ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కూలిన భవనం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 5:40PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భవనం కుప్పకూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున హరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భవనం కూలిపోవడం వల్ల సంభవించిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటిస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’
(రిలీజ్ ఐడి: 2244204)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6