హోం మంత్రిత్వ శాఖ
నక్సల్ రహిత భారత్ను తయారుచేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం దిశగా భారీ సానుకూల పరిణామం.. నక్సలిజం ఎక్కువగా ఉన్న జిల్లాలు మూడే..
18 నుంచి కేవలం 11కి తగ్గిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో
గత రికార్డులను దాటుతూ ఈ సంవత్సరం 312 నక్సలైట్ల ఏరివేత
836 మంది నక్సలైట్ల అరెస్టు.. హింసామార్గాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలిసిన 1639 మంది
బహుముఖ విధానంతో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక, విధానాన్ని కఠినంగా అమలు చేసిన మోదీ ప్రభుత్వం
నక్సల్ ముప్పును ఎదుర్కోవడంలో భారీ విజయం సాధించిన ప్రభుత్వం
2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ముప్పును పూర్తిగా తొలగించేందుకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం
Posted On:
15 OCT 2025 4:57PM by PIB Hyderabad
నక్సల్ రహిత భారత్ను తయారుచేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతను సాధించే దిశగా ఒక పెద్ద సానుకూల పరిణామం చోటుచేసుకుంది. నక్సలిజం ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య 6 నుంచి 3కు తగ్గింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ మాత్రమే వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) ఎక్కువగా ఉన్న జిల్లాలుగా ఉన్నాయి.
నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా 18 నుంచి 11కు తగ్గింది. ఇప్పుడు 11 జిల్లాలు మాత్రమే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ముప్పును పూర్తిగా తొలగించాలనే లక్ష్యానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ఈ ఏడాది తీసుకున్న చర్యల వల్ల ఫలితాలు గత రికార్డులను అధిగమించాయి. 312 మంది నక్సలైట్లను ఈ సంవత్సరం ఏరివేశారు. వీళ్లలో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి, 8 మంది ఇతర పొలిట్ బ్యూరో లేదా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. 836 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 1639 మంది లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నారు.
మోదీ ప్రభుత్వ హయాంలో నక్సల్ ముప్పును ఎదుర్కొనే విషయంలో భారీ విజయం నమోదైంది. బహుముఖ విధానంతో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక- విధానాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. జాతీయ కార్యాచరణ ప్రణాళిక - విధానంలో వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల విషయంలో ఖచ్చితమైన నిఘా ఆధారిత ప్రజానుకూల కార్యచరణ ఉంది. భద్రత లేని ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించటం, అగ్ర నాయకులతో పాటు క్షేత్రస్థాయి నక్సలైట్లను లక్ష్యంగా చేసుకోవడం, తిరోగామి భావజాలాన్ని ఎదుర్కోవడం, మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయటం, సంక్షేమ పథకాలను అందరికి అందించటం, వామపక్ష తీవ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని తగ్గించటం, రాష్ట్రాలు - కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచటం, మావోయిస్టులకు సంబంధించిన కేసుల దర్యాప్తు- విచారణను వేగవంతం చేయడం వంటి చర్యలను ఈ విధానంలో భాగంగా తీసుకున్నారు.
2010లో అప్పటి ప్రధానమంత్రి భారతదేశానికి ‘అతిపెద్ద అంతర్గత భద్రతా సమస్య’గా అభివర్ణించిన నక్సలిజం ఇప్పుడు సుస్పష్టంగా తుడిచిపెట్టుకుపోయింది. నేపాల్లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు ఉన్న ప్రాంతాన్ని రెడ్ కారిడార్గా నక్సల్స్ తయారు చేశారు. 2013లో వివిధ రాష్ట్రాలకు చెందిన 126 జిల్లాల్లో మావోయిస్టు హింసాత్మక కేసులు నమోదయ్యాయి. మార్చి 2025 నాటికి ఈ జిల్లాల సంఖ్య కేవలం 18కి తగ్గింది. అంతేకాకుండా.. కేవలం 06 జిల్లాలు మాత్రమే 'అత్యంత ప్రభావిత జిల్లాలు'గా ఉన్నాయి.
***
(Release ID: 2179663)
Visitor Counter : 4