ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం
నాడు పోస్టు చేయడమైనది:
09 JAN 2026 7:22PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా పీఎంవో ఇండియా ఇలా పేర్కొన్నది:
‘‘హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్లో బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత విచారకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ”
(రిలీజ్ ఐడి: 2213064)
సందర్శకుల సూచీ సంఖ్య : : 53
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam