ప్రధాన మంత్రి కార్యాలయం
యువశక్తిపై స్వామి వివేకానందుని నమ్మకాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
12 JAN 2026 10:11AM by PIB Hyderabad
దేశాభివృద్ధిలో యువశక్తి అత్యంత ప్రధానమైనదనీ, శ్రద్ధ, ఆసక్తితో తమ లక్ష్యాన్ని భారతీయ యువత నెరవేర్చుకోగలదనే స్వామి వివేకానందుని నమ్మకాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
"అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్।
వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య వీరస్య॥"
ధైర్యంగా, దృఢ నిశ్చయంతో ఉండేవారికి ఈ భూమి ఇంటి ముందున్న వాకిలి వంటిదనీ, సముద్రాలు చెరువుల్లాంటివనీ, మేరు పర్వతం సైతం చిన్న పుట్టలా కనిపిస్తుందనీ, దృఢ సంకల్పం ఉన్నవారికి ఈ పుడమిపై సాధించలేనిది ఏమీ లేదని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘దేశాభివృద్ధికి అత్యంత శక్తిమంతమైన ఆధారం యువశక్తి అని స్వామి వివేకానంద విశ్వసించారు. ఉత్సాహం, పట్టుదలతో భారతీయ యువత తమ సంకల్పాన్ని నెరవేర్చుకోగలదు.
"అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్।
వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య వీరస్య॥"
(रिलीज़ आईडी: 2213622)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam