ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 15 APR 2026 1:49PM by PIB Hyderabad

పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీమాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారుకర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారుపరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీకేంద్ర మంత్రులు హెచ్ డీకుమారస్వామి గారుశోభా కరంద్లాజే గారుకర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారురాష్ట్ర మంత్రి ఎన్చెలువరాయస్వామి గారుసకల సాధువులందరికీఇతర ప్రముఖులుఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.

మిత్రులారా,

నేడు మాటల్లో వర్ణించలేని భావోద్వేగాలతో నా మనసు నిండిపోయింది. శ్రీ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకోవడంపూజలు చేసుకోవడంశ్రీ గురు భైరవైక్య దేవాలయ గొప్ప ప్రారంభోత్సవాన్ని వీక్షించడంచారిత్రాత్మక జ్వాలా పీఠంలో సమయాన్ని గడపడంఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన సాధువుల సాంగత్యాన్ని పొందడంఇక్కడకు విచ్చేసిన జనసమూహాన్ని చూడటం.. ఈ అనుభవాలన్నీ నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయిమీ మధ్యకు వచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానుఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.

మిత్రులారా,

కర్ణాటకకు రావడం నాకు ఎప్పుడూ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ కొత్త స్ఫూర్తిని పొందుతానుఅయితే మాండ్య జిల్లాలోని సక్కరె నగరకు (చక్కెర నగరంరావడం చాలా ప్రత్యేకమైనదిఈ నేల చెరకు తీపికి ప్రసిద్ధి చెందిందిఅదే తీపి ఇక్కడి ప్రజల మాటల్లో కూడా కనిపిస్తుందివారి ఆప్యాయతఆహ్వానం నా హృదయాన్ని హత్తుకుంటాయితత్వశాస్త్రంసాంకేతికత రెండింటిలోనూ కర్ణాటక సుసుంపన్నమైనదని నేను తరచుగా చెబుతుంటానుఇక్కడ తత్వశాస్త్రంలోని లోతుసాంకేతిక శక్తి రెండూ ప్రతిబింబిస్తాయిశ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ నేల మనకు ఇచ్చిన గొప్ప కానుకలుతత్వశాస్త్రంఆధ్యాత్మికనైతిక విలువల ద్వారా సమాజానికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తోంది.

మిత్రులారా,

వేల సంవత్సరాల కాలంగా కొనసాగుతున్న సజీవ నాగరికతకు భారత్ ఒక గొప్ప సాక్ష్యం. ఇంత సుదీర్ఘ కాలం పాటు సంప్రదాయాలు కొనసాగుతున్న ఉదాహరణలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటాయిశ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని చూసినప్పుడు.. ఈ నిరంతర సంప్రదాయానికి సజీవ రూపం మనకు కనిపిస్తుందిఈ పవిత్ర మఠం చరిత్ర దాదాపు రెండు వేల సంవత్సరాల పురాతనమైనదిదీని గురు సంప్రదాయంఆధ్యాత్మిక తత్వంసేవా ధోరణి తరతరాలుగా ఈ పుణ్యభూమిని సుసంపన్నం చేస్తున్నాయిఈ పరంపరలోనే జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ వంటి గొప్ప సాధువులు ఆవిర్భవించిఈ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారునేడు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ అదే బాటలో కొత్త శక్తితోవేగంతోఅంకితభావంతో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు.

మిత్రులారా,

మన సమాజంలో కాలక్రమేణా ఎందరో గొప్ప వ్యక్తులు ఉద్భవించారు. వారు కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికే పరిమితం కాకుండా.. ప్రజల మధ్యే నివసించారువారి కష్టసుఖాలను అర్థం చేసుకొని.. ప్రజల బాధలను స్వయంగా అనుభవించారుఇబ్బందులుకష్టాల నుంచి బయటపడే మార్గాన్ని సమాజానికి చూపించారుజగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ అటువంటి దివ్య వ్యక్తిత్వం కలిగిన వారుభౌతికంగా ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. ఆయన ఉనికి ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుందిప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆయన ఎంతో కృషి చేశారుఆయన దగ్గర అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పటికీతన జీవితం కేవలం ధ్యానానికే పరిమితం కాలేదుగ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. గ్రామీణ యువత ఆశయాలనుసామాన్య ప్రజల సమస్యలను బాగా అర్థం చేసుకున్నారుఅందుకే మహాస్వామిజీ దృష్టిలో భక్తి అంటే సమాజం నుంచి దూరంగా వెళ్లడం కాదు.. సమాజం పట్ల బాధ్యతను స్వీకరించి ముందుకు సాగడం.

మిత్రులారా,

విద్యా రంగంలో మహాస్వామిజీ వందలాది సంస్థలను స్థాపించారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచి మెడికల్ఇంజినీరింగ్ వంటి వృత్తిపరమైన కోర్సుల వరకు విద్య అందుతోందిదీనివల్ల పేదగ్రామీణ కుటుంబాలకు చెందిన పిల్లలకు గొప్ప ప్రయోజనం చేకూరిందిఆరోగ్య రంగంలో కూడా ఆయన ఆలోచనా దృక్పథం విప్లవాత్మకమైనదిఆయన స్థాపించిన ఆరోగ్య సంస్థల్లో నేటికీ సేవా భావంతోనే కార్యకలపాలు సాగుతున్నాయినాణ్యమైన వైద్య సేవలు కొందరికే పరిమితమైన ప్రత్యేక హక్కు కాకూడదనిఅది ప్రతి పౌరుడికీ ఉండాలని ఆయన బలంగా నమ్మారు.

మిత్రులారా,

నేడు మన ప్రభుత్వం కూడా అదే దృక్పథంతో పని చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కోట్ల మంది పేద ప్రజలు ఉచితంగా వైద్య సౌకర్యం పొందుతున్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ పథకాన్ని విస్తరించాందీని ద్వారా వారు కూడా మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను పొందవచ్చు.

మిత్రులారా,

నేడు ఈ శ్రీ గురు భైరవైక్య ఆలయంలో గడపడం, జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ బాలగంగాధరనాథ మహాస్వామీజీ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానుమహాస్వామీజీ కరుణకు ప్రతిరూపమని మనందరికీ తెలుసుఆయన కరుణ కేవలం మానవులకే పరిమితం కాలేదుఅది సమస్త జీవరాశులకూ వర్తించిందినెమళ్ల సంరక్షణ కోసం ఆయన ప్రారంభించిన సామాజిక ఉద్యమమే ఇందుకు నిదర్శనంఈ రోజు స్వామీజీ నాకు ఇచ్చిన జ్ఞాపికలో కూడా నెమలి ఉందిఇది కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదుమన సాంస్కృతిక చైతన్యంతో కూడా ముడిపడి ఉందిఎందుకంటే నెమలి మన జాతీయ పక్షి మాత్రమే కాదుసుబ్రహ్మణ్య స్వామి వాహనం కూడాఢిల్లీలో ప్రజల ఆశీస్సులతో భారత ప్రభుత్వం నాకు కేటాయించిన అధికారిక నివాసంలో కూడా చాలా నెమళ్లు ఉన్నాయివాటిలో కొన్నింటితో నాకు మంచి స్నేహం కూడా కుదిరిందినెమలి ఎంత ప్రశాంతంగాఅందంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను.

మిత్రురాలా,

నేడు సద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామిజీ తన గురువుగారి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. గురువు చూపిన బాటలో నడుస్తూప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తున్నారుగురువు గౌరవార్థం శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని నిర్మించడం కేవలం ఒక భవనాన్ని నిర్మించడం మాత్రమే కాదు.. గొప్ప భావనను సాకారం చేసుకోవడంరాబోయే కాలంలో ఈ ప్రదేశం ఖచ్చితంగా సేవధ్యానంస్ఫూర్తికి కేంద్రంగా మారుతుంది.

మిత్రులారా,

శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం తొమ్మిది సూత్రాలపై పనిచేస్తుందిఅవి అన్నంఅక్షరంఆరోగ్యంఅధ్యాత్మికతఆశ్రయంఅరణ్యంఆకలు (గోవు), అనుకంప (కరుణ), అనుబంధంమనమందరం అదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేయాల్సిన తొమ్మిది అంశాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నానుఇవి నా తొమ్మిది విన్నపాలు.

మిత్రులారా,

నీటి ప్రాముఖ్యత ఈ మాండ్యకు బాగా తెలుసు. ఈ ప్రాంతమంతా కావేరి మాత ఆశీస్సులతోనే వృద్ధి చెందిందిఅందుకే నా మొదటి విన్నపం-నీటిని పొదుపు చేయడానికినీటిని మెరుగ్గా వినియోగించడానికి మనమందరం సంకల్పం తీసుకోవాలిచెట్లుప్రకృతికి సంబంధించి నా రెండో విన్నపం- ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్కప్రచారం ద్వారా కోట్ల మంది ప్రజలు తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటారుమనం కూడా మన తల్లుల పేరుతో మొక్కలు నాటిభూమాతను రక్షించుకుందాంపరిశుభ్రతకు సంబంధించి నా మూడో విన్నపం-అది మతపరమైన ప్రదేశమైనాబహిరంగ ప్రదేశమైనా లేదా గ్రామంనగరం కావచ్చు.. ప్రతిచోటా పరిశుభ్రతను పాటించడం మనందరి సమష్టి బాధ్యతకర్తవ్యంస్వదేశీస్వయం సమృద్ధికి సంబంధించి నా నాలుగో విన్నపం-మనం భారతీయ ఉత్పత్తులను వాడటం అలవర్చుకోవాలిభారతీయ తయారీదారులనుపరిశ్రమలను బలోపేతం చేయాలిఓకల్ ఫర్ లోకల్ (స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యతమంత్రంతో జీవించాలిదేశ సౌందర్యాన్ని చూడటానికి సంబంధించి నా అయిదో విన్నపం-మన దేశాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలిదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాలిస్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి.

మిత్రులారా,

మాండ్య కష్టపడి పనిచేసే రైతుల భూమి. రైతుల కోసం నా ఆరో విన్నపం-వారు రసాయన రహిత సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలినా ఏడో విన్నపం ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధించినది-ఈ ప్రాంతానికి రాగి ప్రాముఖ్యత గురించి బాగా తెలుసురాగి ముద్దనును ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన శ్రీ దేవెగౌడ ప్రస్తుతం మన మధ్యే ఉన్నారుచిరుధాన్యాలను కూడా యువత తమ ఆహారంలో భాగం చేసుకోవాలిమన దేశంలో స్థూలకాయం పెద్ద సవాలుగా మారిందిదీనిని ఎదుర్కోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించడానికి ప్రయత్నించండియోగాక్రీడలుశారీరక దారుఢ్యం సంబంధించి నా ఎనిమిదవ విన్నపం-మనమందరం వీటిని మన జీవితంలో భాగం చేసుకోవాలినా తొమ్మిదో విన్నపం సేవా భావానికి సంబంధించినది-దీనిని మీరు మీ పనుల ద్వారా నిరంతరం నిరూపిస్తూనే ఉన్నారు.


 

మిత్రులారా,

అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం సమాజాన్ని బలపరుస్తుందిఅది మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని అందిస్తుందిఈ తొమ్మిది విన్నపాల విషయాల్లో మనమందరం నిజాయితీగాసంకల్పంతో ముందుకు సాగితే అభివృద్ధి చెందిన కర్ణాటకఅభివృద్ధి చెందిన భారత్ దిశగా మనం వేగంగా అడుగులు వేయగలంఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలుఈ పవిత్ర సందర్భంగా ఈ పుణ్యభూమిలోఈ తపోభూమిలో మీతో కొంత సమయం గడిపేందుకు నన్ను ఆహ్వానించినందుకు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీకిశ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు,

అభినందనలు. ధన్యవాదాలు. 

 

***


(రిలీజ్ ఐడి: 2252385) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada