ప్రధాన మంత్రి కార్యాలయం
త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
21 JAN 2026 9:26AM by PIB Hyderabad
త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
త్రిపుర ప్రస్థానం సంప్రదాయం, ఆధునికతల అసాధారణ కలబోతకు ప్రతీకగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. వివిధ రంగాల్లో ఈ రాష్ట్రం మార్గదర్శక మార్పులకు సాక్షిగా నిలిచిందని, ఈ రాష్ట్ర ప్రజలు భారతదేశ అభివృద్ధి వేగంగా దూసుకుపోయేందుకు తోడ్పడుతున్నారని ఆయన అన్నారు.
రాబోయే కాలంలో త్రిపురలో చెప్పుకోదగ్గ సమృద్ధి చోటు చేసుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘త్రిపుర ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హార్దిక శుభకామనలు. సంప్రదాయం, ఆధునికతల అసాధారణ కలబోతకు ప్రతీకగా త్రిపుర ముందుకు సాగుతోంది. వివిధ రంగాల్లో మార్గదర్శక మార్పులకు సాక్షిగా ఈ రాష్ట్రం నిలిచింది.. భారతదేశ అభివృద్ధి వేగంగా దూసుకుపోయేందుకు రాష్ట్ర ప్రజలు తోడ్పాటును అందిస్తున్నారు. రాబోయే కాలంలోనూ త్రిపుర గొప్పగా పురోగమించాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2216726)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam