ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్వాల్కమ్ అధ్యక్షుడు సీఈఓతో సమావేశమైన ప్రధానమంత్రి.. ఏఐ ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ పురోగతిపై చర్చ

प्रविष्टि तिथि: 11 OCT 2025 2:03PM by PIB Hyderabad

క్వాల్కమ్ అధ్యక్షుడుసీఈఓ శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుఈ సందర్భంగా ఏఐ ఆవిష్కరణనైపుణ్యాభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతిపై చర్చించారు.

భారత్ లో సెమీ కండర్టర్లుఏఐ మిషన్ల అభివృద్ధికి క్వాల్కమ్ కంపెనీ చూపిన చొరవను ప్రధానమంత్రి ప్రశంసించారుభవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతలను రూపొందించటానికి భారత్ లో ఉన్న ప్రత్రిభపెద్ద స్థాయిలో మార్కెట్ మరెక్కడా ఉండవని అన్నారు.

ఇండియా ఏఐఇండియా సెమీ కండక్టర్ల మిషన్, 6జీ సాంకేతికతకు మార్పు కోసం క్వాల్కమ్భారత్ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై జరిగిన చర్చల నేపథ్యంలో ప్రధానమంత్రికి క్వాల్కమ్ అధ్యక్షుడుసీఈఓ శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ ధన్యవాదాలు తెలిపారుఏఐ స్మార్ట్ ఫోన్లుపీసీలుస్మార్ట్ గ్లాసెస్ఆటోమోటివ్పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ భారత పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికున్న అవకాశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ తో సమావేశం.. ఏఐఆవిష్కరణనైపుణ్యాభివృద్ధిలో భారత్ పురోగతిపై చర్చించటం అద్భుతంగా ఉందిభారత్ లో సెమీ కండక్టర్ల తయారీఏఐ మిషన్లకు క్వాల్కమ్ ప్రాధాన్యతనివ్వటం చాలా సంతోషంభవిష్యత్తును తీర్చిదిద్దే సాంకేతికతల నిర్మాణానికి ఎనలేని ప్రతిభమార్కెట్ ను భారత్ కలిగి ఉంది.

@క్రిస్టియానోఅమోన్

@క్వాల్కమ్”

 

(रिलीज़ आईडी: 2177970) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam