భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సాధారణ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు/యూటీలు, ఉపఎన్నికలు జరిగే 6 రాష్ట్రాల్లో ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఈసీఐ ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 1:36PM by PIB Hyderabad
  1. అస్సాంకేరళ, పుదుచ్చేరితమిళనాడుపశ్చిమబెంగాల్ శాసనసభల సాధారణ ఎన్నికల షెడ్యూలును 2026 మార్చి 15న ఎన్నికల సంఘం ప్రకటించింది.

  2. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లను అస్సాంకేరళపుదుచ్చేరి తమ గెజిట్లో ప్రచురించాయి.

  3. ఈ ప్రకటన నేపథ్యంలోఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సంబంధిత ప్రధాన కార్యదర్శులకుఎన్నికల ప్రధానాధికారులకు ఆదేశాలు జారీ చేసిందిప్రకటనలు/విధాన పరమైన అంశాల్లో సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సైతం ఎంసీసీ వర్తిస్తుంది.

  4. ప్రభుత్వప్రజాప్రైవేటు ఆస్తులపై ఉన్న పోస్టర్లు లేదా రాతలను తొలగించడంఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా ఎన్నికలతో సంబంధమున్న ఎవరైనా అధికారిక వాహనాలను లేదా ప్రభుత్వ వసతులను దుర్వినియోగం చేయడంప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రకటనల జారీపై నిషేధం లాంటి అంశాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది.

  5. ప్రైవేటు నివాసాల వెలుపల ప్రదర్శనలు లేదా పికెటింగ్ నిర్వహించకుండా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలియజమాని అనుమతి లేకుండా స్థలాలుభవనాలుగోడలపై జెండాలుబ్యానర్లుపోస్టర్లను ఏర్పాటు చేయకూడదు.

  6. ప్రత్యేక ఫిర్యాదు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారుదీనిలో 1950 కాల్ సెంటర్ కూడా ఉందిదీని ద్వారా ప్రజలు లేదా రాజకీయ పార్టీలకు చెందిన వారు సంబంధిత డీఈవో/ఆర్వోకు ఫిర్యాదు చేయవచ్చు.

  7. ఈసీఐనెట్‌లో ఉన్న సీ-విజిల్ యాప్ ద్వారా ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలు లేదా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయవచ్చుకేవలం 100 నిమిషాల్లోనే ఫిర్యాదులను పరిష్కరించేలా ఆయా రాష్ట్రాలు/యూటీల్లో దాదాపు 5,173కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారువీటితో పాటుగా 5,200కు పైగా స్థిర పర్యవేక్షణా బృందాలను రంగంలోకి దించారు.

  8. ట్రాఫిక్భద్రతా ఏర్పాట్లను చేయడానికినిషేధాజ్ఞలను పాటించడానికిలౌడ్ స్పీకర్లుఇతర సౌకర్యాల కోసం అవసరమైన అనుమతులు పొందడానికి సమావేశాలుఊరేగింపులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు అధికారులకు రాజకీయ పార్టీలు ముందుగానే తెలియజేయాలి.

  9. మంత్రులు తమ అధికారిక విధులను ఎన్నికల ప్రచారంతో ముడిపెట్టకూడదుప్రభుత్వ యంత్రాంగాన్నివాహనాలను లేదా సిబ్బందిని ప్రచారం కోసం ఉపయోగించకూడదు.

  10. ఎంసీసీ అమల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనిఅన్ని పార్టీలను సమానంగా చూడాలనిఅధికారిక వసతులను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని అన్ని స్థాయుల అధికారులను ఆదేశించిందిసమావేశాలుఊరేగింపులను నియంత్రించాలనిఎన్నికల ఏర్పాట్లను న్యాయంగా నిర్వహించాలని సూచించిందిశాంతిభద్రతలను పరిరక్షించాలనిఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను కాపాడాలని ఆదేశించింది.

  11. మైదానాలుహెలిప్యాడ్ల వంటి ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవడానికి ఈసీఐనెట్‌లో ఉన్న సువిధ మాడ్యూల్‌ను యాక్టివేట్ చేశారువాటిని ముందు వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం విధానంలో కేటాయిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240687) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Tamil , Bengali , Bengali-TR , Assamese , English , Gujarati , Urdu , Malayalam