ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన


మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న పీఎం

జైనమతం సుసంపన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శించే మ్యూజియం.. జైనమత పరిణామ క్రమాన్ని, లోతైన సాంస్కృతిక ప్రభావాన్ని తెలియజేసే మ్యూజియం

భారతదేశ సెమీ కండక్టర్ రంగ ప్రయాణంలో కీలక ఘట్టం.. సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంటును ప్రారంభించనున్న పీఎం

భారత్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్న రెండో సెమీ కండక్టర్ తయారీ కేంద్రం

చిప్ వ్యవస్థలో భారత్ స్వావలంబన లక్ష్యానికి ఊతమిచ్చేలా స్వదేశీ కండక్టర్ ప్యాకేజింగ్ సామర్థ్యాన్ని పెంచే కేంద్రం

వావ్-థరాడ్‌లో రూ.20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితమివ్వనున్న పీఎం

విద్యుత్, రైల్వేలు, రోడ్డు రవాణా, రహదారులు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల కోసం ఈ ప్రాజెక్టులు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 11:05AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారుఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారుమధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించిఅక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారుఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవాలు చేసివాటిని జాతికి అంకితం చేస్తారుఅనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.

గాంధీనగర్‌లో పీఎం

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఅశోక చక్రవర్తి మనవడుజైన సంప్రదాయంలో అత్యంత గౌరవనీయుడైన సామ్రాట్ సంప్రతి పేరు మీదుగా ఈ మ్యూజియానికి నామకరణం చేశారుఅహింసా మార్గాన్ని అనుసరిస్తూ జైన మత వ్యాప్తికి ఆయన కృషి చేశారుజైన మత గొప్ప చారిత్రకసాంస్కృతికఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ మ్యూజియం ప్రపంచానికి చాటి చెబుతుంది.

మహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలోని ఈ మ్యూజియం.. భారత నాగరికతసంప్రదాయాల్లోని విశిష్ట అంశాలకు అంకితం చేసిన ఏడు ప్రత్యేక విభాగాలతో ఉందిఇది సందర్శకులకు శతాబ్దాల కాలం నాటి జ్ఞానంవారసత్వాల సమగ్ర సమాచారాన్ని అందిస్తుందిఇక్కడి సంప్రదాయ ప్రదర్శనలతో పాటు ఆధునిక డిజిటల్ఆడియో-విజువల్ సౌకర్యాలు సందర్శకులకుపరిశోధకులకుపండితులకు తన్మయత్వంతో కూడినఆకర్షణీయమైన అనుభూతిని కలిగిస్తాయి.

అత్యంత నైపుణ్యంతో చెక్కిన రాతిలోహ విగ్రహాలుభారీ తీర్థ పట్టాయంత్ర పట్టాసూక్ష్మ చిత్రలేఖనాలువెండి రథాలునాణేలుపురాతన రాతప్రతుల వంటివి ఏడు భారీ గ్యాలరీల్లో కొలువుదీరాయిరెండు వేలకుపైగా అరుదైన నిధులను విశాలమైన హాలులో ప్రదర్శించటం ద్వారా జైనమత పరిణామ క్రమాన్నిదాని లోతైన సాంస్కృతిక ప్రభావాన్ని కాలక్రమానుసారంగా అర్థం చేసుకునేందుకు సందర్శకులకు ఈ మ్యూజియం తోడ్పడుతుంది.

సనంద్‌లో పీఎం

అహ్మదాబాద్‌లోని సనంద్ జీఐడీసీలో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుఇది ఈ యూనిట్‌లో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించటమే కాకభారత సెమీ కండక్టర్ రంగ ప్రయాణంలో కీలక ఘట్టంగా నిలవనుంది

అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ (ఐపీఎంఎస్తయారీతో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుందిఆటోమోటివ్పారిశ్రామిక అవసరాలకు అవసరమైన చిన్నసమర్థవంతమైనవిశ్వసనీయ పవర్ స్విచ్చింగ్ సిస్టమ్స్‌లో ఇవి అత్యంత కీలకమైన భాగాలుఒక్కో మాడ్యూల్‌లో ఉండే 17 చిప్స్‌ను కాలిఫోర్నియాకు చెందిన ఆల్ఫా అండ్ ఒమేగా సెమీ కండక్టర్ (ఏఓఎస్సంస్థకు సరఫరా చేస్తారుఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యాక రోజుకు 6.33 మిలియన్ల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది.

ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో భాగంగా కేన్స్ సెమీకాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం కీలక ముందడుగుఈ పథకం ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లోమైక్రాన్ టెక్నాలజీ తర్వాత వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించనున్న రెండో సెమీ కండక్టర్ కేంద్రం ఇదే అవుతుంది.

భారతదేశంలో ఉత్పత్తి దశలోకి అడుగుపెడుతున్న రెండో ఓఎస్ఏటీ/ఏటీఎంపీ (అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ అసెంబ్లీటెస్టింగ్మార్కింగ్ప్యాకింగ్యూనిట్‌గా నిలవటమే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతభారత సంతతికి చెందిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్సంస్థ సెమీ కండక్టర్ తయారీ రంగంలోకి రావటాన్ని ఇది సూచిస్తుందితద్వారా దేశీయ ఉత్పాదక సామర్థ్యం బలోపేతం అవుతుంది

భారత సెమీ కండక్టర్ తయారీ రంగంలో లోటును భర్తీ చేస్తూదేశీయంగా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ సామర్థ్యాన్ని పెంపొందించటానికి ఈ కేంద్రం దోహదపడుతుందితద్వారా అత్యాధునిక సాంకేతిక తయారీ రంగంలో స్వావలంబన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.

వావ్-థరాడ్‌లో పీఎం

రూ. 20,000 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిప్రారంభోత్సవాలను నిర్వహించిజాతికి అంకితం చేయనున్నారుఇవి విద్యుత్రైల్వేరహదారి రవాణాజాతీయ రహదారులుఆరోగ్యంపట్టణాభివృద్ధిగిరిజనాభివృద్ధిగ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు.

రూ. 5,100 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించినప్రవేశ నియంత్రణ గల అహ్మదాబాద్-ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరచటంతో పాటు ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం (డీఎస్‌ఐఆర్‌)లో పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తూఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది.

రహదారికి ఇరువైపులా పార్శ్వ మార్గాలతో కూడిన 4-లైన్ల ఇదార్-బదోలి బైపాస్ సెక్షన్ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారుఎన్‌హెచ్‌-754కే లోని ధోలవీర-మౌవాన-వావువ-సంతల్పూర్ సెక్షన్ (ప్యాకేజీ-II)ను రెండు-లైన్ల రహదారికి ఇరువైపులా పార్శ్వ మార్గాలతో అభివృద్ధి చేసే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారుఈ ప్రాజెక్టులు హైవే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకధోలవీర వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయిరవాణా సామర్థ్యాన్ని పెంచిఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థికాభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

కీలకమైన రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారువీటిలో గాంధీనగర్-కోబా-ఎయిర్‌పోర్టు రోడ్డులోని భైజీపురా జంక్షన్ వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ ఒకటిఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించటమే కాకఫ్లైఓవర్ కింద సరైన పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుందిగాంధీనగర్-కోబా-అరోడ్రామ్ రోడ్డులోని పీడీపీయూ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారుగాంధీనగర్ నుంచి విమానాశ్రయాన్ని కలిపే ఈ రహదారి గుండా రోజూ 1,40,000కుపైగా వాహన రాకపోకలు సాగుతుంటాయిఈ నూతన ఫ్లైఓవర్ నిర్మాణంతో అహ్మదాబాద్గాంధీనగర్ మధ్య సీహెచ్-0 జంక్షన్ నుంచి విమానాశ్రయం వరకు ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

సుమారు రూ.3,650 కోట్ల వ్యయంతో నిర్మించిన కీలక విద్యుత్ సరఫరా ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారువీటిలో ఖావ్డా పూలింగ్ స్టేషన్-2, 4.5 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన తరలింపునకు అనుబంధ సరఫరా వ్యవస్థలు ప్రధానమైనవిఈ ప్రాజెక్టులు పునరుత్పాదక ఇంధన అనుసంధానాన్ని పటిష్టం చేయటమే కాకవిద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.

రైల్వే రంగానికి సంబంధించి కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారువీటిలో రాజ్‌కోట్-కనాలుస్ డబ్లింగ్ ప్రాజెక్టు (111.20 కి.మీ.)లో భాగంగా పూర్తి చేసిన కనాలుస్-జామ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు (28 కి.మీ.), గాంధీధామ్-ఆదిపూర్ సెక్షన్ (10.69 కి.మీ.) నాలుగు లైన్ల విస్తరణ ప్రాజెక్టులున్నాయిఈ ప్రాజెక్టుల వల్ల రైల్వే సామర్థ్యం పెరుగుతుందిరద్దీ తగ్గుతుందికార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడుతుందిప్రయాణికుల రాకపోకలుసరకు రవాణాను మరింత వేగవంతం చేసేందుకు ఇవి సహకరిస్తాయి.

హిమ్మత్‌నగర్-ఖేద్‌బ్రహ్మ మధ్య పూర్తయిన గేజ్ మార్పిడి ప్రాజెక్టును (54.83 కి.మీకూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుఈ ప్రాంతంలో రైలు అనుసంధానాన్ని మెరుగుపరచటంతో పాటు ప్రయాణికుల రాకపోకలను ఇది సులభతరం చేస్తుందిఖేద్‌బ్రహ్మ-హిమ్మత్‌నగర్-అసర్వా రైలు సర్వీసును కూడా ఆయన ప్రారంభిస్తారు.

నగర మౌలిక సదుపాయాలను పెంపొందించటంజీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా గుజరాత్ వ్యాప్తంగా సుమారు రూ.5,300 కోట్ల విలువైన 44 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేయనున్నారుఅహ్మదాబాద్‌లోని అసర్వా సివిల్ ఆస్పత్రిలో 858 పడకల రైన్ బసేరాగాంధీనగర్ సివిల్ ఆస్పత్రిజీఎంఈఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలోనూ ఈ తరహా సదుపాయాన్ని ప్రారంభించడంతో పాటు వివిధ ఆరోగ్యకుటుంబ సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

పర్యాటక అనుభూతిని మెరుగుపరచటంసాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించటమే లక్ష్యంగా పటాన్‌లోని రాణి కీ వావ్ వద్ద లైట్ అండ్ సౌండ్ షోవడ్ నగర్‌లోని శర్మిష్ట సరసు వద్ద వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ షో సహా పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుబనస్కాంతలోని బలరామ్ మహాదేవ్విశ్వేశ్వర మహాదేవ్ ఆలయాల వద్ద పర్యాటక మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన చేస్తారు.

సుమారు రూ.1,780 కోట్ల విలువైన రెండు భారీ నీటి పైప్‌లైన్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితమిస్తారువీటిలో బనస్కాంతలోని కసారా-దంతివాడ పైప్‌లైన్‌.. పటాన్బనస్కాంత జిల్లాల ద్వారా వెళ్లే దింద్రోల్-ముక్తేశఅవర్ పైప్‌లైన్‌ ప్రాజెక్టులున్నాయిఅంబాజీదాని పరిసర గ్రామీణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పథకానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారుఈ పథకం ద్వారా బనస్కాంత జిల్లాలోని దాంతాఅమీర్‌గఢ్‌ తాలూకాల్లోని సుమారు 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందిఇది అంబాజీ పట్టణంతో పాటు 34 గ్రామాలకు తాగునీటిని అందిస్తుందిసుమారు రూ.1000 కోట్ల పెట్టుబడి వ్యయంతో గాంధీనగర్‌లో చేపట్టనున్న మూడు సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ విస్తరణ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్‌లో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుగిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల సౌకర్యార్థం దీన్ని నిర్మించారు.


(రిలీజ్ ఐడి: 2246918) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam