ప్రధాన మంత్రి కార్యాలయం
బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 8:38AM by PIB Hyderabad
బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
బసవ జయంతి విశిష్ట సందర్భంగా జగద్గురు బసవేశ్వరకూ, కలకాలం నిలిచి ఉండే ఆయన బోధనలకూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని శ్రీ మోదీ అన్నారు. సమాజాన్ని న్యాయపూర్ణమైందిగా తీర్చిదిద్దాలని బసవేశ్వర తపించారనీ, ప్రజలకు సాధికారతను కల్పించడానికి అవిరామ కృషి చేశారనీ, ఇవి మనకు సదా స్ఫూర్తినిస్తాయనీ ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘బసవ జయంతి విశిష్ట సందర్భంగా, జగద్గురు బసవేశ్వరకూ, కలకాలం నిలిచి ఉండే ఆయన బోధనలకూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సమాజాన్ని న్యాయపూర్ణమైందిగా తీర్చిదిద్దాలని బసవేశ్వర తపించారు.. ప్రజలకు సాధికారతను కల్పించడానికి అకుంఠిత కృషి చేశారు.. ఇవి మనకు ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తాయి’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2253668)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam