ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ శివరాజ్ పాటిల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 12 DEC 2025 10:26AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ శివరాజ్ పాటిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారుప్రజా సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అనుభవజ్ఞులైన నాయకుడిగా శ్రీ పాటిల్‌ను ప్రధానమంత్రి అభివర్ణించారు.

ప్రధానమంత్రి తన సందేశంలో శ్రీ పాటిల్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారుశ్రీ పాటిల్ తన సుదీర్ఘమైనవిశిష్టమైన ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగాఎంపీగాకేంద్రమంత్రిగామహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గాలోక్‌సభ స్పీకర్‌ సహా పలు హోదాల్లో దేశానికి సేవలందించారని అన్నారుశ్రీ పాటిల్ సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధతతోప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన అంకితభావంతో పని చేశారని తెలిపారు.

గత కొన్నేళ్లుగా శ్రీ పాటిల్‌తో ఉన్న తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారుకొద్ది నెలల కిందట శ్రీ పాటిల్ తన నివాసానికి వచ్చిన సమయంలో చివరగా ఆయనతో సమావేశమైనట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఎక్స్” వేదికగా చేసిన పలు పోస్టులలోశ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"శ్రీ శివరాజ్ పాటిల్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందితన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎమ్మెల్యేఎంపీకేంద్ర మంత్రిమహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గానూఅలాగే లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలందించిన అనుభవజ్ఞులైన నాయకుడాయనసమాజ సంక్షేమానికి కృషి చేయడమంటే ఆయనకు ఎంతో మక్కువగత కొన్నేళ్లుగా అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడే అవకాశం లభించిందికొన్ని నెలల కిందటే నా నివాసానికి వచ్చిన సందర్భంలో ఆయనతో చివరగా మాట్లాడానుఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానుఓం శాంతి."

 

***


(రిలీజ్ ఐడి: 2254490) సందర్శకుల సూచీ సంఖ్య : : 6