ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్రమైన గీతా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:23PM by PIB Hyderabad
పవిత్ర గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణపై అమూల్యమైన సందేశాలతో రూపొందించిన ఈ దివ్య గ్రంథం.. భారతీయ కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘భగవదగీత దివ్య శ్లోకాలు నిస్వార్థ చర్య వైపు ప్రతి తరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘శ్రీమద్ భగవద్గీత ఆవిర్భావ దినోత్సవమైన ‘‘గీతా జయంతి’’ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. విధి నిర్వహణకు సంబంధించిన విలువైన సందేశాలతో అలంకరించిన ఈ దివ్య గ్రంథం భారతీయ కుటుంబ, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇందులోని దివ్య శ్లోకాలు ప్రతి తరాన్ని నిస్వార్థ సేవకు ప్రేరేపిస్తూనే ఉంటాయి. జై శ్రీ కృష్ణ!’’
(रिलीज़ आईडी: 2196964)
आगंतुक पटल : 4