ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో దుర్ఘటన.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన శ్రీ మోదీ

Posted On: 14 OCT 2025 10:50PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ  మోదీ ఆకాంక్షించారు.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:

‘‘రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి బాధపడ్డాను. ఈ కష్ట కాలంలో బాధితులకూ, వారి కుటుంబాలకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ఇస్తాం.  గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తాం.”

@narendramodi
 
 
***

(Release ID: 2179252) Visitor Counter : 3