ఉప రాష్ట్రపతి సచివాలయం
కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ బి. సి. ఖండూరి (విశ్రాంత) మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 2:16PM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ బి. సి. ఖండూరి (విశ్రాంత) మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మేజర్ జనరల్ ఖండూరి మరణంతో.. ఓ గొప్ప సైనికుడిని, సమర్థుడైన పాలకుడిని, అరుదైన నిజాయితీపరుడైన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందని ఒక సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
స్వర్ణ చతుర్భుజి, జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా దేశ రహదారి మౌలిక సదుపాయాల రూపురేఖలను మార్చడంలో మేజర్ జనరల్ ఖండూరి దార్శనిక కృషి దేశ అభివృద్ధి ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
డెహ్రాడూన్ పర్యటన సందర్భంగా దివంగత నాయకుడితో ఇటీవల తాను సమావేశమయ్యానని చెబుతూ.. లోక్సభలో మాజీ సహచరులుగా తమ అనుబంధాన్ని ఆప్యాయంగా గుర్తుచేసుకున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ విషాద సమయంలో ఖండూరి కుటుంబానికి, ఆయన అసంఖ్యాక అభిమానులకు, ఉత్తరాఖండ్ ప్రజలకు ఉపరాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2262768)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5