హోం మంత్రిత్వ శాఖ
ది అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ పి.జి. బరువా మృతిపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం
అన్ని అంశాలూ సామాన్యుడికి చేరేలా, జర్నలిజం ద్వారా అస్సాం సంస్కృతికి ప్రాచుర్యం కల్పించేలా ఆయన చేసిన కృషి ప్రజలకు నిరంతర స్ఫూర్తి
కుటుంబ సభ్యులకు, సంస్థకు, అభిమానులకు మనఃపూర్వక సంతాపం
प्रविष्टि तिथि:
15 DEC 2025 12:24PM by PIB Hyderabad
ది అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ పి.జి. బరువా మృతిపై కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: “ది అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి.జి. బరువా మృతి చాలా బాధాకరం. అన్ని అంశాలనూ సామాన్య ప్రజలకు చేరవేసేలా, జర్నలిజం ద్వారా అస్సాం సంస్కృతికి ప్రాచుర్యం కల్పించేలా ఆయన చేసిన కృషి ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ది అస్సాం ట్రిబ్యూన్ గ్రూప్ సంస్థకు, ఆయన అభిమానులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను.”
***
(रिलीज़ आईडी: 2204211)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam