జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

వడగాలుల నుంచి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను కాపాడేందుకు


ముందస్తు చర్యలు చేపట్టాలని 21 రాష్ట్రాలు, ఎన్‌సీటీ ఢిల్లీని ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

ఆర్థికంగా వెనుకబడిన వారు, ఎండలో పనిచేసే కూలీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, శిశువులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం..

సరైన ఆశ్రయం, కనీస వనరులు లేక నిరాశ్రయుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న కమిషన్

రాష్ట్రాల్లోని ప్రస్తుత ఎస్ఓపీలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కోరిన కమిషన్

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 11:54AM by PIB Hyderabad

దేశంలో వీస్తున్న వడగాలుల నుంచి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను రక్షించేందుకు ముందస్తు చర్యలతోపాటు సహాయక చర్యలనూ ఖచ్చితంగా అమలు చేయాలని 21 రాష్ట్రాలతోపాటు ఎన్‌సీటీ-ఢిల్లీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీకోరిందిఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్అస్సాంబీహార్ఛత్తీస్‌గఢ్గుజరాత్హర్యానాహిమాచల్ ప్రదేశ్జార్ఖండ్కర్ణాటకకేరళమధ్యప్రదేశ్మహారాష్ట్రఒడిశాపంజాబ్రాజస్థాన్సిక్కింతమిళనాడుతెలంగాణత్రిపురఉత్తరప్రదేశ్పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

వడగాలుల తీవ్రతవ్యవధి పెరగడం వల్ల తగిన ఆశ్రయంవనరులు లేని అట్టడుగు వర్గాలుఆర్థికంగా వెనుకబడిన వారుబహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులునిరాశ్రయులపై తీవ్ర ప్రభావం పడుతోందని కమిషన్ గుర్తించిందివృద్ధులుపిల్లలునవజాత శిశువులు ఈ తీవ్రమైన వేడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు త్వరగా గురయ్యే అవకాశం ఉందని పేర్కొందివడగాలులు కేవలం ఆరోగ్యంపైనే కాకుండాజీవనోపాధి కోల్పోవడానికిఅగ్ని ప్రమాదాల ముప్పు పెరగడానికి కూడా కారణమవుతాయని హెచ్చరించింది.

ఈ కారణాలతో రాష్ట్రాలుఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సమగ్రమైనసమ్మిళిత చర్యల తక్షణ అవసరాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలియజేసింది. 2019-23 మధ్య దేశంలో వడదెబ్బతీవ్రమైన వేడి కారణంగా 3,712 మంది మరణించినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీడేటాను కమిషన్‌ ప్రస్తావించిందివడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికిప్రాణనష్టాన్ని నివారించడానికి ఇప్పటికే వారి వద్ద ఉన్న ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీలు), జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సహాయక చర్యల ప్రణాళికను రూపొందించివాటి అమలును సులభతరం చేయాలని కమిషన్ వారిని కోరింది.

రాష్ట్రకేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో అన్ని జిల్లాల నుంచి సేకరించిన ఏకీకృత చర్యల నివేదికలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2256401) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Gujarati , Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam