ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

విజయవంతంగా ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 గురించిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 7:49PM by PIB Hyderabad

విజయవంతంగా ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 గురించి కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి రాసిన అద్భుతమైన వ్యాసాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ తన నాగరికత ప్రేరణ నుంచి స్ఫూర్తి పొందిందని కేంద్ర మంత్రి తన వ్యాసంలో పేర్కొన్నారు.

డేటాపై సార్వభౌమాధికారం, డిజైన్ ద్వారా సమ్మిళితత్వం, తిరుగులేని జవాబుదారీతనం అనే తన సొంత నిర్వహణ ఆలోచనలను భారత్ సుస్పష్టం చేస్తోందని కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.

‘ఎక్స్’ వేదికగా పీఎంవో ఇలా పేర్కొంది:

"ఈ అద్భుతమైన రచనలో ఇటీవల విజయవంతంగా ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 గురించి రాస్తూ... భారత్ తన నాగరికత నుంచి స్ఫూర్తి పొందిందని కేంద్ర మంత్రి శ్రీ @HardeepSPuri పేర్కొన్నారు. డేటాపై సార్వభౌమాధికారం, డిజైన్ ద్వారా సమ్మిళితత్వం, తిరుగులేని జవాబుదారీతనం అనే తన సొంత నిర్వహణ ఆలోచనలను భారత్ సుస్పష్టం చేస్తోందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు".

 

(రిలీజ్ ఐడి: 2232450) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada