ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన యూఎస్ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు


ప్రజాస్వామ్య ఉమ్మడి విలువలతో పాటు ప్రపంచ శాంతికి కట్టుబడి ఉందామంటూ పునరుద్ఘాటన

प्रविष्टि तिथि: 22 OCT 2025 8:25AM by PIB Hyderabad

దీపావళికి స్వయంగా ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలను చెప్పినందుకు అమెరికా అధ్యక్షుడు గౌరవ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా కృతజ్ఞ‌తలు తెలియజేశారు.

భారత్-అమెరికా భాగస్వామ్యం చాలాకాలంగా బలోపేతం అవుతోందని ప్రధానమంత్రి స్పష్టంచేశారుఉగ్రవాదంతో పోరాటంలోనూఅంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ భారత్ నిబద్ధత తిరుగులేనిదని కూడా పునరుద్ఘాటించారు.

ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూఇలా పేర్కొన్నారు:

‘‘అధ్యక్షుడు శ్రీ ట్రంప్ గారూ... ఫోన్ చేసినందుకూదీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలుఈ దీపాల పండగ సందర్భంగా.. మన రెండు ప్రజాస్వామ్యదేశాలూ ప్రపంచంలో ఆశాజ్యోతిని వెలిగించేందుకూఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో ఇరువురూ ఏకతాటిపై నిలబడాలనీ నేను కోరుకుంటున్నాను.’’

 

***


(रिलीज़ आईडी: 2181631) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam