ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడిన భారత ప్రధాని
పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ.. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 5:05PM by PIB Hyderabad
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించి చర్చలనూ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా చర్చించారు. ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘పశ్చిమాసియాలో పరిస్థితులపైనా, ఉద్రిక్తతలను తగ్గించడంతోపాటు శాంతినీ, దౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా ప్రియ మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో మాట్లాడాను.
ఈ ప్రాంతంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ శాంతి, స్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చాం.’’
***
(రిలీజ్ ఐడి: 2242666)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada