

భారత్ - కెనడా వ్యాపార సహకారాన్నీ, పెట్టుబడి భాగస్వామ్యాలనూ బలోపేతం చేసుకునేలా.. ప్రాంతీయ మండళ్లతో చర్చించిన శ్రీ పీయూష్ గోయల్

పెట్టుబడి భాగస్వామ్యాల విస్తరణ, భారత అంతర్జాతీయ ఆర్థిక పరపతిని బలోపేతం చేయడం లక్ష్యంగా.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, భారత పారిశ్రామిక ప్రముఖులతో చర్చించిన శ్రీ పీయూష్ గోయల్

నాడు పోస్టు చేయడమైనది: 28 MAY 2026 9:56AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ మూడు రోజుల కెనడా పర్యటన 2026 మే 28న ముగిసిందిఈ చరిత్రాత్మక పర్యటన అత్యంత ఫలప్రదంగా సాగిందిటొరంటోలో విద్యాసంస్థలుఆవిష్కర్తలుప్రభుత్వంవ్యాపార సంస్థలుసంస్థాగత పెట్టుబడిదారులుభారతీయ ప్రవాస సంఘాలతో పలు కీలక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఆయన షెడ్యూల్ కొనసాగిందిభారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యంలో నిరంతర ఉత్తేజాన్ని బలోపేతం చేయడంతోపాటు.. పెట్టుబడులుసాంకేతిక సహకారందీర్ఘకాలిక భాగస్వామ్యాలకు భారత్ ప్రధాన అంతర్జాతీయ గమ్యస్థానంగా ఎదుగుతున్న తీరును ఈ సమావేశాలు స్పష్టం చేశాయి.

అంతర్జాతీయ సంబంధాలుప్రభుత్వ విధానాల అధ్యయనంలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచినటొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్ఠాత్మక మంక్ అంతర్జాతీయ వ్యవహారాలు ప్రభుత్వ విధాన సంస్థ (గ్లోబల్ అఫైర్స్ పబ్లిక్ పాలసీ స్కూల్‌)లో అధ్యాపకులుపరిశోధకులువిద్యార్థులనుద్దేశించి కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రసంగంతో ఈ పర్యటనలో తొలి రోజు ప్రారంభమైందిఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ సాధిస్తున్న వేగవంతమైన ఆర్థిక పురోగతినివిప్లవాత్మక సంస్కరణలనుపెరుగుతున్న అంతర్జాతీయ ఖ్యాతిని వివరించారుభారత్ కెనడా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపెట్టుబడులుప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసేలా విద్యాసంస్థలుపరిశ్రమలువిధాన నిర్ణేతల మధ్య బలమైన సమన్వయానికి విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన వివరించారు.

అనంతరం శ్రీ పియూష్ గోయల్ ఆంటారియో ఆవిష్కరణల కేంద్రాన్ని (ఆంటారియో సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఓసీఐసందర్శించారుఅక్కడ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికిఅంకుర సంస్థలకు దన్నుగా నిలిచేందుకుపరిశ్రమలు విద్యాసంస్థలు ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి చేపడుతున్న విస్తృతమైన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారుఅనంతరం కృత్రిమ మేధక్వాంటం కంప్యూటింగ్ వంటి సరికొత్త సాంకేతిక రంగాలపై కెనడా-ఇండియా టెక్ కనెక్ట్ ప్రతినిధులతో ఫలప్రదంగా చర్చించారుఈ సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో వేగంగా విస్తరిస్తున్న అంకుర సంస్థలుఆవిష్కరణ వ్యవస్థలను వివరించడంతోపాటువృద్ధికి అపార అవకాశాలున్న ఈ రంగాల్లో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని కెనడా ఏ విధంగా ఏర్పరచుకోవచ్చో శ్రీ గోయల్ వివరించారుఇరు దేశాలకు పరస్పర పూరక నైపుణ్యాలున్న ఏఐక్లీన్‌టెక్అగ్రీటెక్డీప్ టెక్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత భారత్ కెనడా కారిడార్‌లో పనిచేస్తున్న ప్రాంతీయ మండళ్ల ప్రతినిధులతో శ్రీ పియూష్ గోయల్ విస్తృతంగా చర్చించారువ్యాపారపరంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచే మార్గాలపై ఈ సందర్భంగా వారి నుంచి నిర్మాణాత్మకమైన సలహాలుసూచనలను స్వీకరించారుఇరు దేశాల మధ్య వాణిజ్యంపెట్టుబడులుప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో ఈ మండళ్ల పాత్రను ఆయన అభినందించారుద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన నవోత్తేజంప్రస్తుత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద చర్చల ద్వారా లభించే విస్తృతమైన అవకాశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

కీలక ఉన్నత స్థాయి సమావేశంలో భాగంగా గౌరవ ఆంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్‌ను.. శ్రీ పియూష్ గోయల్ మర్యాదపూర్వకంగా కలిశారుభారత్ ఆంటారియో మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారుద్వైపాక్షిక వాణిజ్యంపెట్టుబడి భాగస్వామ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ఇరువురు నేతలూ.. ఇరుపక్షాలకు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన ఉత్పాదక రంగంసాంకేతికతమౌలిక సదుపాయాలుశుద్ధ ఇంధనంఆహార శుద్ధికీలక ఖనిజాల రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న వివిధ మార్గాలపై చర్చించారు.

కెనడా వాణిజ్య మండలి అధ్యక్షుడుసీఈవో శ్రీ గోల్డీ హైదర్‌తో శ్రీ పియూష్ గోయల్ అత్యంత ఫలప్రదమైన సమావేశాన్ని నిర్వహించారుభారత్ కెనడా మధ్య వాణిజ్య సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు.. సాంకేతికతమౌలిక సదుపాయాలుశుద్ధ ఇంధనంకీలక ఖనిజాలుఅధునాతన ఉత్పాదక రంగాల్లో పారిశ్రామిక నేతృత్వంలో భాగస్వామ్యాలను పెంపొందించడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారుఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో ఇండియా -  కెనడా సీఈఓ ఫోరమ్ కీలక పాత్ర పోషిస్తోందని ఇరుపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ అధ్యక్షులుసీఈవో జో టేలర్‌తో శ్రీ పియూష్ గోయల్ భేటీ అయ్యారుభారత్‌లో మౌలిక సదుపాయాలుపునరుత్పాదక ఇంధనంఆర్థిక సేవలుఆరోగ్య రక్షణసాంకేతికతడిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ఈ సందర్భంగా వారు విస్తృతంగా చర్చించారుసుస్థిరసమ్మిళిత వృద్ధికి దోహదపడుతూనే.. భారత్‌లో ఉన్న బలమైన అభివృద్ధి అవకాశాలనూఉత్పాదక రంగంతోపాటు దేశీయ పరిశ్రమలతో భాగస్వామ్యానికి గల విస్తృత అవకాశాలనూ మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు.

సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్షుడుసీఈవో జాన్ గ్రాహంతో కూడా శ్రీ పీయూష్ గోయల్ భేటీ అయ్యారుమౌలిక సదుపాయాలుసరుకు రవాణాపునరుత్పాదక ఇంధనంరవాణాఆర్థిక సేవలుడిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో భారత్‌లో దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడులను విస్తరించడంపై వారు చర్చించారుభారత్ వృద్ధిపై సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పటినుంచో కనబరుస్తున్న నమ్మకాన్ని శ్రీ పీయూష్ గోయల్ స్వాగతించారుమౌలిక సదుపాయాలురియల్ ఎస్టేట్ఆర్థిక సేవల రంగాల్లో ఆ సంస్థ భారీగా చేసిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారుభారత ఆర్థిక పునాదులుభవిష్యత్ పురోగతిపై అంతర్జాతీయంగా ఉన్న బలమైన విశ్వాసాన్ని ఇది చాటుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా భారత్ మరింత బలంగా తన ముద్రను వేయడం కోసం.. భారతీయ వ్యాపార ప్రతినిధి బృందంతో శ్రీ పియూష్ గోయల్ ఫలప్రదంగా చర్చించారుసుస్థిర వృద్ధికిఆవిష్కరణలకు అపారమైన అవకాశాలున్న శుద్ధ ఇంధనంఏరోస్పేస్ఆహార శుద్ధికీలక ఖనిజాలుమౌలిక సదుపాయాలుసాంకేతికత వంటి రంగాల్లో భాగస్వామ్యాలనుపెట్టుబడి అవకాశాలపై క్రియాశీలకంగా చర్చించాలని వ్యాపార వర్గాలను ఆయన కోరారుప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న భారత ఆర్థిక పరపతితో దేశ పరిశ్రమలకు సరికొత్త మార్గాలు తెరచుకుంటున్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారుభారత అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ దేశాలకు చాటడంలో పరిశ్రమలకు పూర్తి అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు.

కెనడా ఇండియా ఫౌండేషన్ సభ్యులతో ప్రత్యేకమైన సమావేశంతో శ్రీ పియూష్ గోయల్ తన మూడు రోజుల కెనడా పర్యటనను ముగించారుబలమైన వ్యాపార సంబంధాలుప్రజా సంబంధాల ద్వారా రెండు దేశాలను మరింత దగ్గర చేయడంలో ఇండో-కెనడా సమాజం అమూల్యమైన సహకారాన్ని అందించిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా వందకు పైగా భారతీయ పరిశ్రమల అధినేతలతో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శ్రీ పియూష్ గోయల్ కెనడాలో పర్యటించారుభారత్-కెనడా ఆర్థిక సంబంధాల సమగ్ర పునరుద్ధరణ దిశగా ఇదొక చరిత్రాత్మక ముందడుగుమే 25న ఒట్టావామే 26 నుంచి 28 వరకు టొరంటో నగరాల్లో సాగిన ఈ మూడు రోజుల పర్యటన సాగిందిఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యఆర్థిక బంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే దీని లక్ష్యంముఖ్యంగాప్రస్తుతం కొనసాగుతున్న భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏచర్చలను వేగవంతం చేయడంపై ఈ పర్యటనలో ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 8.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి దానిని 50 బిలియన్ డాలర్లకు విస్తరించాలన్న ఉమ్మడిప్రతిష్టాత్మక లక్ష్యానికి ఇరుదేశాల ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి

***


(రిలీజ్ ఐడి: 2266425) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam