ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

షిరిడీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంతోపాటు కొన్నింటిని జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

प्रविष्टि तिथि: 26 OCT 2023 6:52PM by PIB Hyderabad

ఛత్రపతి కుటుంబానికి నమస్కారం!
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీకష్టించే తత్వమున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే గారుఉప ముఖ్యమంత్రి దేవేంద్ర గారుఅజిత్ గారుకేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులుఎంపీలుఎంఎల్‌ఏలుమమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ..

ఈ పవిత్ర షిర్డీ భూమికి నా కోటి ప్రణామాలుఅయిదేళ్ల క్రితం.. ఈ పవిత్ర ఆలయం వందో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో నాకు సాయి దర్శనం చేసుకొనే అవకాశం లభించింది. (మరాఠీలో చెప్పారు). ఈ రోజుసాయి బాబా ఆశీర్వాదంతో రూ7500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించుకుంటున్నాం లేదా శంకుస్థాపన చేసుకున్నాంగత అయిదు దశాబ్దాలుగా మహారాష్ట్ర ఎదురు చూస్తున్న నీల్వాండే ఆనకట్ట పూర్తయిందిఅక్కడ ‘జలపూజ’ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానుఈ రోజు ప్రారంభించిన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు గతంలో శంకుస్థాపన చేసే అవకాశం నాకు దక్కింది. ‘దర్శనం క్యూ’ ప్రాజెక్టులు పూర్తి కావడంతో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు ప్రయోజనం చేకూరుతుంది.

స్నేహితులారా,

అమూల్యమైన వ్యక్తిత్వం కలిగినవరకారీ శాఖకు కీర్తిని తీసుకొచ్చిన హరి భక్తుడు బాబా మహారాజ్ శతార్కర్ ఈ ఉదయం మరణించారన్న దుర్వార్త నాకు తెలిసిందికీర్తనలుప్రవచనాల ద్వారా సామాజిక అభ్యుదయానికి ఆయన చేసిన విశేష కృషి శతాబ్దాల తరబడి తరతరాలకూ స్ఫూర్తి కలిగిస్తుందిఆయన సరళమైన మాట తీరుప్రేమ నిండిన పలుకులుఆయన శైలి ప్రజలను ఆకర్షిస్తాయిఆయన ఆలపించిన ‘జయ జయ రామకృష్ణ హరి’ కీర్తన ఎంత ప్రభావం చూపించిందో మనమంతా చూశాంబాబా మహారాజ్ శతార్కర్ గారికి నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
నిజమైన సామాజిక న్యాయం అంటే పేదరికం నుంచి దేశం విముక్తి పొందాలిఅత్యంత నిరుపేద కుటుంబాలకు సైతం వృద్ధి చెందే అవకాశం లభించాలి. ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్’ అనే మంత్రంతో మా ప్రభుత్వం పనిచేస్తోందిపేదల సంక్షేమమే మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న అంశంప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో పేదల సంక్షేమం కోసం కేటాయించే బడ్జెట్ కూడా పెరుగుతోంది.
ఈ రోజు మహారాష్ట్రలో కోటి 10 లక్షల ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయిఈ కార్డు పొందిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుందిఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి రూ. 70 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందిపేదలకు ఉచిత రేషన్ అందించడానికి రూ. 4 లక్షల కోట్లను వెచ్చించిందిఅలాగే పేదలకు ఇళ్లు నిర్మించడానికి మరో రూ.4 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందిఇది 2014కు ముందు పదేళ్లలో చేసిన వ్యయంతో పోలిస్తే రెట్లు ఎక్కువప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించేందుకు సుమారుగా రూ. 2 లక్షల కోట్లను ఖర్చు చేశాంవీధి వ్యాపారులకు పీఎం స్వనిధి యోజన ద్వారా వేల రూపాయల ఆర్థికసాయం లభిస్తోంది.
పీఎం విశ్వకర్మ యోజన పేరుతో ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించిందిదీని ద్వారా లక్షలాది వడ్రంగిస్వర్ణకారకుమ్మరిశిల్పకారుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మొదటిసారి సాయం లభించిందిఈ పథకం కోసం రూ.13 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని కేటాయించాం. 2014కు ముందు కూడా ఇలాంటి గణాంకాల గురించి విన్నాంకానీ అవి లక్షలుకోట్ల రూపాయల అవినీతికుంభకోణాల గురించి మాత్రమే ఉండేవిఇప్పుడేమి జరుగుతోందిఎన్నో లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులుపథకాల మీద వెచ్చిస్తున్నాం.

నా కుటుంబ సభ్యులారా,
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతు సోదరులు కూడా ఉన్నారుముందుగా.. మన వ్యవసాయ సమాజానికి సందేశమిస్తూ.. ‘ధర్తీ కహే పుకార్’ అనే నాటకాన్ని మన ముందు గొప్పగా ప్రదర్శించిన అమ్మాయిలకు నా శుభాకాంక్షలుఈ సందేశాన్ని మీరు ఖచ్చితంగా మీ వెంట తీసుకెళతారుఆ అమ్మాయిలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
గతంలో రైతుల గురించి ఎవరూ పట్టించుకొనేవారు కాదుమన రైతు సోదరీసోదరుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించాందీని ద్వారా సన్నకారు రైతులకు రూ. 2 లక్షల 60 వేల కోట్లు అందాయిమహారాష్ట్రలో సైతం చిన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 26 వేల కోట్లు నేరుగా జమయ్యాయిమహారాష్ట్ర ప్రభుత్వం నమో షెట్కారీ మహాసమ్మాన్ నిధి యోజనను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నానుదీని ద్వారా మహరాష్ట్రలోని రైతు కుటుంబాలకు మరో రూ.6000 అందుతాయిఅంటే ఇప్పుడు సమ్మాన్ నిధి ద్వారా రైతులకు రూ.12 వేలు ఆర్థిక సాయం లభిస్తుంది.
నా కుటుంబ సభ్యులారా,
రైతుల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో నిమగ్నమైన వారు.. ప్రతి నీటిబొట్టుకీ మిమ్మల్ని వేధించారుఈ రోజు నీల్వాండే ప్రాజెక్టులో ‘జల పూజ’ నిర్వహించాందీనికి 1970లో ఆమోదం లభించిందిఒక్కసారి ఆలోచించండి.. ఈ ప్రాజెక్టు పనులు అయిదు దశాబ్దాల పాటు నిలిచిపోయాయిమా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమైందిఇప్పుడు ఎడమ గట్టు కాలువ నుంచి ప్రజలకు నీరందుతోందిత్వరలోనే కుడి గట్టు కాలువ సైతం ప్రారంభమవుతుందిఈ రాష్ట్రంలో కరవు పీడిత ప్రాంతాలకు బలిరాజా జల్ సంజీవని యోజన ఓ వరంగా మారిందిమహారాష్ట్రలో దశాబ్దాలుగా నిలిచిపోయిన మరో 26 నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉందిఇవి మన రైతులకుకరవు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తాయిఈ ఆనకట్ట నుంచి నీరు విడుదలవుతున్న నేపథ్యంలో నా రైతు సోదరీసోదరులు అందరికీ ఓ విన్నపంఈ నీరు దేవుడిచ్చిన వరంకాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయొద్దుఉన్న నీటితో ఎక్కువ దిగుబడి సాధిద్దాంమనకు అందుబాటులో ఉన్న ప్రతి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకోవాలి.

నా కుటుంబ సభ్యులారా,

రైతులకు సాధికారత కల్పించాలనే సదుద్దేశంతో మేం కృషి చేస్తున్నాంకానీ మహారాష్ట్రలో కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారుమహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు... చాలా ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారునేను వ్యక్తిగతంగా ఆయన్ను చాలా గౌరవిస్తానుకానీ.. ఆయన రైతుల కోసం ఏం చేశారుతన ఏడేళ్ల పదవీ కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కేవలం రూ. 3.5 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మాత్రమే కొనుగోలు చేశారుఈ సంఖ్యను గుర్తు పెట్టుకోండిమా ప్రభుత్వంలో అదే ఏడేళ్ల కాలానికి రూ.13.5 లక్షల కోట్ల మొత్తాన్ని కనీస మద్దతు ధరగా రైతులకు మా ప్రభుత్వం అందించింది. 2014కి ముందు కేవలం రూ. 500-600 కోట్ల విలువైన పప్పుధాన్యాలునూనె గింజలను మాత్రమే రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేవారుకానీ మా ప్రభుత్వం.. పప్పులునూనె గింజల కోసం రైతులకు రూ. 1లక్షా 15 వేల కోట్లకు పైగా మొత్తాన్ని అందించిందిఆ వ్యవసాయ శాఖ మంత్రి హయాంలో రైతులు తమకు రావాల్సిన డబ్బు కోసం దళారులపై ఆధారపడాల్సి వచ్చేదినెలల తరబడి రైతులకు సొమ్ము చెల్లించేవారు కాదుమా ప్రభుత్వం కనీస మద్దతు ధర సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది.

స్నేహితులారా,
ఇటీవలే రబీ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాంకనీస మద్దతు ధరను పప్పుధాన్యాలకు రూ.105, గోధుమకుసుమకు రూ.150 పెంచాంఇది మహారాష్ట్రలోని రైతు సోదరులకు ప్రయోజనం చేకూరుస్తుందిచెరకు రైతుల ప్రయోజనాలకు సైతం మేం ప్రాధాన్యమిస్తున్నాంక్వింటాలుకు రూ.315 చొప్పున చెరకు ధర పెరిగిందిగడచిన ఏళ్లలో రూ.70 వేల కోట్ల విలువైన ఇథనాల్ కొనుగోలైందిఈ మొత్తం కూడా రైతులకు చెల్లించాంచక్కెర రైతులకు సకాలంలో చెెల్లింపులయ్యేలా చూసేందుకు వేల కోట్ల రూపాయలను చక్కెర మిల్లులుసహకార సంస్థలకు అందించాం.

నా కుటుంబ సభ్యులారా,
సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందిదేశవ్యాప్తంగా లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో సహకార సంఘాలున్నాయిదేశ రైతులకు నిల్వశీతల గిడ్డంగి సౌకర్యాలను కల్పించేలా సహకార సంఘాలుపీఏసీఎస్‌లకు తగిన సహకారం అందుతోందిఎఫ్‌పీవోలు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా చిన్నకారు రైతులకు తోడ్పాటు లభిస్తోందిఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7500 ఎఫ్‌పీవోలు ఏర్పాటయ్యాయి.

నా కుటుంబ సభ్యులారా,

అపారమైన సామర్థ్యానికిఅంతులేని అవకాశాలకు మహారాష్ట్ర కేంద్రంగా ఉందిఎంత వేగంగా మహారాష్ట్ర అభివృద్ధి చెందితే.. అంత వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందికొన్ని నెలల క్రితమే ముంబయిషిర్డీ మధ్య నడిచే వందేభారత్‌ను ప్రారభించే అవకాశం నాకు లభించిందిమహారాష్ట్రలో ఈ రైల్వే విస్తరణ కొనసాగుతుందిజలగావ్భూసావల్ మధ్య మూడునాలుగు రైల్వే లైన్ల ప్రారంభంతో ముంబై-హౌరా మధ్య రైలు ప్రయాణం సులభతరమవుతుందిఅదే విధంగాసోలాపూర్ నుంచి బోర్గావ్ వరకు నిర్మించిన నాలుగు లైన్ల రహదారి.. మొత్తం కొంకణ్ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తుందిదీనివల్ల పరిశ్రమలకు మాత్రమే కాకుండా.. చెరకుద్రాక్షపసుపు రైతులకు సైతం ప్రయోజనం కలుగుతుందిఈ మార్గం.. రవాణాకు మాత్రమే కాకుండా.. మొత్తం ప్రగతిసామాజిక అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తుంది.
ఇంత పెద్ద సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానుమనకు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాధించాలని సంకల్పం తీసుకుందాం.

ధన్యవాదాలు 

గమనిక: ఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(रिलीज़ आईडी: 2196937) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam