ఆయుష్
azadi ka amrit mahotsav

మండే ఎండలు, వడగాలులు… ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సూచనలు


ఎండల నుంచి రక్షణకు జాగ్రత్త చర్యలు, సంప్రదాయ వైద్య పద్దతులు, అత్యవసర చికిత్సపై మార్గదర్శకాలు

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 3:31PM by PIB Hyderabad

దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్‌ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం.. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత వేసవి కాలానికి గానూ సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది.

ఇందులో వడదెబ్బ, ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందేందుకు వీలుగా సాధారణ ప్రజలువృద్ధులుగర్భిణులుఉద్యోగులుకార్మికులు...అలాగే బహిరంగ సభలుక్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం వివరణాత్మక మార్గదర్శకాలను అందించిందిశరీరానికి సరిపడా నీరు తాగడంఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడంలేత రంగు కాటన్ దుస్తులను ధరించడంఆయా కాలాల్లో లభించే పండ్లుఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవడం వంటి అంశాల గురించి వివరించింది.

వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలుగర్భిణులువృద్ధులుఎండలో పనిచేసే కార్మికులుగుండె జబ్బులుబీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని.. వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

 

పని ప్రదేశాలు, బహిరంగ సభల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను సూచించిందివీటిలో విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడంక్రమం తప్పకుండా నీరు తాగేందుకు విరామం తీసుకోవడంవాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా కార్మికులకు తగిన వసతులు కల్పించడంవడదెబ్బ లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

తీవ్రమైన ఎండల కారణంగా వచ్చే అనారోగ్యాల పట్లవాటి ప్రమాద సంకేతాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సూచనల్లో తెలిపిందికళ్ళు తిరగడంతలనొప్పివాంతులుకంగారు లేదా స్పృహ తప్పడంశరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడండీహైడ్రేషన్ఫిట్స్ రావడం వంటి వాటిని తీవ్ర లక్షణాలుగా గుర్తించాలని పేర్కొందిముఖ్యంగా వడదెబ్బను తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా గుర్తించిందిపరిస్థితి విషమంగా ఉంటే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.

 

డీజీహెచ్ఎస్‌ పరిధిలోని ఆయుష్ విభాగం విడుదల చేసిన అదనపు సూచనల్లో తీవ్రమైన ఎండల నుంచి రక్షణ కోసం ఆయుర్వేదం, సిద్ధాయోగాయునానీహోమియోపతి వంటి ఆయుష్ విధానంలో అందుబాటులో ఉన్న సంప్రదాయ ఆరోగ్యనివారణ చర్యలను కూడా మంత్రిత్వ శాఖ పొందుపరిచింది.

శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగకొబ్బరి నీళ్లునిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు.. తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారుచేసే నిమ్మరసంమామిడిచింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది.

శరీరానికి చల్లదనాన్నిచ్చే సహజ ఆహార పదార్థాలతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, ఎండ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి శీతలీ ప్రాణాయామం వంటి శ్వాస పద్దతులుతేలికపాటి యోగాసనాలను పాటించాలని సిద్ధయోగా విభాగాలు సూచించాయి.

యునానీ వైద్య విధానంలో వడదెబ్బడీహైడ్రేషన్‌ నివారణకు సంప్రదాయ శీతల పానీయాలుఔషధ లేపనాలను సూచించగా.. హోమియోపతి విభాగం తీవ్ర ఎండ సమయాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించింది.

వేసవిలో దోస, పుచ్చనిమ్మఖర్బూజాబూడిద గుమ్మడిటమాటా వంటి శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చాలని ప్రజలకు సూచించింది.

భారత వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూవడగాలుల హెచ్చరికల సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.

వివరణాత్మక సూచనల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

The detailed advisory is attached.

 

(రిలీజ్ ఐడి: 2262429) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada