ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసిలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

Posted On: 08 NOV 2025 11:20AM by PIB Hyderabad

హర హర మహాదేవ!

నమః పార్వతీ పతయే!

హర హర మహాదేవ!

పరిపాలన దక్షుడైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడువికసిత భారత నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తున్న అద్భుత సాంకేతిక ప్రగతికి సారథ్యం వహిస్తున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు.. టెక్నాలజీ సాయంతో ఎర్నాకులం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ గారు.. కేంద్రంలోని నా సహచరులు సురేశ్ గోపీ గారుజార్జ్ కురియన్ గారు.. కేరళలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర మంత్రులుప్రజా ప్రతినిధులు.. కేంద్రంలో నా సహచరుడుపంజాబ్ నాయకుడుఫిరోజ్‌పూర్ నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న రవ్నీత్ సింగ్ బిట్టు గారుఅక్కడి ప్రజా ప్రతినిధులు.. లక్నో నుంచి పాల్గొంటున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ గారు.. ఇతర విశిష్ట అతిథులు.. కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులారా!

బాబా విశ్వనాథుడు కొలువై ఉన్న ఈ పవిత్ర నగరంలో.. మీ అందరికీకాశీలోని ప్రతి కుటుంబానికి నా నమస్కారాలువైభవోపేతమైన దేవ్ దీపావళి వేడుకలను నేనిక్కడ చూశానునేడు కూడా శుభప్రదమైన రోజుఈ అభివృద్ధి పండుగ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు!

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో బలమైన మౌలిక సదుపాయాలే వారి ఆర్థిక పురోగతికి ప్రధాన కారణంగణనీయమైన వికాసాన్నిఅభివృద్ధిని సాధించిన ప్రతి దేశంలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధే వారి పురోగతికి చోదక శక్తిఉదాహరణకు సంవత్సరాలుగా రైల్వే లైన్ట్రాక్‌లురైళ్లుస్టేషన్ లేని ఓ ప్రాంతాన్నే ఊహించండి.. అదెలా ఉంటుందో.. కానీ పట్టాలు వేసిస్టేషన్ నిర్మించగానేవెంటనే ఆ పట్టణం అభివృద్ధి మొదలవుతుందిఏళ్ల తరబడి సరైన రోడ్లు ఉండవుగ్రామస్థులకు బురద రోడ్లే గతికానీ ఒక్కసారి చిన్న రోడ్డు నిర్మిస్తే రైతులు సులభంగా ప్రయాణించడానికి వీలవుతుందివారి ఉత్పత్తులు మార్కెట్లకు చేరుతాయిమౌలిక వసతులంటే పెద్ద వంతెనలుహైవేలు మాత్రమే కాదుఅలాంటి సదుపాయాలు అభివృద్ధి చెందితే ఆ ప్రాంత వికాసం మొదలవుతుందిమన గ్రామాలుచిన్న పట్టణాలుదేశం మొత్తానికీ అది వర్తిస్తుందినిర్మిస్తున్న విమానాశ్రయాల సంఖ్యనడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్యభారత్‌ను ప్రపంచంతో అనుసంధానించే అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరగడం... ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధితో ముడిపడి ఉన్నాయినేడు భారత్ కూడా ఈ మార్గంలో వేగంగా ముందుకు సాగుతోందిఇదే స్ఫూర్తితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నాంకాశీ–ఖజురహో వందే భారత్‌తో పాటు.. ఫిరోజ్‌పూర్– ఢిల్లీ వందే భారత్లక్నో – సహరాన్‌పూర్ వందే భారత్ఎర్నాకుళం– బెంగళూరు వందే భారత్‌లు కూడా ప్రారంభమవుతున్నాయిఈ నాలుగు కొత్త రైళ్లతో ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 160 దాటిందిఈ విజయం పట్ల కాశీ ప్రజలకుదేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా,

నేడు వందే భారత్నమో భారత్అమృత్ భారత్ వంటి రైళ్లు తదుపరి తరం భారతీయ రైల్వేలకు పునాదిగా నిలుస్తున్నాయిభారతీయ రైల్వేల్లో విప్లవాత్మక మార్పుల దిశగా ఇదొక సంపూర్ణ కార్యక్రమంవందే భారత్ రైలు భారతీయుల కోసంభారతదేశంలో భారతీయులు తయారు చేసినదిఅది ప్రతి భారతీయుడికీ గర్వకారణంమనం నిజంగా ఇలా చేయగలమాఇది విదేశాల్లో మాత్రమే జరిగే విషయం కాదాఇక్కడ కూడా ఇలా జరుగుతుందా?” అని గతంలో ఆలోచించేవారుఇదిప్పుడు జరుగుతోందిఅవునాకాదాఇది మన దేశంలోనే జరుగుతోందాలేదామన దేశంలోమన సొంత ప్రజలే దీన్ని తయారు చేస్తున్నారాలేదాఇదే మన దేశ బలంనేడు విదేశీ ప్రయాణికులు కూడా వందే భారత్ రైలును చూసి ఆశ్చర్యపోతున్నారువికసిత భారత్ లక్ష్యం దిశగా సామర్థ్యాల అభివృద్ధి కోసం భారత్ ప్రారంభించిన ప్రస్థానంలో ఈ రైళ్లు కీలక విజయం.

మిత్రులారా,

శతాబ్దాలుగా భారత్‌లో తీర్థయాత్రలను దేశ చేతనా మాధ్యమంగా పరిగణిస్తున్నారుఈ ప్రయాణాలు కేవలం దైవ దర్శన మార్గాలు మాత్రమే కాదు.. భారతీయ ఆత్మను అనుసంధానించే పవిత్ర సంప్రదాయాలివిప్రయాగరాజ్అయోధ్యహరిద్వార్చిత్రకూట్కురుక్షేత్ర వంటి ప్రదేశాలుఅసంఖ్యాకంగా ఉన్న ఇతర తీర్థయాత్రా స్థలాలు మన ఆధ్యాత్మిక వారసత్వానికి కేంద్రాలునేడు ఈ పవిత్ర ప్రదేశాలను వందే భారత్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించడమంటే.. అది భారత సంస్కృతినివిశ్వాసాన్నిఅభివృద్ధిని కూడా అనుసంధానించడమేభారత వారసత్వ నగరాలను దేశ పురోగతికి చిహ్నాలుగా నిలిపే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.

మిత్రులారా,

ఈ తీర్థయాత్రల్లో ఆర్థిక కోణం కూడా ఉందిదాన్ని చాలావరకూ అంతగా గుర్తించరుగత పదకొండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి పనులు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పూర్తిగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయిఒక్క పోయిన ఏడాదిలోనే 11 కోట్ల మంది బాబా విశ్వనాథుని దర్శనం కోసం కాశీని సందర్శించారురామాలయం నిర్మించినప్పటి నుంచి కోట్లకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు పొందారుఈ యాత్రికులు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయలను అందించారుహోటళ్ళువ్యాపారులురవాణా సంస్థలుస్థానిక కళాకారులుపడవ నడిపేవారికి వారు ఎప్పటికప్పుడు ఆదాయ అవకాశాలను అందించారుఫలితంగా బనారస్‌లోని వందలాది మంది యువత రవాణా సేవల నుంచి బనారసి చీరల వరకుఅలాగే అనేక ఇతర కొత్త వ్యాపారాలను నేడు మొదలుపెడుతున్నారుఇవన్నీ ఉత్తరప్రదేశ్‌నుముఖ్యంగా కాశీని సుసంపన్నం చేస్తున్నాయి.

మిత్రులారా,

వికసిత భారత్ ద్వారా వికసిత కాశీ’ని సాకారం చేయడం లక్ష్యంగా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మేమిక్కడ చేపడుతున్నాంనేడు కాశీలో ఆసుపత్రులురోడ్లుగ్యాస్ పైప్‌లైన్‌లుఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తరణ పెరుగుతున్నాయిసంఖ్యలకే పరిమితం కాకుండాఅభివృద్ధి ద్వారా గుణాత్మక ఫలితాలూ వస్తున్నాయిరోప్ వే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయిగంజరిసిగ్రా స్టేడియం వంటి క్రీడా మౌలిక సదుపాయాలూ అందుబాటులోకి వస్తున్నాయిబనారస్ సందర్శనబనారస్‌లో నివాసంబనారస్‌లో సదుపాయాలను అనుభూతి చెందడం ప్రతి ఒక్కరికీ విశిష్టమైనప్రత్యేకమైన అనుభవాన్నివ్వాలన్న లక్ష్యంతో మేం కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

కాశీలో ఆరోగ్య రక్షణ సేవలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందిఓ 10-11 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదంటే.. ప్రజలకు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తితే బనారస్ హిందూ విశ్వవిద్యాలయమే దిక్కుగా ఉండేదిరోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో.. రాత్రంతా క్యూ లైన్లలో నిలబడినా చాలామంది చికిత్స పొందలేకపోయేవారుఎవరికైనా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే.. కుటుంబాలు తమ భూములనుపొలాలను అమ్ముకుని చికిత్స కోసం ముంబయికి వెళ్లాల్సి వచ్చేదినేడు మా ప్రభుత్వం కాశీ ప్రజల ఈ ఆందోళనల పరిష్కారానికి కృషి చేసిందిక్యాన్సర్ చికిత్స కోసం మహామన క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పాంకంటి సంరక్షణ కోసం శంకర్ నేత్రాలయబీహెచ్‌యూలో అత్యాధునిక ట్రామా సెంటర్శతాబ్ది ఆసుపత్రిఅలాగే పాండేపూర్‌లో డివిజనల్ ఆసుపత్రి... ఇవన్నీ కాశీపూర్వాంచల్‌కే కాకుండా పొరుగు రాష్ట్రాలకూ వరంలా మారాయిఆయుష్మాన్ భారత్జన ఔషధి కేంద్రాల కారణంగా.. లక్షలాది పేదలకు నేడు తమ వైద్య ఖర్చుల కోసం చేసే కోట్లాది రూపాయలు ఆదా అవుతున్నాయిఇది ఓ వైపు ప్రజల ఆందోళనలను తగ్గించడమే కాకుండా.. మరోవైపు కాశీ ఇప్పుడు ఈ ప్రాంత ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందుతోంది.

మిత్రులారా,

కాశీ అభివృద్ధిలో ఈ ఉత్తేజాన్నిశక్తిని మనం తప్పక కొనసాగించాలితద్వారా ఈ గొప్పదివ్య నగరం అనతికాలంలోనే సుసంపన్నంగానూ మారుతుందిప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరు కాశీని సందర్శించినా... బాబా విశ్వనాథుడి ఈ పవిత్ర నగరంలో ఓ విశిష్ట శక్తినిప్రత్యేక ఉత్సాహాన్నిసాటిలేని ఆనందాన్ని వారు అనుభూతి చెందుతారు.

మిత్రులారా,

కొద్దిసేపటి కిందటే వందే భారత్ రైలులో నేను కొందరు విద్యార్థులతో మాట్లాడానుఅశ్వినీ వైష్ణవ్ గారిని నేను అభినందిస్తున్నానుఓ అద్భుత సంప్రదాయాన్ని ఆయన ప్రారంభించారుఎక్కడ వందే భారత్ రైలును ప్రారంభించినా.. అభివృద్ధివందే భారత్వికసిత భారత్ దార్శనికతకు సంబంధించి వివిధ ఇతివృత్తాలపై పాఠశాల పిల్లలకు చిత్రలేఖనంకవితల పోటీలు నిర్వహిస్తున్నారుసాధన చేసేందుకు పిల్లలకు కొన్ని రోజులే ఉన్నప్పటికీ.. వారి సృజనాత్మకత నన్నెంతో ఆకట్టుకుందివికసిత కాశీవికసిత భారత్సురక్షిత భారత్‌లను వర్ణించే చిత్రలేఖనాలను వారు వేశారు12 - 14 ఏళ్ల వయస్సున్న చిన్నారులు రాసిన కవితలను కూడా నేను విన్నానుఎంత అందమైనఆలోచనాత్మకమైన పద్యాలవిఇంత ప్రతిభావంతులైన పిల్లలు నా కాశీకి చెందినవారు కావడం ఇక్కడి పార్లమెంటు సభ్యుడిగా నాకు గర్వకారణంనేను వారిలో కొంతమందిని ఇక్కడ కలిశానుఓ పిల్లవాడు చేయి లేకపోయినప్పటికీ అద్భుతమైన పెయింటింగ్‌ వేశాడుఇది నాకు చాలా ఆనందాన్నిచ్చిందిపిల్లలకు స్ఫూర్తినిచ్చిమార్గనిర్దేశం చేసిన ఈ పాఠశాలల ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానువారి ప్రతిభనుఉత్సాహాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలునిజానికి ఈ పిల్లల కోసం ఇక్కడ 'కవి సమ్మేళనంనిర్వహించాలని, 8-10 మంది ఉత్తమ యువ కవులను ఎంపిక చేసి దేశవ్యాప్తంగా వారి కవితలను పంచుకోవాలని నాకు ఆలోచన వచ్చిందికాశీ ఎంపీగా ఈ రోజు నాకిది స్ఫూర్తిదాయకమైన అనుభవంనిజంగా నేనెంతో ఆనందంగా ఉన్నానుఈ పిల్లలకు నా హృదయపూర్వక ప్రశంసలుఅభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నేను అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందిఅందుకే ఇక్కడ ఓ చిన్న కార్యక్రమాన్ని మాత్రమే ఏర్పాటు చేశారునేను త్వరలోనే బయల్దేరాలి కూడా.. కానీ మీలో చాలా మంది ఉదయాన్నే ఇక్కడ సమావేశమవడం నాకు చాలా ఆనందాన్నిస్తోందినేటి ఈ కార్యక్రమం సందర్భంగాకొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలుధన్యవాదాలు!

హర హర మహాదేవ!

 

***


(Release ID: 2188161) Visitor Counter : 11