ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కబడ్డీ ప్రపంచ కప్-2025 కైవసంపై భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 24 NOV 2025 8:11PM by PIB Hyderabad

కబడ్డీ ప్రపంచ కప్-2025లో అద్భుత విజయంతో టైటిల్‌ కైవసం చేసుకున్న భారత మహిళల కబడ్డీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“కబడ్డీ ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం ద్వారా యావద్భారతం గర్వపడేలా చేసిన మన మహిళల కబడ్డీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు! జట్టు సభ్యులందరూ అకుంఠిత దీక్ష, పట్టుదల, అత్యుత్తమ నైపుణ్యంతో ప్రత్యర్థి మీద పైచేయి సాధించారు. ఈ స్ఫూర్తిదాయక విజయం అనేకమంది వర్ధమాన కబడ్డీ క్రీడాకారులకు ఉజ్వల భవితపై ఆకాంక్షను ప్రేరేపించి, ఉన్నత లక్ష్యాల సాధన వైపు నడిపిస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2194049) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil