ప్రధాన మంత్రి కార్యాలయం
బడ్జెట్ మన దేశ ప్రజల ఆర్థిక స్థితిలో మార్పులకు ఎలా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి సమగ్రంగా వివరించారు: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 2:13PM by PIB Hyderabad
మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్సభ దృష్టికి తీసుకువచ్చారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘రిఫార్మ్ ఎక్స్ప్రెస్ గురించీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకు మద్దతు, నైపుణ్యాలకు సాన పట్టడం, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగేలా మౌలిక సదుపాయాల కల్పన , ఆరోగ్య సంరక్షణ , విద్య తదితర రంగాలకు ఊతాన్ని ఇచ్చే దిశగా చేస్తున్న కృషిని ఆమె స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతున్నదీ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ లోక్సభలో తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. రిఫార్మ్ ఎక్స్ప్రెస్ గురించీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకు మద్దతు, నైపుణ్యాలకు పదును పెట్టడం, రాబోయే కాలం అవసరాల్ని తీర్చగలిగే దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, తదితర రంగాలకు ఊతాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2227042)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam