ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 31 DEC 2025 9:04AM by PIB Hyderabad

దోహాలో నిర్వహించిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారుఫిడే రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన కొన్ని రోజులకే ఆయన ఈ విజయాన్ని సాధించారుప్రపంచ చదరంగంలో భారత్‌కు గర్వకారణంగా నిలిచే మరో అపురూపమైన ఘట్టమిది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

చదరంగంలో భారత దూకుడు కొనసాగుతోంది!

దోహాలో నిర్వహించిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి అభినందనలుఇటీవలే ఫిడే రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆయన కాంస్య పతకాన్ని సాధించారుఆయన నైపుణ్యంఓర్పుఅభిరుచి అసామాన్యమైనవిఆయన విజయాలు మన యువతకు నిరంతర స్ఫూర్తిఆయనకు నా శుభాకాంక్షలు.

 

*** 


(రిలీజ్ ఐడి: 2210085) సందర్శకుల సూచీ సంఖ్య : : 38