ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 17 OCT 2025 11:03PM by PIB Hyderabad

శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికిఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రినా స్నేహితుడు టోనీ అబాట్‌ గారికిబ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్‌ గారికిగౌరవ అతిథులకుసోదరీ సోదరులకూ నా నమస్కారం!

ఇది పండుగల కాలంమీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానుఉత్సాహభరితమైన వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందిఈ సదస్సుకు మీరు ఎంచుకున్న ఇతివృత్తం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ‘‘దూసుకుపోతున్న భారత్‌’’ (అన్‌స్టాపబుల్‌ భారత్‌).. నిజానికి నేడు భారత్ ఆగిపోయే పరిస్థితుల్లో లేదుమేము (భారత్‌ఎప్పుడూ ఆగంఆపం కూడా. 140 కోట్ల మంది భారతీయులం.. కలిసికట్టుగా వేగంగా ముందుకు సాగిపోతున్నాం.

మిత్రులారా,

ఈ రోజు ప్రపంచం గణనీయమైన అవరోధాలుఅడ్డంకులను ఎదుర్కొంటున్న సమయంలో.. ‘‘దూసుకుపోతున్న భారత్‌ (అన్‌స్టాపబుల్‌ భారత్‌)’’ అనే చర్చ సహజమేనేను దీనినిపదకొండు సంవత్సరాల కిందటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి అనే సందర్భంలో వివరించాలనుకుంటున్నానుమీకు గుర్తుందనుకుంటాను... 2014 కు ముందు ఇలాంటి సదస్సులో ఎలాంటి విషయాలుఅంశాలు చర్చ వచ్చి ఉంటాయో?. వీధుల్లోపొరుగు ప్రాంతాల్లోని సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరిగేవో మీరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుందిప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లను భారత్‌ ఎలా ఎదుర్కొంటుంది?. ఆర్థికంగా బలహీనమైన అయిదు దేశాల నుంచి భారత్ ఎప్పుడు బయటకొస్తుందిభారత్‌లో విధాన స్థబ్దత ఎంతకాలం కొనసాగుతుందిభారత్‌లో భారీ కుంభకోణాలు ఎప్పటికి ఆగుతాయి?  అప్పుడు చర్చలు ఇలా ఉండేవి!

మిత్రులారా,
ఒకప్పుడు మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు ఉండేవిఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ పై ఎలాంటి నియంత్రాణాలేదని వార్తలూ వచ్చాయి. ‘‘మహంగాయి డైన ఖాయే జాత్ హై’’ (ద్రవ్యోల్బణం అనే పిశాచి దేశాన్ని కబళిస్తోందివంటి పాటలు ప్రజల్లో విస్తృతంగా వినిపించేవి. 2014కి ముందు పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు మీకు స్పష్టంగా గుర్తుకు రావొచ్చుఎన్నో సంక్షోభాల్లో చిక్కుకున్న భారత్ ఈ పరిస్థితుల నుంచి బయటపడలేదని దేశ వాసులతోపాటు ప్రపచమంతా నమ్మేవారుకానీ గత పదకొండు సంవత్సరాల్లో భారత్ ఆ సందేహాలన్నింటిని తొలగించిందిప్రతి సవాలును అధిగమించిందినేడు భారత్ అయిదు ఆర్థిక బలహీన దేశాల్లో లేదుఇప్పుడు ప్రపంచంలో అయిదు గొప్ప ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా ఎదిగిందిఈ రోజు ద్రవ్యోల్బణం శాతంకంటే తక్కువ ఉందివృద్ధిరేటు శాతం కంటే ఎక్కువగా ఉంది. ‘‘"చిప్స్’’ నుంచి ‘‘షిప్పుల’’ వరకూ స్వావలంబన భారత్.. ఆత్మవిశ్వాసంతో నిండిన భారత్‌గా మారిందినేడు భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే నిశ్శబ్దంగా ఉండదుసర్జికల్ స్ట్రైక్స్వైమానిక దాడులుఆపరేషన్ సిందూర్ లాంటి తగిన ప్రతిచర్యలు తీసుకుంటోంది.

మిత్రులారా,

కోవిడ్ కాలం గురించి ఒకసారి ఆలోచించండిఆ సమయంలో జీవన్మరణాల మధ్య ప్రపంచం ఊగిసలాడిందిఇంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎలా తట్టుకుంటుందోనని ప్రపంచం ఆలోచిస్తున్నప్పుడుఅంతేగాక భారత్‌ కారణంగా ప్రపంచం మునిగిపోతుందని భావించినప్పుడురకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయికానీ భారత్‌ ప్రతి ఊహాగానాన్నీ తప్పని నిరూపించిందిమేం వాటిని తిప్పికొట్టాంత్వరగా మా సొంత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాంరికార్డు సమయంలో వ్యాక్సిరన్లను అందించాంఅంత పెద్ద సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత.. మేం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారాం.

మిత్రులారా,

కరోనా ప్రభావం పూర్తిగా ముగియకముందే.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గొడవలుయుద్ధాలు మొదలయ్యాయివార్తల ముఖ్యాంశాల్లో యుద్ధం గురించి కథనాలు కనిపించడం ప్రారంభించాయిఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ అభివృద్ధి ఎలా సాధించగలదనే ప్రశ్న మళ్లీ తలెత్తిందికానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ మళ్లీ అన్ని ఊహాగానాలను తిప్పికొట్టిందిప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ప్రస్థానాన్ని కొనసాగించిందిగత మూడేళ్లలో భారత్ సగటు వృద్ధి రేటు 7.8 శాతంఇది అపూర్వమైనదిఊహించని స్థాయిలో ఉందికేవలం రెండు రోజుల క్రితమే వస్తువుల ఎగుమతుల గణాంకాలు బయటకు వచ్చాయిగత ఏడాదితో పోలిస్తే మన వస్తువుల ఎగుమతుల్లో సుమారు శాతం పెరిగాయిగతేడాది భారత్‌ సుమారు రూ. 4.5 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసిందిఅనేక దేశాల అస్థిర రేటింగ్‌ల నేపథ్యంలో ఎస్‌ అండ్‌ పీ సంస్థ 17 సంవత్సరాల తర్వాత భారతదేశ క్రెడిట్ రేటింగ్‌ను ఉన్నత స్థాయికి చేర్చిందిఅంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా భారత్‌ వృద్ధిని మెరుగుపరిచిందికొన్ని రోజుల క్రితమే గూగుల్‌ సంస్థ భారత్‌లో కృత్రిమ మేధ రంగంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందినేడు హరిత ఇంధనంసెమికండక్టర్ల రంగాల్లోకి కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి.

మిత్రులారా,

నేడు భారత్ అభివృద్ధి చెందడమే కాదుప్రపంచ అవకాశాలను కూడా రూపొందిస్తోందినేను దీన్ని పూర్తి బాధ్యతతో చెబుతున్నానుఇటీవల సంతకం చేసిన ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం ఇందుకు గొప్ప ఉదాహరణయూరోపియన్ దేశాలు భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయిఇది దేశంలో లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తుందికొన్ని రోజుల కిందట నా స్నేహితుడు ఇంగ్లాండ్ ప్రధాని స్టార్మర్ తన అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందంతో భారత్‌ను సందర్శించారుభారత్‌లో ఉన్న విస్తృత అవకాశాల కోసం ప్రపంచమెంతో ఆశతో చూస్తున్నదనే దానికి ఇది స్పష్టమైన ఉదాహరణనేడు జీదేశాలతో భారత్‌ వాణిజ్యం 60 శాతానికిపైగా పెరిగిందిప్రపంచం మొత్తం దేశాన్ని ఒక నమ్మకమైనబాధ్యతాయుతమైనమేలైన భాగస్వామిగా చూస్తోందిఎలక్ట్రానిక్స్ నుంచి ఫార్మా వరకుఆటోమొబైల్స్ నుంచి మొబైల్ తయారీ వరకు పెట్టుబడుల ప్రవాహం భారత్ వైపు వస్తోందిఈ పెట్టుబడులు భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఒక నాడీ కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది.

మిత్రులారా,

ఈ సమావేశంలో మనం ‘‘అజ్ఞాతపు అంచున’’(ఎడ్జ్‌ ఆఫ్‌ ది అన్‌నోన్‌అనే అంశంపై చర్చిస్తున్నాంప్రపంచానికి ఇది ఒక అనిశ్చిత విషయం కావచ్చుకానీ భారత్‌కు ఇది అవకాశాల స్వర్గంఅనేక శతాబ్దాలుగా అన్వేషణకుఅపరిచిత మార్గాల్లో నడకకు భారత్ ధైర్యం చూపిస్తూ వచ్చిందిమన సాధువులుశాస్త్రవేత్తలునావికులు ఎప్పుడూ ‘మొదటి అడుగు’ మార్పునకు నాంది అని నిరూపించారుఅది సాంకేతికత నుంచి కరోనా టీకా అవసరం వరకునైపుణ్యం కలిగిన మానవశక్తి అయినాఫిన్‌టెక్ లేదా హరిత ఇంధనం రంగం అయినా ప్రతీ ప్రమాదాన్ని మనం సంస్కరణగా మార్చాంప్రతి సంస్కరణను స్థిరత్వంగా మార్చాంఆ స్థిరత్వాన్ని విప్లవంగా మార్చాందేశంలోని సంస్కరణల ధైర్యాన్ని చూసి ఆయన ఎంతో ఆఆనందంగా ఉందని ఇటీవల ఐఎంఎఫ్‌ ముఖ్య అధికారి ఒకరు చెప్పారుఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారుఒకప్పుడు భారత్‌లో ఒక సంస్కరణ జరిగిందని మీకు తెలిసి ఉండొచ్చుఆ సంస్కరణ గురించి కొన్ని వర్గాలు ఇంకా పాటలు పాడుతూనే ఉంటాయిమా స్నేహితులు అక్కడ నవ్వుతున్నారుఎందుకంటే అది ఒక బలవంతం వల్ల జరిగిందిఆ బలవంతం కూడా ఐఎంఎఫ్‌ నుంచి వచ్చిందికానీ ఇవాళ సంస్కరణలు మన నమ్మకంతో జరుగుతున్నాయిఅదే ఐఎంఎఫ్‌ ఇప్పుడు దేశ సంస్కరణల ధైర్యాన్ని ప్రశంసిస్తోందిఐఎంఎఫ్‌ అధికారి ఒక ఉదాహరణ కూడా చెప్పారుసామూహిక స్థాయిలో డిజిటల్ గుర్తింపు అందించడం సాధ్యం కాదని అందరూ అనుకున్నారుకానీ భారత్ అది సాధించి చూపించిందిఇప్పుడు ప్రపంచంలో జరిగే వాస్తవిక డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయిఅర్థం చేసుకోండి. 50 శాతంప్రపంచ డిజిట్‌ చెల్లింపు వ్యవస్థలో భారత యూపీఐ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందిదీని అర్థం ప్రతి అంచనాను అధిగమించడం నేడు భారత్‌ ధోరణిగా మారిందినేను ‘స్వభావం’ అనలేదు, ‘ధోరణి’ అన్నానుఎందుకంటే మోదీ ఉన్నంతకాలం ఆయన ధోరణి గురించి మాట్లాడుతాడుఅందుకే భారత్ అడ్డుకోలేనిది.

మిత్రులారా,

దేశం సాధించిన విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ప్రజల నుంచే వస్తుందికానీ ఆ ప్రజలు తమ సామర్థ్యాన్ని సమర్ధంగా ఉపయోగించగలగాలంటే వారి జీవితాల్లో ప్రభుత్వ హస్తంప్రభుత్వ ఒత్తిడి లేకుండా ఉండాలిప్రభుత్వం జోక్యం ఎక్కువైతే అభివృద్ధికి అడ్డుకట్టలు పెరుగుతాయికానీ ప్రజాస్వామ్యీకరణ ఎక్కువైతే అభివృద్ధికి వేగం పెరుగుతుందిదురదృష్టవశాత్తూ 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాలన విధానాలనూప్రక్రియల్నీ ప్రభుత్వాధీనంగా మార్చడంపైనే దృష్టి పెట్టిందిదాంతో ప్రతీ వ్యవస్థపై ఓ కఠినమైన నియంత్రణ ఏర్పడిందికానీ గత 11 ఏళ్లుగా మన ప్రభుత్వం విధానాల ప్రక్రియపైప్రజాస్వామ్యీకరణపై దృష్టి పెట్టిందిఇది కూడా అన్‌స్టాపబుల్ భారత్‌ వెనకున్న ఒక ప్రధాన కారణంబ్యాంకింగ్ రంగాన్ని ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. 1960వ దశాబ్దంలో ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయీకరణ వెనుక కారణం ఏంటిరైతులకుపేదలకుకార్మికులైన దేశ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించాలన్నది తమ నినాదమని చెప్పారుకానీ వాస్తవంగా ఏం జరిగింది?. కాంగ్రెస్‌ ఏం చేసిందిబ్యాంకులు ప్రజలకు మరింత దూరమయ్యాయిపేదలు బ్యాంకు గేటు దాటి లోపలికి వెళ్ళడానికే భయపడే పరిస్థితి వచ్చిందిఇది ప్రభుత్వం మీద ప్రజలకు పడిన భారమేమన ప్రభుత్వం 2014లో బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో సగానికి పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలే లేవుఇక్కడ సమస్య వాళ్లకు బ్యాంకు ఖాతా లేకపోవడమే కాదుదీని అర్థం దేశ జనాభాలో ఎక్కువ భాగం ప్రజలు బ్యాంకింగ్ ప్రయోజనాలనే కోల్పోయారుదీంతో వాళ్లు అవసరాల కోసం అత్యధిక వడ్డీలపై అప్పులు తీసుకోవాల్సి వచ్చేదిఇళ్లుభూములు తనఖా పెట్టాల్సి వచ్చివిలువైన ఆస్తులను కోల్పోయేవారుకానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

మిత్రులారా,

ఈ ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ నుంచి దేశాన్ని విముక్తం చేయడం అత్యవసరం అయ్యిందిమేము దానిని సాధించాంబ్యాంకింగ్ రంగాన్ని ప్రజాస్వామ్యీకరించాంసంస్కరించాంనిబద్ధతకృషితో పని చేసి 50 కోట్లకు పైగా జనధన్ ఖాతాలు తెరిచాంఇది గొప్ప విశేషంఎందుకంటే ప్రపంచంలో తెరిచిన అన్ని ఖాతాల మొతం ఒకవైపు ఉంటే.. భారత్‌ మాత్రమే మరో వైపుగా నిలుస్తుందినేడు దేశంలోని ప్రతి గ్రామానికీ ఏదో ఒక బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయిడిజిటల్ లావాదేవీలతో భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆర్థిక స్వారజనీనత కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది.

కానీ కాంగ్రెస్ పాలనలో బ్యాంకుల్లో ఎన్పీఏల పర్వం ఏర్పడిందిఅటు ప్రైవేట్ రంగంఇటు ప్రభుత్వ రంగం కుదేలయ్యాయికానీ బీజేపీ తీసుకువచ్చిన ప్రజాస్వామ్య విధానాలుబ్యాంకులకు రికార్డు లాభాలు తీసుకువచ్చాయిగత 11 సంవత్సరాల్లో మహిళల స్వయం సహాయ సంఘాలుచిన్న రైతులుపశుపెంపకందారులుమత్స్యకారులువీధి వ్యాపారులువిశ్వకర్మ మిత్రులు.. ఇలా ఎంతోమందికి లక్షల కోట్ల రూపాయల రుణాలు అందాయిఇవన్నీ బ్యాంకుహామీలు లేకుండానే ఇవ్వడం జరిగింది.

మిత్రులారా,

పెట్రోల్గ్యాస్ రంగానికి సంబంధించిన మరో ఉదాహరణ కూడా నేను మీకు ఇస్తాను. 2014 కి ముందు పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసాజాతీయీకరణ ఆలోచన ప్రబలంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉండేదో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారుపెట్రోల్డీజిల్ పై సబ్సిడీలు పెరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రి గంటల నుంచి ఉదయం గంటల వరకు పెట్రోల్ బంకులను మూసివేయడానికి సిద్ధం అయ్యిందిఅంటే ఎవరైన పెట్రోలు పోయించుకోవాలనుకుంటే సాయంత్రం గంటలకు వెళ్లిపోవాలివీళ్లు ప్రజల అవసరాలకు ఎంత విలువ ఇచ్చారో చూడండికానీ నేటీ పరిస్థితి మారిందిపెట్రోల్ బంకులు 24 గంటలూ తెరిచి ఉంటున్నాయిప్రజలకు అవసరమైన వేళ పెట్రోలుడీజిల్ అందుబాటులో ఉందిఅంతేగాక ప్రత్యామ్నాయ ఇంధనాలువిద్యుత్ మొబిలిటీహరిత ఇంధనాలపై మా ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేనంత పెట్టుబడులు పెట్టుతోంది.

మిత్రులారా,

కాంగ్రెస్ పాలనలో ఒక గ్యాస్ కనెక్షన్ కోసం కూడా పార్లమెంటు సభ్యుల చేతి మీదుగా లేఖలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదిఒక పార్లమెంట్ సభ్యుడు తన ప్రాంతంలోని ప్రజలకు గ్యాస్‌ కనెక్షన్ల కోసం సంవత్సరానికి 25 కూపన్లు పొందేవారుఆయన నియోజకవర్గంలో ఎవరికైనా కనెక్షన్ కావాలంటే ఎంపీ ఇంటి ముందు క్యూలో నిలబడి.. “నాకు గ్యాస్ కూపన్ ఇవ్వండి” అని అడగాల్సిన పరిస్థితి. 2013లో పత్రికలు తీసి చూడండి.. మీరు ఆశ్చర్యపోతారు. 2014లో మోదీకి పోటీగా వ్యూహం రూపొందించేందుకు ప్రయత్నించిందిఅప్పుడు వాళ్లకు నేను తెలియదు.. బహుశా ఇప్పటికీ నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారుఎప్పటికీ తెలియదు అనుకుంటావాళ్ల చర్చ ప్రజలకు ఏం వాగ్దానం చేయాలనే దాని గురించి... సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇవ్వాలాలేదా తొమ్మిది ఇవ్వాలాఅనిఇంతగా వ్యవస్థ ప్రభుత్వీకరణలో చిక్కుకుందికానీ మేమేం చేశాం.. వ్యవస్థను ప్రజలకు దగ్గరకు చేరవేశాంకలలో కూడా ఊహించని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించాంఇంతకముందు గ్రామానికి గ్యాస్ సిలిండర్ వస్తే అది ధనవంతుల కోసమని సామాన్యులు అనుకునేవారు. “అది పెద్ద వాళ్ల ఇళ్లకే వస్తుంది.. మన ఇళ్లకి కాదు” అనేది వారి భావనఈ పరిస్థితిని మేం తిప్పికొట్టాంగ్యాస్ పొయ్యలు కోట్లాది ఇళ్లలో వెలుగులు నింపాయిఇదే వ్యవస్థలో ప్రజాస్వామ్యీకరణఇదే భారత రాజ్యాంగం స్ఫూర్తి.

మిత్రులారా,

అప్పటి జాతీయీకరణ కాలంలో మన ప్రభుత్వ సంస్థలకుమన పీఎస్‌యూలకు తాళం వేసిన తర్వాత కాంగ్రెస్‌ పాలకులు ప్రశాంతంగా నిద్రపోయేవారుబ్యాంకు ముంచిపోతున్నదాతాళం వేసేయండికంపెనీ నష్టాల్లో ఉందామూసేయండివాళ్ల ఆలోచనేంటో తెలుసా? “మన జేబు ఖర్చవుతుందాకాదు కదామరి ఎందుకు కష్టపడాలి?” మనం ఎందుకు కష్టపడి పనిచేయాలిఅది మునిగిపోతే అది మునిగిపోతుంది,  సహజ మరణం అవుతుందన్నది కాంగ్రెస్ ఆలోచనకానీ ఈ ఆలోచనను కూడా మేం మార్చాంమేం ఆ సంస్థలను మళ్లీ నమ్మాంఎల్‌ఐసీ అయినాఎస్‌బీఐ అయినాఇతర పెద్ద ప్రభుత్వ సంస్థలైనా.. అన్ని లాభాల్లో రికార్డులు నెలకొల్పుతున్నాయి.

మిత్రులారా,

ప్రభుత్వ విధానాలు ప్రభుత్వీకరణ కంటే ప్రజాస్వామ్యీకరణపై ఆధారపడి ఉన్నప్పుడు ప్రజల నైతికత ఎక్కువగా ఉంటుందికానీ కాంగ్రెస్ ఎన్నో దశాబ్దాలుగా  “పేదలను తొలగించండిపేదరికాన్ని తొలగించండి” అదే నినాదాన్ని ఇచ్చిందిప్రతి ఎన్నికలో అదే మాటఎర్ర కోట నుంచి ఈ కుటుంబం చేసిన అన్ని ప్రసంగాలను వినండిఈ కుటుంబం నుంచి ఎర్రకోట మీదకు ఎవరు వెళ్లినా.. వాళ్ల ప్రసంగాల్లో మొదటి నుంచి చివరి వరకు పేదరికం గురించి లేకుండా ఉండేది కాదుఇవాళ యూట్యూబ్‌లో వెతికినా ఆ ప్రసంగాలు దొరుకుతాయికానీ పేదరికం తగ్గిందాలేదుఅదే మాప్రజాస్వామ్య విధానం ఫలితంగా గత 11 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందిఅందుకే దేశ ప్రజలు మాపై విశ్వాసం ఉంచుతున్నారుఅందుకే భారతదేశం అప్రతిహతంగా ముందుకు సాగుతోందిఅందుకే భారత్ అన్‌స్టాపబుల్‌గా నిలిచింది.

మిత్రులారా,

నిరుపేదలుతమ హక్కులను పొందలేని స్థితిలో ఉన్న వారికి సేవ చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందివెనుకబడిన వర్గాలకు మేం ప్రాధాన్యతనిస్తున్నాంవారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాంపెద్ద పెద్ద చర్చల్లో ఈ అంశం గురించి అంతగా పట్టించుకోరుదీనికి ఒక ఉదాహరణ చెబుతానుఇటీవల మేడ్ ఇన్ ఇండియా 4జీ స్టాక్ ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిందన్న చర్చ జరిగింది.

మిత్రులారా,

ఇది మన దేశానికి చాలా పెద్ద విజయమని నేను చెప్పాలనుకుంటున్నానుఇవాళ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 4జీ స్టాక్ తయారుచేసుకున్న ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిభారత్ లో ఎటుచూసినా అన్ని వార్తల్లోనూ 2జీ, 2జీ, 2జీ అని వినిపించేది. 2జీలో అది జరిగిందిఇది జరిగింది అంటూ వార్తా పత్రికల్లో అవే శీర్షికలు ఉండేవిఇప్పుడు నేను 4జీ గురించి మాట్లాడుతున్నానుఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పటానికి కాస్త సమయం పడుతుందిచెప్పి చెప్పి నాకు అలసట వస్తుందికాంగ్రెస్ ప్రభుత్వం పతనం చేయాలనుకున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్... ఇప్పుడు ఘన విజయాలు సాధిస్తోంది.

కానీ మిత్రులారా

దేశం సాధించిన విజయాల్లో ఇది ఒక అంశం మాత్రమేమరో కోణంలో చూస్తే.. బీఎస్ఎన్ఎల్ 4జీ స్టాక్ ను మొదలుపెట్టిన రోజున దాదాపు లక్ష 4జీ మొబైల్ టవర్లను ప్రారంభించిందిదీని ఫలితం ఏంటంటేఇన్ని రోజులు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల అటవీ ప్రాంతాలుకొండ ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మిత్రులారా,

ఇప్పుడు నేను మీకు మరో ఆశ్చర్యకరమైన విషయం చెబుతానుమనం ఎప్పుడూ 2జీ, 4జీ, 6జీ అని వింటుంటాంఅలా విన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసిఆలోచన చేసినప్పుడుఏదైనా కొత్తగా చేయాలనుకుంటాందేశం సాధించిన ఈ విజయంలోని మూడో ముఖ్యమైన విషయాన్ని ఇవాళ మీతో పంచుకోవాలనుకుంటున్నానుఇప్పటి వరకు మీడియా కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదుఇలాంటి చాలా విషయాలు వెనుకబడిపోయాయిఅయితే ఇలాంటి సదుపాయాలు మారుమూల ప్రాంత ప్రజల జీవితాలను ఎంతగానో మార్చుతాయిమీరు ఈ-సంజీవని గురించి వినుండొచ్చుఈ ఉదాహరణే మీకు చెబుతానుఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఒక కుటుంబం నివసిస్తుందని అనుకుందాంఆ కుటుంబంలోని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారుఆ సమయంలో వాతావరణం అనుకూలించపోవటంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లలేకపోయారుఅలాంటప్పుడు వాళ్లు ఏం చేస్తారుఆ పరిస్థితిలో అధిక వేగవంతమైన కనెక్టివిటీ ద్వారా ఈ-సంజీవని సర్వీసు వారికి సహకరిస్తుంది.

మిత్రులారా,

-సంజీవని యాప్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుడితో అనారోగ్యంతో ఉన్నవారు సంప్రదించిమెరుగైన సేవలను పొందుతారు. 42 కోట్ల మంది ఇప్పటివరకు ఈ-సంజీవని ద్వారా ఓపీడీ సేవలు పొందారని తెలుసుకుంటే ఎన్డీటీవీ వీక్షకులు సంతోషిస్తారు. 4జీ, 2జీ అంటే కేవలం ఇంటర్నెట్ సదుపాయం కాదు.. ఇది మన జీవితంలో మార్పు తీసుకువచ్చే ఒక నూతన శక్తిఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడే ఈ 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలు ఈ-సంజీవని యాప్ ద్వారా వైద్య సేవలు పొందారు-సంజీవని ఒక సాధారణ సదుపాయం మాత్రమే కాదు.. ఒక నమ్మకంఎప్పుడు ఆపద వచ్చినా వైద్య సహాయం అందుతుందని ప్రజలకు ఇది భరోసానిస్తుందిప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ సమానావకాశాలు కల్పించటం వల్ల వచ్చే అద్భుతమైన ఫలితాలకు ఇది చక్కని ఉదాహరణ!

మిత్రులారా

బాధ్యతాయుత పాలన చేసే ప్రభుత్వంప్రజాస్వామ్యానికి అంకితమైన ప్రభుత్వంరాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకునిఉత్తమమైన విధానాలను రూపొందిస్తుందిప్రజల జీవన విధానాలను సులభతరం చేయటంవారి పొదుపు మొత్తాలను పెంచటం అనే అంశాలపైనే మేం దృష్టి సారిస్తున్నాంఉదాహరణకు గతంలో రూ.300 ఉండే 1జీబీ డేటా ధర ఇప్పుడు రూ.10గా ఉందిఅంటే ప్రతి భారతీయుడికి ఏటా వేల రూపాయలు ఆదా అవుతున్నాయిఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేద ప్రజలు రూ.1.25 లక్షల కోట్ల వరకు ఆదా చేసుకోగలిగారుపీఎం జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం తగ్గింపు ధరతో ఔషధాలు లభిస్తుండటంతో ప్రజలు సుమారుగా రూ.40 వేల కోట్లు ఆదా చేసుకున్నారుగుండె సమస్యలున్న వారికి అవసరమైన స్టంట్ల ధరలు తగ్గించటం వల్ల పేదమధ్య తరగతి ప్రజలు ఏటా రూ.12 వేల కోట్లు ఆదా చేసుకుంటున్నారు.

మిత్రులారా,  

నిజాయితీగా పన్ను చెల్లించే వారికి కూడా మేం ప్రత్యక్ష ప్రయోజనాలు అందించాంఆదాయ పన్నుజీఎస్టీలో భారీ తగ్గింపు లభించిందిరూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇచ్చాంప్రస్తుతం జీఎస్టీ పొదుపు ఉత్సవం పూర్తిస్థాయిలో జరుగుతోందిఎక్కడ చూసినాగూగుల్ లో వెతికినా మార్కెట్ల సందడి కనిపిస్తోందిజీఎస్టీ పొదుపు ఉత్సవమే ఇందుకు కారణంఈ క్రమంలో విక్రయాలకు సంబంధించి గత రికార్డులన్నీ బద్దలవుతున్నాయిఆదాయ పన్నుజీఎస్టీకి సంబంధించి తీసుకున్న రెండు నిర్ణయాల ద్వారాదేశ ప్రజలు ఏడాదికి సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేయగలరని ఖచ్చితంగా చెప్పగలం.

మిత్రులారా,

ఇటీవల కాలంలో దేశంప్రపంచమంతా ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించుకున్నాయిఇటీవలే మా మిత్రుడు రాహుల్ జీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారుఆయనసైనిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావటం వల్ల దీనిపై ఆయనకు సహజంగానే మక్కువ ఉంటుందిసైనిక అంశాలు ఆయన రక్తంలోనే ఉంటాయిఆపరేషన్ సింధూర్ ను ఆయన గర్వంగా కొనియాడారుదేశంప్రపంచం కూడా ప్రశంసించాయిఈ రోజు మరో అంశాన్ని మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నానుఇది కేవలం దేశ భద్రతకు మాత్రమే కాదు.. నా దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశంఇది నక్సలిజానికి సంబంధించిన అంశంకొందరు నక్సలిజం అనే పేరును పెట్టినా.. నిజానికి ఇది మావోయిస్టుల ఉగ్రవాదం అని నా అభిప్రాయంమావోయిస్టు తీవ్రవాదం కథను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నానుకాంగ్రెస్ పాలనలో అర్బన్ నక్సల్స్ వ్యవస్థ ఉండేదిఈ అర్బన్ నక్సల్స్ ఆధిపత్యం చెలాయించేవారు.. ఇప్పటికీ చెలాయిస్తున్నారుమావోయిస్టు ఉగ్రవాదానికి సంబంధించిన విషయాలేవీ దేశ ప్రజలకు తెలియకుండా వారు తీవ్రంగా ప్రయత్నించేవారుమన దేశంలో ఉగ్రవాదం గురించిఆర్టికల్ 370 గురించి చాలా చర్చలు జరిగేవికానీకాంగ్రెస్ హయాంలో నగరాల్లో వృద్ధి చెందిన పలు సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకున్న అర్బన్ నక్సల్స్మావోయిస్టు తీవ్రవాదాన్ని దాచిపెట్టి దేశాన్ని చీకట్లోకి నెట్టేశారుకొద్ది రోజుల కిందట చాలామంది మావోయిస్టు తీవ్రవాద బాధితులు ఢిల్లీకి వచ్చారుచాలా బాధాకరమైన విషయం ఎంటంటే.. పెద్ద సంఖ్యలో వచ్చిన వారిలో కొందరికి కాళ్లుమరికొందరికి చేతులుఇంకొందరికి కళ్లు లేవుకొందరు శరీర భాగాలు కోల్పోయారుమావోయిస్టు బాధితుల్లో... పేదవారుగిరిజనులుపల్లెల్లో నివసించే అన్నదమ్ములుఅక్కాచెల్లెళ్లురైతుల కుమారులుతల్లులు చాలామంది కాళ్లు కోల్పోయారువారంతా ఢిల్లీకి వచ్చి ఏడు రోజులున్నారుతమ సందేశాన్ని దేశ ప్రజలకు చేరవేయమని చేతులు జోడించి విన్నవించారువారంతా నిర్వహించిన ఒక పత్రికా సమావేశాన్ని మీలో ఎవరూ చూసుండకపోవచ్చువిని ఉండకపోవచ్చుఇక్కడున్న మావోయిస్టు తీవ్రవాద కాంట్రాక్టర్లుఆ బాధితుల బాధాకరమైన కథను దేశ ప్రజలకు చేరకుండా అడ్డుకున్నారుకాంగ్రెస్ వ్యవస్థ దీని గురించి చర్చించేందుకు కూడా అనుమతించలేదు.  

మిత్రులారా,

దేశంలోని పెద్ద రాష్ట్రాలు నక్సలైట్ల హింసమావోయిస్టుల తీవ్రవాదం గుప్పిట్లో ఉండేవిమిగతా దేశమంతా రాజ్యాంగ విలువలతో నడుస్తున్నానక్సల్ ప్రభావిత ప్రాంతంలో మాత్రం దాని గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదునేను ఒక విషయాన్ని బాధ్యతతో చెబుతున్నానుగౌరవిస్తున్నామని రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న వాళ్లు కూడాఆ రాజ్యాంగాన్ని నమ్మని మావోయిస్టులను రక్షించటానికి ఇప్పటికీ అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

మిత్రులారా,

ప్రజలతో ఎన్నికైన ఏ ప్రభుత్వ ప్రభావమూరెడ్ కారిడార్ ప్రాంతంలో ఉండేది కాదుసాయంత్రమైతే ఇంట్లోంచి రావటానికి ప్రజలు భయపడేవారుప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు కూడా భద్రతతో తిరగాల్సి వచ్చేది.

మిత్రులారా,

మావోయిస్టుల హింస కారణంగా గత 50-55 ఏళ్లలో వేలాది మంది ప్రజలు మరణించారుఎంతో మంది భద్రతా సిబ్బంది బలైపోయారుఎంతో మంది యువకులను మనం కోల్పోయాంనక్సలైట్లుమావోయిస్టు ఉగ్రవాదులు పాఠశాలలుఆస్పత్రుల నిర్మాణానికి అనుమతించలేదుఆస్పత్రులు ఉన్నావైద్యులను కనీసం లోపలకు రానివ్వలేదుఎన్నో నిర్మాణాలను బాంబులతో కూల్చేశారుదేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారుదీనివల్ల గిరిజనులుదళితులుపేదవాళ్లు ఎంతో నష్టపోయారు.

మిత్రులారా,  

దేశ యువతకు జరుగుతున్న తీవ్ర అన్యాయంఘోరమైన పాపం మావోయిస్టు తీవ్రవాదందేశ యువతను ఈ పరిస్థితిలో వదిలిపెట్టలేకపోతున్నానుఇంతకాలం నా మనసులో దాచుకున్న బాధను ఈ రోజు మీకు చెబుతున్నానుకుమారులను పోగొట్టుకున్న తల్లుల బాధ నాకు తెలుసుఆ తల్లులు తమ కుమారులపై ఎన్నో ఆశలు పెట్టుకునివారి భవిష్యత్తు కోసం కలలు కంటారుమావోయిస్టు అబద్ధపు మాటల్లో యువత చిక్కుకున్నారుమావోయిస్టుల హింసకు బలయ్యారుఅందువల్ల దారితప్పిన యువతను జనజీవన స్రవంతిలో కలిపేందుకు 2014 నుంచి మా ప్రభుత్వం ప్రయత్నించిందిఇవాళ మొదటిసారి దేశ ప్రజలకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానుఇది విని ప్రజలు సంతోషిస్తారుమమ్మల్ని ప్రశంసిస్తారుకుమారుల్ని కోల్పోయిన తల్లులు మమ్మల్నిదేశశక్తిని ఆశీర్వదిస్తారుమా ప్రయత్నాల ఫలితాలను ఇవాళ దేశం చూస్తోందిపదకొండేళ్ల కిందట వరకు దేశంలో 125కు పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది.

మిత్రులారా,  

మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య ఇవాళ 11కు తగ్గిందిఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి వచ్చిందని మీకు తెలుసుఆ 11 జిల్లాల్లో జిల్లాలు మావోయిస్టుల హింస వల్ల ఎక్కువగా ఇబ్బందిపడుతున్నాయి.

మిత్రులారా,

దశాబ్ద కాలంలో వేల మంది నక్సలైట్లు లొంగిపోయారుకేవలం 75 గంటల వ్యవధికి సంబంధించిన గణాంకాలను నేను చెప్తానుఇది మీడియాతో చర్చించే విషయం కాదని నాకు తెలుసుకానీకేవలం 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు లొంగిపోవటం నా జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చే విషయంగతంలో రైఫిళ్లు పట్టుకుని తిరిగిన 303 మంది ఇవాళ వాటిని వదిలేసి లొంగిపోయారులొంగిపోయిన వారు సాధారణ నక్సలైట్లు కాదుకొంతమందిపై కోటి రూపాయలుమరికొందరిపై 15 లక్షలుఇంకొందరిపై లక్షల వరకు రివార్డులున్నాయిఈ నక్సలైట్ల నుంచి చాలా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారువీళ్లంతా తుపాకులుబాంబులు వదిలిపెట్టి దేశ రాజ్యాంగ విలువల పట్ల గౌరవంతో జీవించటానికి సిద్ధంగా ఉన్నారురాజ్యాంగాన్ని నిబద్ధతతో అనుసరించే ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పు దారిలో వెళ్లే వ్యక్తి వెనక్కి వచ్చిఆ రాజ్యాంగమే తనకు రక్షణ అని భావిస్తాడుఇప్పుడు వాళ్లు అభివృద్ధి చెందుతున్న జన స్రవంతిలోకి వస్తున్నారువారు సరైన మార్గంలో వెళ్లలేదని భావిస్తున్నారుఐదు దశాబ్దాలు గడిచాయివాళ్ల విలువైన సమయాన్ని కోల్పోయినాఆశించిన మార్పు రాలేదుప్రస్తుతం వారు భారత రాజ్యాంగంపై నమ్మకంతో ముందుకు సాగుతారు.

మిత్రులారా,

గతంలో చత్తీస్ గఢ్ లోని బస్తర్ లో ఇది జరిగింది.. అది జరిగింది.. ఒక బస్సును పేల్చేశారు... చాలామంది భద్రతా సిబ్బంది చనిపోయారు... అంటూ మీడియాలో వార్తలు వచ్చేవిబస్తర్ ఒకప్పుడు మావోయిస్టులునక్సలైట్లకు బలమైన స్థావరంగా ఉండేదిఇవాళ అదే బస్తర్ ను ఉదాహరణగా చెబుతున్నానుఇప్పుడు అక్కడి గిరిజన యువత బస్తర్ ఒలింపిక్స్ ని నిర్వహిస్తున్నారులక్షల మంది యువత ఈ బస్తర్ ఒలింపిక్స్ లో పాల్గొని తమ సత్తాను చాటుతున్నారుఇదే అసలైన మార్పు.

మిత్రులారా

మావోయిస్టు హింస నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో ఈసారి దీపావళి వేడుకలు మరింత ఉల్లాసంగా జరగనున్నాయి. 50-55 ఏళ్లుగా దీపావళి అంటే తెలియనివారు ఇప్పుడు ఆ పండగ వాతావరణాన్ని చూస్తారుమిత్రులారానేను కచ్చితంగా నమ్ముతున్నానుమన కష్టం ఫలించిఅక్కడ కూడా ఆనందపు దీపాలు వెలుగుతాయిదేశ ప్రజలకుఎన్డీటీవీ ప్రేక్షకులకు నేను ఇవాళ హామీ ఇస్తున్నానునక్సలిజంమావోయిస్టు ప్రభావం నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదుఇది మోదీ గ్యారెంటీ.

మిత్రులారా,

మనది కేవలం అభివృద్ధికి సంబంధించిన ప్రయాణం మాత్రమే కాదుఇందులో అభివృద్ధిగౌరవం రెండూ కలిసి సాగాలిసమర్థంగా పనిచేసే పౌరులకు గౌరవం లభించాలిసమర్థత మాత్రమే కాదుసానుభూతికరుణ వంటివి ఆవిష్కరణ లక్ష్యం కావాలిఈ లక్ష్యం దిశగా మనం ముందుకు సాగాలిఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్లటంలో ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయిదేశం కోసం మాట్లాడేందుకు నాకు అవకాశమిచ్చిన ఎన్డీటీవీకి కృతజ్ఞతలుఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఅలాగేదీపావళి శుభాకాంక్షలు

ధన్యవాదాలు!

 

***


(रिलीज़ आईडी: 2180893) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam