పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్రోల్.. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ప్రభుత్వం

ప్రపంచ చమురు సంక్షోభం నుంచి వినియోగదారులు, చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ)కు ఊరట

అదనపు వ్యయం నుంచి ‘ఓఎంసీ’లకు పాక్షిక రక్షణ... చిల్లర ధరల్లో మార్పు లేదు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 2:36PM by PIB Hyderabad

పెట్రోల్డీజిల్‌లపై లీటరుకు ₹10 వంతున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ తగ్గించగాఈ నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చిందిపశ్చిమాసియా యుద్ధం వల్ల దానితో ముడిపడిన ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందిదీంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగాఅత్యధిక స్థాయిలో పెరిగిపోయాయిఈ మేరకు గత నెలలో 70 డాలర్లుగా ఉన్న బ్యారెల్‌ ముడిచమురు ధర ప్రస్తుతం 122 డాల్లర స్థాయికి దూసుకెళ్లిందిఅంటేనాలుగు వారాల్లోగా దాదాపు 75 శాతం పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితేఎక్సైజ్‌ సుంకం తగ్గింపు వల్ల పెట్రోల్డీజిల్ చిల్లర విక్రయ ధరల్లో మార్పేదీ ఉండదు. అంటేఎక్సైజ్ సుంకం కోత పంపుల వద్ద వినియోగదారులకు ధర తగ్గింపుగా ఉండదుఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ చమురు విక్రయ కంపెనీలు (ఓఎంసీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్భారత్ పెట్రోలియం కార్పొరేషన్హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లకు వాటిల్లే నష్టం నుంచి ప్రత్యక్ష ఉపశమనం లభిస్తుంది. ‘ఓఎంసీ’లు ఇప్పటికే తమ సరఫరా వ్యయంకన్నా చాలా తక్కువ ధరతో వినియోగదారులకు ఇంధన సరఫరా చేస్తున్నాయిఅంటేప్రస్తుత అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రకారంపెట్రోల్‌పై లీటరుకు సుమారు ₹26, డీజిల్‌పై ₹81.90 వంతున నష్టపోతున్నాయిఈ నష్టం రోజువారీగా దాదాపు ₹2,400 కోట్లు కాగాఎక్సైజ్ సుంకం తగ్గింపుతో  ఈ నష్టం లీటరుకు ₹10 చొప్పున భర్తీ అవుతుందితద్వారా ఈ రెండు ఇంధనాల చిల్లర విక్రయ ధర యథాతథంగా ఉండి, ‘ఓంఎసీ’ల నుంచి నిరంతరాయ ఇంధన సరఫరాకు భరోసా లభిస్తుంది.

ఈ పరిణామాన్ని ప్రపంచ ఇంధన మార్కెట్లతో పోల్చి చూస్తే మనకు ఒక అవగాహన కలుగుతుందిప్రస్తుత సంక్షోభం ఆరంభమైనప్పటి నుంచి దక్షిణ-ఆగ్నేయాసియా దేశాల్లో 30 నుంచి 50 శాతంఉత్తర అమెరికాలో 30 శాతంఐరోపాలో 20 శాతం వంతున ఇంధన ధరలు పెరిగాయికానీభారత ప్రభుత్వం మాత్రం ఈ అదనపు వ్యయ భారాన్ని ఆర్థికంగా తానే భరిస్తూ ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.

పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్‌ సింగ్ పూరి కిందివిధంగా ప్రకటించారు:

ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం ముందున్న మార్గాలు రెండుఒకటి... ఇతర దేశాల తరహాలో భారత్‌లోనూ విపరీతంగా ధరల పెంపురెండోది... అంతర్జాతీయ అనిశ్చితి నుంచి దేశ పౌరులకు రక్షణ దిశగా ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించడంఈ నేపథ్యంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల ప్రయోజనం పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారుతదనుగుణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అధిక నష్టాల నుంచి ‘ఓంఎసీ’లకు ఉపశకమనం కల్పిస్తూ ప్రభుత్వం తన పన్నుల రాబడిమీద  గణనీయ భారం మోపింది.”

ఈ మేరకు ప్రభుత్వం ఒకవైపు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూమరోవైపు డీజిల్‌పై ఎగుమతి సుంకం విధించిందిఅంతర్జాతీయంగా డీజిల్ ధర విపరీతంగా పెరిగినందు వల్ల ఈ ఇంధన ఎగుమతిని నిరుత్సాహపరచేలా ఈ నిర్ణయం తీసుకుందితద్వారా రిఫైనరీలలో డీజిల్‌ ఉత్పత్తి తొలుత దేశీయ అవసరాలు తీర్చడానికి మళ్లించే విధంగా జాగ్రత్త వహించిందిప్రస్తుత అంతర్జాతీయ ధరలు వాణిజ్యపరంగా ఎగుమతులను ఆకర్షించేవిగా ఉన్నప్పటికీదేశంలో చిల్లర విక్రయాల నిమిత్తం పూర్తిస్థాయి సరఫరా కొనసాగించడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.

రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం అనంతరం 2022లో అనుసరించిన విధానం తరహాలోనే ప్రస్తుత నిర్ణయం తీసుకుందిఆనాడు ‘ఓఎంసీ’లు నిరంతర నష్టాలు భరించగాప్రపంచ ధరల అనిశ్చితి నుంచి గృహాలకువ్యాపారాలకు రక్షణనిస్తూ కేంద్ర ప్రభుత్వం తన పన్నులను తగ్గించిందిప్రస్తుత సందర్భంలోనూ అదే సూత్రం ప్రకారం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిందితమ ప్రమేయం లేని ప్రపంచ స్థితిగతుల దుష్పరిణామాల భారాన్ని దేశ పౌరులుపరిశ్రమలపై మోపరాదని నిశ్చయించుకుందిమరోవైపు నానాటికీ మారుతున్న ప్రపంచ ఇంధన పరిస్థితిని పర్యవేక్షిస్తూవినియోగదారుల కోసం సరఫరాధరల స్థిరత్వం కొనసాగే విధంగా అవసరమైన చర్యలన్నీ చేపడుతుంది.

****


(రిలీజ్ ఐడి: 2246104) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam