నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక సంవత్సరం 2025-26లో ప్రధాన ఓడరేవుల నుంచి రికార్డు స్థాయిలో 915 మిలియన్ టన్నుల సరకు రవాణా.. లక్ష్యాన్ని అధిగమించి 7.06 శాతం వృద్ధి నమోదు


పనితీరు మెరుగుదల, సామర్థ్య విస్తరణను ప్రతిబింబిస్తున్న బలమైన వార్షిక వృద్ధి

మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 దిశగా భారత వాణిజ్య పురోగతిని వేగిరం చేస్తున్న ఓడరేవులు

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2026 2:27PM by PIB Hyderabad

న్యూఢిల్లీ 05 ఏప్రిల్ 2026: భారత నౌకాయాన రంగంలో ప్రతిష్ఠాత్మక విజయం నమోదైందిఓడరేవులునౌకాయానజలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధాన ఓడరేవుల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 915.17 మిలియన్ టన్నుల (ఎంటీసరకు రవాణా జరగటంతో, 904 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని అధిగమించాయిగతేడాదితో పోల్చితే 7.06 శాతం వృద్ధి నమోదైందిఇది ఈ రంగం సాధించిన బలమైన పురోగతిమెరుగైన సామర్థ్యంనిరంతర వృద్ధి పథాన్ని స్పష్టం చేస్తోందిమారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047లో భాగంగా ఓడరేవుల వద్ద మౌలిక సదుపాయాలను ఆధునీకరించటానికిరవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచటానికిప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నౌకాయాన కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయటానికి భారత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలువ్యూహాత్మక పెట్టుబడుల ప్రభావాన్ని ఈ కీలక ఘట్టం తెలియజేస్తోంది.

కేంద్ర ఓడరేవులునౌకాయానజలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “ప్రధాన ఓడరేవుల నుంచి 915 మిలియన్ టన్నులకుపైగా సరకు రవాణాతో రికార్డు నెలకొల్పటం.. భారతదేశ నౌకా వాణిజ్య రంగాన్ని బలోపేతం చేయటంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను తెలియజేస్తుందిగౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా భారత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రపంచస్థాయిలో ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాంపనితీరులో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నాంనిరంతర రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాంమారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 లక్ష్యంతో ప్రపంచ నౌకాయాన శక్తి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే మా సంకల్పాన్ని ఈ విజయం మరింత బలోపేతం చేస్తోంది” అని అన్నారు.

ప్రధాన ఓడరేవులు నిలకడైన వృద్ధి కనబరుస్తూ.. దీన్‌దయాల్ పోర్టు అథారిటీ 160.11 మిలియన్ టన్నుల (ఎంటీసరకు రవాణాతో అగ్రస్థానంలో నిలవగాపరదీప్ పోర్టు అథారిటీ 156.45 ఎంటీతో రెండో స్థానంజవహర్‌లాల్ నెహ్రూ పోర్టు అథారిటీ (జేఎన్‌పీఏ) 102.01 ఎంటీతో మూడో స్థానంలో ఉన్నాయివీటితో పాటు విశాఖపట్నంముంబయిచెన్నైన్యూ మంగళూరు పోర్టు అథారిటీలు కూడా అద్భుతమైన పనితీరుని కనబరిచి మొత్తం సరకు రవాణాలో కీలక పాత్ర పోషించాయివృద్ధి రేటు ప్రకారం.. మోర్ముగావ్ పోర్టు అథారిటీ అత్యధికంగా 15.91 శాతం వృద్ధిని నమోదు చేయగాకోల్‌కతా డాక్ సిస్టమ్ 14.28 శాతంజేఎన్‌పీఏ 10. 74 శాతం వృద్ధిని కనబరిచాయి.

నౌకాశ్రయాల సామర్థ్యం పెంపుదలమౌలిక సదుపాయాల ఆధునీకరణబహుముఖ అనుసంధానతను బలపరచటంఅంతర్గత ప్రాంతాలతో అనుసంధానత వల్ల సరకు రవాణాలో స్థిరమైన వృద్ధి నమోదైందిడిజిటల్స్మార్ట్ పోర్టు విధానాలతో బొగ్గుముడి చమురుకంటైనర్లుఎరువులుపీఓఎల్ వంటి కీలక ఉత్పత్తుల నిర్వహణ పెరగటంఓడలు తిరిగి వెళ్లే సమయం తగ్గటంసులభతర వాణిజ్యం మెరుగుపడటం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుఓడరేవుల ఆధారిత అభివృద్ధిరవాణా సమగ్రతస్థిరత్వంపై దృష్టి సారిస్తూ.. నౌకా వాణిజ్య వ్యూహాన్ని కేంద్ర ఓడరేవులునౌకాయానజలమార్గాల మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకెళ్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రికార్డు.. పెరుగుతున్న వాణిజ్య విశ్వాసాన్నికార్యకలాపాల సామర్థ్యాన్నిసామర్థ్య వినియోగాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన విధానపరమైన చర్యల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందివిధానపరమైన సుస్థిర మద్దతుమౌలిక సదుపాయాల పెట్టుబడులతో మరిన్ని లక్ష్యాలను అధిగమించేందుకు భారత్‌లోని ప్రధాన ఓడరేవులు సిద్ధంగా ఉన్నాయిఇవి దేశ ఆర్థిక వృద్ధికిఅంతర్జాతీయ వాణిజ్య నాయకత్వానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2249253) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Gujarati