హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో ప్రచురించాలన్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

భారతీయ భాషలను గౌరవించే దిశగా ఇది మరో కీలక ముందడుగు

సంతాలీ భాషలో రాజ్యాంగ ప్రచురణ.. సంతాలీ సమాజానికే కాక, యావత్ దేశానికి గర్వకారణం

మన రాజ్యాంగ ఆశయాలను, విలువలను గిరిజన సమాజానికి స్పష్టంగా చేరవేయనున్న ఓల్ చికి లిపిలో ప్రచురితమైన రాజ్యాంగం.. రాజ్యాంగ నిర్మాతల కల సాకారం

నాడు పోస్టు చేయడమైనది: 26 DEC 2025 4:40PM by PIB Hyderabad

భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో ప్రచురించాలన్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

భారతీయ భాషలను గౌరవించే దిశగా మరో కీలక ముందడుగు పడిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారుసంతాలీ భాషలో రాజ్యాంగాన్ని ప్రచురించటం.. సంతాలీ సమాజానికే కాకయావత్ దేశానికి గర్వకారణమని తెలిపారుఓల్ చికి లిపిలో ప్రచురితమైన రాజ్యాంగం ద్వారా మన రాజ్యాంగ విలువలుఆశయాలు గిరిజన సమాజానికి మరింత స్పష్టంగా చేరతాయన్నారురాజ్యాంగ నిర్మాతల కలలను సాకారం చేయటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ అమిత్ షా కాంక్షించారు.


(రిలీజ్ ఐడి: 2209002) సందర్శకుల సూచీ సంఖ్య : : 32
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil , Malayalam