ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: ఢిల్లీలో జరిగిన ఆరో విడత రామ్‌నాథ్ గోయెంకా ఉపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 17 NOV 2025 10:16PM by PIB Hyderabad

వివేక్ గోయెంకా గారుసోదరుడు అనంత్జార్జ్ వర్గీస్ గారురాజ్‌కమల్ ఝాఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లోని ఇతర సహచరులందరూ.. గౌరవ ప్రతినిధులుఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులకుమహిళలుపెద్దలూ..!

భారత ప్రజాస్వామ్యంలో జర్నలిజంభావ వ్యక్తీకరణప్రజా ఉద్యమాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తిని గౌరవించేందుకు ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యాందార్శనికుడిగాసంస్థలను నిర్మించే వ్యక్తిగాదేశభక్తుడిగామీడియా నాయకుడిగా ఉన్న రామ్‌నాథ్ గారు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థను కేవలం ఒక వార్తాపత్రికగానే కాకుండా భారత ప్రజలకు సంబంధించిన ఒక యజ్ఞంగా స్థాపించారుఆయన నాయకత్వంలో ఈ సంస్థ.. భారత ప్రజాస్వామ్య విలువలుజాతీయ ప్రయోజనాలకు గొంతుకగా మారిందిఈ 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతున్నప్పుడు.. రామ్‌నాథ్ గోయెంకా గారి నిబద్ధతఆయన చేసిన కృషిఆయన దార్శనికత మనకు గొప్ప స్ఫూర్తిని అందిస్తున్నాయిఈ ఉపన్యాసానికి నన్ను ఆహ్వానించినందుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానుఈ విషయంలో మీ అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను

మిత్రులారా

భగవద్గీతలోని "సుఖ దుఃఖే సమే కృత్వాలాభా-లాభౌ। జయా-జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వనైవం పాపం అవాప్స్యసి।।అనే శ్లోకం నుంచి రామ్‌నాథ్ గోయెంకా గారు గొప్ప స్ఫూర్తిని పొందారు. ‘సుఖదుఃఖాలులాభనష్టాలుజయాపజయాలను సమానంగా చూస్తూ తన విధిని నిర్వర్తిస్తూ పోరాడాలి.  అలా చేయడం ద్వారా పాపం కలగదు’ అనేది దీని అర్థంస్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రామ్‌నాథ్ గోయెంకా గారు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారుతర్వాత జనతా పార్టీకి మద్దతు ఇచ్చారుజనసంఘ్ టిక్కెట్‌పై ఎన్నికలలో కూడా పోటీ చేశారుసిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఆయన ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశారురామ్‌నాథ్ గారితో సంవత్సరాలుగా పనిచేసిన వాళ్లతో ఆయన పంచుకున్న అనేక కథలను చెబుతుంటారుస్వాతంత్ర్యం తర్వాత హైదరాబాద్రజాకార్ల అకృత్యాలకు తెగబడినపుడు రామ్‌నాథ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సహాయం చేశారు. 1970లలో బీహార్‌లో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం అవసరమైనప్పుడు నానాజీ దేశ్‌ముఖ్‌తో కలిసి రామ్‌నాథ్ గారు జేపీని ఒప్పించారుఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి సన్నిహిత మంత్రి ఒకరు రామ్‌నాథ్ గారిని పిలిచి జైల్లో పెడతామంటూ బెదిరించినప్పుడు.. రామ్‌నాథ్ గారు ఇచ్చిన సమాధానం ఇప్పుడు చరిత్రలో దాగి ఉందికొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి.. మరికొన్ని తెలియకుండా మిగిలిపోయాయికానీ ఈ కథలు ‘తనకు వ్యతిరేకంగా ఎంతటి శక్తిమంతమైన వ్యక్తులు నిలబడినా రామ్‌నాథ్ గారు ఎల్లప్పుడూ సత్యానికి అండగా నిలిచారు.. కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచారు’ అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి.

మిత్రులారా

రామ్‌నాథ్ గారు చాలా అసహనంతో ఉండేవారని తరచుగా చెబుతుంటారుఇది ప్రతికూల అర్థంలో కాదు.. సానుకూల అర్థంలోనేమార్పు కోసం ఒక వ్యక్తిని కష్టంలోకి నెట్టే అసహనం అది.. నిలిచి ఉన్న నీటిలో కూడా అలలను సృష్టించే అసహనం అదిఇదే తరహాలో నేటి భారత్‌ కూడా అలాంటి అసహనంతో ఉందిఅభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న అసహనంతో ఉందిఆత్మనిర్భర్ అయ్యేందుకు అసహనంగా ఉంది. 21వ శతాబ్దంలో మొదటి 25 సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయో మనమందరం చూశాంభారీ సవాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మనకు అడ్డుగా వచ్చాయిఅయినప్పటికీ అవి భారత్ వేగాన్ని తగ్గించలేకపోయాయి.

మిత్రులారా

ప్రపంచ మొత్తానికి గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఎంత సవాలుగా ఉన్నాయో మీరు చూశారు. 2020లో కరోనా వైరస్ సంక్షోభం వచ్చిందిఅప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అనిశ్చితికి గురయ్యాయిప్రపంచ సరఫరా గొలుసు తీవ్రంగా ప్రభావితమైందిప్రపంచం మొత్తం నిరాశ వైపు కదలడం ప్రారంభించిందికొంత సమయం తర్వాత పరిస్థితి నెమ్మదిగా స్థిరపడటం ప్రారంభమైనప్పుడు.. మన పొరుగు దేశాలలో అల్లకల్లోలం మొదలైందిఈ సంక్షోభాలన్నింటి మధ్య మన ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటును సాధించింది. 2022లో ఐరోపా సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులుఇంధన మార్కెట్లు ప్రభావితమయ్యాయిఇది మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపించిందిఅయినప్పటికీ 2022–23లో కూడా మన ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి సాధించింది. 2023లో పశ్చిమ ఆసియాలో పరిస్థితి మరింత దిగజారినప్పుడు కూడా మన వృద్ధి రేటు బలంగానే ఉందిఈ సంవత్సరం కూడా ప్రపంచం అస్థిరతను ఎదుర్కొంటున్నప్పటికీ మన వృద్ధి రేటు ఇప్పటికీ సుమారు ఏడు శాతంగా ఉంది.

మిత్రులారా

ప్రస్తుతం ప్రపంచం కల్లోల పరిస్థితులకు భయపడుతున్నప్పుడు.. ఒక సజీవ భవిష్యత్తు దిశగా భారత్ ముందుకు సాగుతోంది.  ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వేదిక నుంచి నేను ‘భారత్ కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మాత్రమే కాదు.. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న నమూనా కూడా’ అని నేను ధైర్యంగా చెప్పగలనుఇవాళ ప్రపంచం భారత వృద్ధి నమూనాను ఆశతో కూడిన నమూనాగా చూస్తోంది.

మిత్రులారా

ఒక బలమైన ప్రజాస్వామ్యానికి అనేక ప్రమాణాలు ఉన్నాయివాటిలో అత్యంత ముఖ్యమైనది.. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యంప్రజాస్వామ్యంపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉంది.. వారు ఏ స్థాయి ఆశావాదులు అనేది ఎన్నికల సమయంలో అత్యంత స్పష్టంగా తెలుసుకోవచ్చునవంబర్ 14న వచ్చిన ఫలితాలు మీకు గుర్తు ఉండే ఉంటాయిరామ్‌నాథ్ గారికి బీహార్‌తో కూడా సంబంధం ఉన్నందున.. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేది సబబుఈ చరిత్రాత్మక ఫలితాలతో పాటు మరొక చాలా ముఖ్యమైన అంశం కూడా ఉందిప్రజాస్వామ్యంలో పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యాన్ని ఎవరూ విస్మరించలేరుబీహార్ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ ఈసారి నమోదైందిపురుషుల ఓటింగ్ శాతం కంటే మహిళల ఓటింగ్ దాదాపు శాతం ఎక్కువగా ఉందిదీని గురించి ఒక్క సారి ఆలోచించండిఇది కూడా ప్రజాస్వామ్య విజయమే

మిత్రులారా

బీహార్ ఫలితాలు మరోసారి భారత ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేశాయిఈ ఆకాంక్షలను నెరవేర్చేందుకుఅభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటానికి నిజాయితీగా పనిచేసే రాజకీయ పార్టీలను భారత ప్రజలు విశ్వసిస్తున్నారుఇవాళ్టి ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వేదిక నుంచి నేను దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి.. అది లెఫ్ట్రైట్సెంటర్ లేదా ఏ సిద్ధాంతానికి చెందిన ప్రభుత్వమైనా సరే వినయపూర్వకంగా తెలియజేస్తున్నానుమీరు ఈ రోజు నడిపించే ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీ రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే పాఠాన్ని బీహార్ ఫలితాలు మనకు నేర్పిస్తున్నాయిబీహార్ ప్రజలు ఆర్‌జేడీ ప్రభుత్వానికి 15 సంవత్సరాలు ఇచ్చారులాలూ యాదవ్ గారు తలుచుకుంటే బీహార్ అభివృద్ధికి చాలా చేయగలిగేవారుకానీ ఆయన 'జంగిల్ రాజ్మార్గాన్ని ఎంచుకున్నారుబీహార్ ప్రజలు ఈ ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేరుఈ రోజు కేంద్రంలో మన ప్రభుత్వం అయినా లేదా రాష్ట్రాలలో వివిధ పార్టీల ప్రభుత్వాలు అయినా మన అత్యున్నత ప్రాధాన్యత కేవలం అభివృద్ధిఅభివృద్ధి.. అభివృద్ధి మాత్రమే అయి ఉండాలిఅందుకే నేను ‘మీ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మెరుగైన వాతావరణాన్ని సృష్టించడానికి పోటీ పడండి.. వ్యాపారాన్ని సులభతరం చేయడంలో పోటీ పడండి.. అభివృద్ధి ప్రమాణాలలో ముందుకెళ్లేందుకు పోటీ పడండి.. అప్పుడు ప్రజలు మీపై ఎలా విశ్వాసం ఉంచుతారో మీరే చూడండి.’ అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాను

మిత్రులారా

బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత  మోదీ అభిమానులతో సహా మీడియాలోని కొంతమంది.. బీజేపీమోదీ 24 గంటలూ ఎన్నికల గురించే ఆలోచిస్తారని చెప్పటం మళ్లీ మొదలుపెట్టారునా విశ్వాసం ఏంటంటే.. ఎన్నికలలో గెలవడానికి ఎన్నికల ఆలోచనలో ఉండాల్సిన అవసరం లేదు… 24 గంటలు భావోద్వేగంతో ఉండటం అవసరంమంచి చేయాలనే ఆలోచన మనసులో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయకూడదుపేదల కష్టాలను తగ్గించేందుకుపేదలకు ఉపాధి కల్పించడానికిపేదలకు ఆరోగ్య సంరక్షణ అందించడానికిమధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తూనే ఉండాలిఈ విషయంలో నిరంతరాయంగా పని చేయాలిప్రభుత్వాన్ని నిరంతరం ఈ భావోద్వేగంఈ అనుభూతి నడిపించినప్పుడు.. వీటి ఫలితాలు ఎన్నికల రోజున స్పష్టంగా కనిపిస్తాయిఇది బీహార్‌లో కూడా జరగడం మనం ఇటీవలే చూశాం.

మిత్రులారా

ఎవరో రామ్‌నాథ్ గారి కథను ఒకసారి ప్రస్తావించారుజనసంఘ్ పార్టీ నుంచి విదిశ నియోజవర్గ టికెట్ లభించినప్పటికీ విషయం ఇదిసంస్థ ముఖ్యమా లేక వ్యక్తి ముఖమా అనే విషయంపై ఆయనానానాజీ దేశ్‌ముఖ్ చర్చిస్తున్నారునామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిఆ తర్వాత విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడానికి మాత్రమే మళ్లీ వస్తే చాలని రామ్‌నాథ్ గారికి నానాజీ దేశ్‌ముఖ్ చెప్పారుపార్టీ కార్యకర్తల బలంతో రామ్‌నాథ్ గారి తరఫున నానాజీ ఎన్నికలలో పోరాడారుతద్వారా రామ్‌నాథ్ గారు విజయాన్ని నిర్ధారించారుఈ కథను ప్రస్తావించడం ద్వారా అభ్యర్థులు కేవలం నామినేషన్ కోసం మాత్రమే రావాలని చెప్పడం కాదు నా ఉద్దేశంభాజపాకు ఉన్న అంకితభావం కలిగినవిధి నిర్వహణకు కట్టుబడిన లెక్కలేనంత మంది కార్యకర్తల నిబద్ధత గురించి చెప్పటమే నా ఉద్దేశం.

మిత్రులారా

లక్షలాది మంది భాజపా కార్యకర్తలు చెమటోడ్చి పార్టీ మూలాలను ధృడంగా చేశారుఈ రోజు కూడా వారు అదే పనిని కొనసాగిస్తున్నారుకేరళపశ్చిమ బెంగాల్జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో వందలాది కార్యకర్తలు రక్తంతో కూడా భాజపా అనే చెట్టు వేళ్లకు నీళ్లు పోశారుఅటువంటి అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీకి ఎన్నికలలో గెలవడం మాత్రమే లక్ష్యం కాదుఇలాంటి పార్టీ ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి సేవానిరతితో నిరంతరం పనిచేస్తుంది

మిత్రులారా

దేశం అభివృద్ధి చెందాలంటే పురోగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరడం చాలా ముఖ్యంప్రభుత్వ పథకాలు దళితులుఅణగారిన వర్గాలుపీడితులువెనుకబడిన వారికి చేరినప్పుడు సామాజిక న్యాయం అందుతుందికానీ గత దశాబ్దాలలో కొన్ని పార్టీలుకొన్ని కుటుంబాలు.. కేవలం సొంత ప్రయోజనాలను కాపుడుకునేందుకు మాత్రమే  సామాజిక న్యాయం పేరును ఉపయోగించుకోవటం మనం చూశాం

మిత్రులారా

ఈ రోజు దేశంలో సామాజిక న్యాయం వాస్తవ రూపం దాల్చుతుండటం అనేది నాకు సంతృప్తిని ఇస్తోందినిజమైన సామాజిక న్యాయం అంటే ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నానుబహిరంగ మల విసర్జన చేయాల్సి వచ్చిన పేద ప్రజల జీవితాలలో 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా గౌరవం వచ్చిందిగత ప్రభుత్వాలు బ్యాంక్ ఖాతాకు కూడా అర్హులుగా భావించని వారికి 57 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఆర్థిక సమ్మిళితాన్ని కల్పించాయిపేదలకు అందించిన కోట్ల పక్కా ఇళ్లు కొత్త కలల కనేందుకు వారి ధైర్యాన్నిరిస్కు తీసుకునే వారి సామర్థ్యాన్ని పెంచాయి

మిత్రులారా

గత 11 సంవత్సరాలలో సామాజిక భద్రత‌ విషయంలో చేసిన కృషి అసాధారణమైనదినేడు భారతదేశంలో దాదాపు 94 కోట్ల మంది ప్రజలు సామాజిక భద్రతా వలయంలోకి వచ్చారు. 10 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసాకేవలం 25 కోట్ల మంది ప్రజలు మాత్రమే సామాజిక భద్రతా పరిధిలో ఉండేవారునేడు ఆ సంఖ్య 94 కోట్ల మందికి చేరిందిదీని అర్థం.. .గతంలో కేవలం 25 కోట్ల మంది ప్రజలు మాత్రమే ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను పొందుతుండగాఇప్పుడు ఆ సంఖ్య 94 కోట్లకు చేరిందిఇదే నిజమైన సామాజిక న్యాయంమేం సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించడమే కాకుండా 'సంతృప్త స్థాయి’ని సాధించేందుకు కృషి చేస్తున్నాంఅర్హులైన ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకూడదుఒక ప్రభుత్వం ఈ లక్ష్యంతో పనిచేసినప్పుడు.. ప్రతి లబ్ధిదారుడికి చేరుకోవాలని అనుకున్నప్పుడు ఏ విధమైన వివక్షకు అవకాశం ఉండదుఈ పనుల కారణంగా గత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారుఅందుకే ప్రజాస్వామ్యం ఫలితాలనిస్తుందని ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది.

మిత్రులారా

నేను మీకు మరొక ఉదాహరణ చెప్తానుమా ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని గమనించండిగత ప్రభుత్వాలు వందకు పైగా జిల్లాలను వెనుకబడినవిగా ముద్ర వేసి వాటిని మర్చిపోయాయిఈ ప్రాంతాలలో అభివృద్ధి చాలా కష్టమనిఅటువంటి జిల్లాలలో కష్టపడి పనిచేయడానికి ఎవరు దృష్టి పెడతారని భావించేవారుఒక అధికారికి శిక్షించేందుకు బదిలీ చేయాల్సి  వచ్చినప్పుడు ఈ వెనుకబడిన జిల్లాలకు పంపేవారు.. అక్కడే ఉండమని చెప్పేవారుఈ వెనుకబడిన జిల్లాలలో ఎంతమంది ప్రజలు నివసించేవారో మీకు తెలుసాదేశంలోని 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ జిల్లాలలో నివసించేవారు

మిత్రులారా

ఈ వెనుకబడిన జిల్లాలు అలాగే ఉండిపోయి ఉంటే రాబోయే 100 సంవత్సరాలలో కూడా భారత్ అభివృద్ధి చెందగలిగేది కాదుఅందుకే మా ప్రభుత్వం ఒక కొత్త వ్యూహంతో పనిచేయడం మొదలుపెట్టిందిమేం రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తూ.. ఏ జిల్లా ఏ అభివృద్ధి ప్రమాణంలో వెనుకబడి ఉందో అధ్యయనం చేశాంప్రతి జిల్లా కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేశాందేశంలోని ఉత్తమ అధికారులనువినూత్నంగా ఆలోచించే ప్రతిభావంతులైన యువ మేధావులను అక్కడ మోహరించి.. ఆ జిల్లాలను వెనుకబడినవిగా కాకుండా ఆకాంక్షిత ప్రాంతాలుగా పరిగణించాంఈ ఆకాంక్షిత జిల్లాలు ఇవాళ చాలా అభివృద్ధి ప్రమాణాల్లో ఆయా రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయో మీరు చూడొచ్చుఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను ఉదాహరణగా తీసుకోండిజర్నలిస్టులలో చాలా మందికి ఇది ఇష్టమైన అంశంగా ఉండేదిజర్నలిస్టులు ఒకప్పుడు అక్కడికి వెళ్లాలంటే ప్రభుత్వం నుంచి మాత్రమే కాకుండా ఇతర సంస్థల నుంచి కూడా అనుమతులు అవసరమయ్యేవికానీ అదే బస్తర్ ఈ రోజు అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందిబస్తర్ ఒలింపిక్స్‌కు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎంత కవరేజ్ ఇచ్చిందో నాకు తెలియదు కానీ.. ఈ రోజు బస్తర్ యువత బస్తర్ ఒలింపిక్స్ వంటి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారో చూసి రామ్‌నాథ్ గారు చాలా సంతోషించి ఉండేవారు.

మిత్రులారా

బస్తర్‌ను ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ వేదికపై నుంచి నక్సలిజంవామపక్ష తీవ్రవాదం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నానుదేశవ్యాప్తంగా నక్సలిజంమావోయిస్టు హింస వేగంగా తగ్గిపోతోందిఅయితే అది కాంగ్రెస్ లోపల మాత్రం అంతే వేగంగా పెరుగుతోందిగత ఐదు దశాబ్దాలుగా దేశంలోని దాదాపు ప్రతి ప్రధాన రాష్ట్రం మావోయిస్టు హింసతో ప్రభావితమైందని మీ అందరికీ తెలుసుకానీ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వామపక్ష తీవ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించటంసమర్థించడం దేశం చేసుకున్న దురదృష్టంకేవలం మారుమూల అటవీ ప్రాంతాల్లోనే కాకుండా నక్సలిజాన్ని నగరాల్లో కూడా కాంగ్రెస్ పెంచి పొషించిందిఅనేక పెద్ద పెద్ద సంస్థలలో పట్టణ నక్సల్ సానుభూతిపరులను ఈ పార్టీ తయారుచేసింది.

మిత్రులారా

10–15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌లోకి చొరబడిన పట్టణ నక్సలైట్లుమావోయిస్టు శక్తులు ఇప్పుడు ఆ పార్టీని ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్‌‌గా మార్చేశాయిఇవాళ నేను పూర్తి బాధ్యతతో ‘ఈ ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను విస్మరించింది’ అని చెబుతున్నానుప్రస్తుతం ఉన్న ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్ దేశ ఐక్యతకు ఒక పెద్ద ముప్పుగా మారుతోంది.

మిత్రులారా

అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఒక కొత్త ప్రయాణాన్ని భారత్‌ ప్రారంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. రామ్‌నాథ్ గోయెంకా గారి వారసత్వం మరింత సందర్భోచితంగా మారుతోందిబ్రిటీష్ నిరంకుశత్వం‌పై రామ్‌నాథ్ గారు గట్టి వైఖరి తీసుకున్నారుబ్రిటీష్ ఆదేశాలను పాటించే బదులు తన వార్తాపత్రికను మూసివేయడానికి ఇష్టపడతానని ఆయనొక సంపాదకీయంలో వ్యాఖ్యానించారుఅదేవిధంగా అత్యవసర పరిస్థితి రూపంలో దేశాన్ని మళ్లీ బానిసగా చేయడానికి ప్రయత్నించినప్పుడు రామ్‌నాథ్ గారు బలంగా నిలబడ్డారుఈ సంవత్సరంతో అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తవుతాయిప్రజలను బానిసలుగా చేయాలని చూసే ఆలోచనను ఖాళీ సంపాదకీయాలు కూడా సవాలు చేయగలవని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చూపించింది

మిత్రులారా

బానిస మనస్తత్వం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే అంశం గురించి ఇవాళ ఈ గౌరవనీయమైన వేదిక నుంచి నేను వివరంగా మాట్లాడుతానుదీని కోసం మనం 190 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం కంటే వెనక్కు వెళ్లాలిఅదే 1835 సంవత్సరంబ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో భారతదేశ పునాదిని పెకిలించివేసేందుకు ఒక భారీ పథకాన్ని ప్రారంభించారురూపంలో భారతీయులుగా ఉంటూ ఆలోచన పరంగా ఆంగ్లేయులుగా ఉండే భారతీయులను తయారుచేస్తానని ఆయన ప్రకటించారుదీనిని సాధించేందుకు భారతీయ విద్యా వ్యవస్థను కేవలం మార్చడమే కాకుండా.. మూలాల నుంచి ధ్వంసం చేశారుభారత ప్రాచీన విద్యా వ్యవస్థ అందమైన చెట్టు లాంటిదని.. దానిని పెకిలించి నాశనం చేశారని మహాత్మాగాంధీ స్వయంగా చెప్పారు

మిత్రులారా

మన సంస్కృతి పట్ల గర్వంగా ఉండాలని మన విద్యా వ్యవస్థ మనకు నేర్పించిందిచదువుతో పాటు నైపుణ్యాలకు కూడా భారత విద్యా వ్యవస్థ సమాన ప్రాధాన్యత ఇచ్చిందిఅందుకే దేశ విద్యా వ్యవస్థ వెన్నెముకను విరిచేయాలని మెకాలే నిర్ణయించుకున్నారుఆయన ఈ లక్షాన్ని సాధించటంలో విజయవంతం అయ్యారుఆ సమయంలో బ్రిటీష్ భాషబ్రిటీష్ ఆలోచనకు ఎక్కువ గుర్తింపు లభించేలా మెకాలే చూసుకున్నారుఅప్పటి నుంచి శతాబ్దాల పాటు దీనికి భారత్ మూల్యం చెల్లించింది.

మిత్రులారా

మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశారుఆయన మనలో న్యూనతా భావాన్ని నింపారుఒక్క దెబ్బతో మన వేల సంవత్సరాల జ్ఞానంవిజ్ఞానాన్నిమన కళసంస్కృతినిమన మొత్తం జీవన విధానాన్ని చెత్తబుట్టలో పడేశారుభారతీయులు పురోగమించాలంటేఏదైనా గొప్పది సాధించాలంటే విదేశీ పద్ధతుల ద్వారానే చేయాలనే బీజం ఆ క్షణంలోనే పడిందిఈ భావన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మరింత బలపడిందిమన విద్యమన ఆర్థిక వ్యవస్థమన సామాజిక ఆకాంక్షలు.. అన్నీ విదేశీ వ్యవస్థలకు కట్టుబడిపోయాయిమనదైన దాని పట్ల గర్వంగా ఉండే భావన క్రమంగా తగ్గిపోయిందిగాంధీజీ స్వాతంత్య్రానికి పునాదిగా భావించిన స్వదేశీకి విలువ లేకుండా పోయిందిమనం పరిపాలనా పద్ధతులను విదేశాల్లో వెతకటం ప్రారంభించాంఆవిష్కరణల కోసం మనం విదేశాల వైపు చూడటం ప్రారంభించాందిగుమతి చేసుకున్న ఆలోచనలుదిగుమతి చేసుకున్న వస్తువులుదిగుమతి చేసుకున్న సేవలు ఉన్నతమైనవిగా పరిగణించే ధోరణికి ఈ మనస్తత్వం దారితీసింది

మిత్రులారా

ఒకరు సొంత దేశాన్ని గౌరవించనప్పుడు దేశీయ వ్యవస్థను తిరస్కరిస్తారుఅలాంటి వారు భారత్‌లోని తయారీ వ్యవస్థను ఒప్పుకోరునేను పర్యాటకానికి సంబంధించిన ఉదాహరణ మీకు చెప్తానుపర్యాటకం అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ సొంత చారిత్రక వారసత్వం పట్ల స్థానిక ప్రజలు గర్వంగా ఉండటం మీరు గమనిస్తారుమన విషయంలో దీనికి వ్యతిరేకంగా జరిగిందిస్వాతంత్ర్యం తర్వాత మన వారసత్వాన్ని నిర్లక్ష్యం చేసే ప్రయత్నాలు జరిగాయివారసత్వం పట్ల గౌరవం లేనప్పుడు దానిని సంరక్షించేందుకు ప్రయత్నం జరగదుసంరక్షణ అనేది లేనప్పుడు దానిని మనం కేవలం రాళ్లుశిథిలాల వలె చూస్తాంమనకు కూడా ఇదే జరిగిందిపర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటే మన వారసత్వం పట్ల తప్పనిసరిగా గర్వంగా ఉండాలి

మిత్రులారా

స్థానిక భాషల విషయంలో కూడా ఇదే నిజంఏ దేశంలోనైనా స్థానిక భాషలను తక్కువగా చూస్తారాజపాన్చైనాకొరియా వంటి దేశాలు అనేక పాశ్చాత్య పద్ధతులను అవలంబించాయి కానీ వారు తమ భాషలను చెక్కుచెదరకుండా కాపాడుకున్నారువాళ్లు తమ భాషల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదుఅందుకే మేం కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలలో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. ‘మేం ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు.. మేం భారతీయ భాషలకు మద్దతుగా ఉన్నాం’ అనే విషయాన్ని నేను స్పష్టంగా చెబుతున్నాను

మిత్రులారా

1835లో మెకాలే ద్వారా ఈ నేరం జరిగిందిమరో పది సంవత్సరాల తర్వాత అంటే 2035లో ఈ నేరానికి 200 సంవత్సరాలు నిండుతాయిఇందుకే ఇవాళ నేను మీ ద్వారా దేశం మొత్తానికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.. రాబోయే 10 సంవత్సరాలలో మెకాలే బానిస మనస్తత్వం నుంచి మనం విముక్తి పొందాలని ప్రతిజ్ఞ చేయాలిఈ రాబోయే 10 సంవత్సరాలు మనకు అత్యంత ముఖ్యమైనవినాకు ఒక చిన్న సంఘటన గుర్తు ఉందిగుజరాత్‌లో కుష్టురోగుల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించారుదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ఆస్పత్రికి సంబంధించిన వాళ్లు మహాత్మాగాంధీ వద్దకు వెళ్లారుకుష్టురోగుల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి తాను అనుకూలం కాదని గాంధీజీ చెప్పారు. “నేను ప్రారంభోత్సవానికి రానుకానీ ఆ ఆసుపత్రిని శాశ్వతంగా మూసేయాల్సి వచ్చినప్పుడు నన్ను పిలవండినేను వచ్చి తాళం వేస్తాను” అని గాంధీజీ అన్నారుగాంధీజీ జీవితకాలంలో ఆ ఆసుపత్రికి తాళం పడలేదుకానీ కుష్టువ్యాధి రహితంగా గుజరాత్ మారినప్పుడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆసుపత్రికి తాళం వేసే అవకాశం నాకు లభించిందిఆస్పత్రికి తాళం వేయాలని గాంధీజీ కోరుకున్నట్లే.. 1835లో ప్రారంభమైన ఈ ప్రయాణం 2035 నాటికి ముగియాల్సి ఉందిఈ మనస్తత్వానికి మనం శాశ్వతంగా తాళం వేయడం అనేది కూడా నా కల.

మిత్రులారా

ఈ రోజు మనం అనేక అంశాల గురించి మాట్లాడుకున్నంనేను మీ సమయాన్ని మరింతగా తీసుకోదలచుకోలేదుఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు మన దేశంలోని ప్రతి పరివర్తనప్రతి వృద్ధి కథనానికి సాక్షిగా ఉంది. 'వికసిత భారత్'గా మారాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్నప్పుడు.. ఈ గ్రూపు మరోసారి ఈ ప్రయాణంలో ఒక భాగమైందిరామ్‌నాథ్ గారి ఆలోచనలుఆదర్శాలను పూర్తి అంకితభావంతో పరిరక్షించేందుకు మీరు చేస్తున్న నిజాయితీతో కూడిన ప్రయత్నాలను నేను అభినందిస్తున్నానుఈ అద్భుతమైన కార్యక్రమం పట్ల మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానురామ్‌నాథ్ గోయెంకా గారికి గౌరవపూర్వక నమస్కారాలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను

 

***


(Release ID: 2191212) Visitor Counter : 5