సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
టెలివిజన్ లోకి మళ్లీ మన ఇతిహాసం- మహాభారతం
ప్రసార భారతి, కలెక్టివ్ మీడియా నెట్ వర్క్ భాగస్వామ్యంతో నేటి తరం కోసం వినూత్నంగా మహాభారతం
Posted On:
10 OCT 2025 11:56AM by PIB Hyderabad
దేశంలో అత్యంత ఆదరణ పొందిన, ప్రాచీన ఇతిహాసం మహాభారతం బుల్లి తెరపైకి మళ్లీ తిరిగి వస్తోంది. ఈ మహాకావ్యాన్ని ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించి తిరిగి ప్రజలకు అందించేందుకు సిద్ధమైనట్లు కలెక్టివ్ మీడియా నెట్వర్క్ ప్రకటించింది. ఈ మహాభారతం అక్టోబర్ 25, 2025న ప్రసార భారతికి చెందిన ‘‘వేవ్స్’’ ఓటీటీ వేదికలో ముందుగా అందుబాటులోకి రానుంది. అనంతరం నవంబర్ 2, 2025 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ లో ప్రసారం కానుంది. దీంతో ఇటు దేశంతోపాటు అటు ప్రపంచ వ్యాప్తంగా వేవ్స్ ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు ఏకకాలంలో అందుబాటులో ఉండనుంది.
ఈ వినూత్న ప్రాజెక్టు కోసం విశ్వసనీయత, దేశవ్యాప్త పరిధి కలిగిన ప్రసార భారతీ, తదుపరితరం మీడియా సంస్థ కలిసి పనిచేన్నాయి. అత్యాధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి మహాభారతంలోని పాత్రలనూ, యుద్ధాలనూ, భావోద్వేగాలనూ, నైతిక సందిగ్ధతలనూ ఈ తరానికి తగినట్లుగా సినిమా స్థాయిలో, అత్యంత వాస్తవికతతో పునర్నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా భావనలకు అనుగుణంగా.. దేశ సాంప్రదాయాలను, వారసత్వాన్ని, ఆధునికతతో కలిపి ఎలా ప్రదర్శించవచ్చన్నదానికి ఈ వినూత్న ప్రాజెక్టు ఒక ఉదాహరణ.
ఈ భాగస్వామ్యంపై ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ "ప్రసార భారతి ఎల్లప్పుడూ జాతీయ, సాంస్కృతిక ప్రాధాన్యత గల కథలను ప్రతి ఇంటికీ చేర వేస్తుంది. లాక్డౌన్ సమయంలో మహాభారతాన్ని పునః ప్రసారం చేసినప్పుడు.. ఈ ఇతిహాసం కుటుంబాలను, కొన్ని తరాలను ఎంత బలంగా కలిపి ఉంచిందీ మనకు తెలుసు. ఈసారి ఏఐ ఆధారిత రూపకల్పనతో- మహాభారతాన్ని అందించడం ద్వారా దేశంలోనే గొప్ప ఇతిహాసాన్ని ప్రేక్షకులు కొత్తగా అనుభూతి చెందేందుకు అవకాశం కలుగుతుంది. సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. ఆధునిక కథనశైలిలో సాంకేతికతను జోడించే ప్రయత్నం. నేటి ఆధునిక ప్రసార పరంపరలో- వారసత్వం, అభివృద్ధిని కలిపే వ్యక్తీకరణే- ఈ మహాభారతం’’ అని వ్యాఖ్యానించారు.
ఈ భాగస్వామ్యంపై కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విజయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. "లక్షలాది భారతీయుల్లాగే నేను కూడా ప్రతి ఆదివారం టెలివిజన్లో ప్రసారమైన మహాభారతాన్ని చూస్తూ పెరిగాను. అది మన సంస్కృతిపై నాకున్న ఆలోచననీ, అనుబంధాన్నీ ఒకటి చేసిన అనుభవం. ఈ కొత్త మహాభారతం ప్రాజెక్ట్ ద్వారా మన తరానికి దక్కిన గొప్ప అనుభూతిని ఆధునిక సాంకేతికత ద్వారా నేటి తరానికి కూడా అందించాలన్నదే నా ఉద్దేశం. భక్తి, ప్రగతి కలిసి సంప్రదాయంతోపాటు ధైర్యంగా భవిష్యత్తు వైపు సాగే ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది’’ అని అన్నారు.
ప్రసార భారతి- ఓటీటీ ‘‘వేవ్స్’’ దేశ సంస్కృతి, వార్తలు, వినోదం వంటి అనేక అంశాలను ఒకే డిజిటల్ వేదికపై అందిస్తుంది. వీడియో-ఆన్-డిమాండ్, ప్రత్యక్ష కార్యక్రమాలు, టీవీ, రేడియో, ఆడియో మ్యాగజైన్ సమాచారం వంటి విస్తృత సేవలను అందిస్తోంది. అనేక భాషాల్లో... కుటుంబాలకు అవసరమైన, నమ్మకమైన సమాచారం ద్వారా లక్షలాది మంది వినియోగదాలను ఆకర్షిస్తోంది. ఆవిష్కరణ, వారసత్వం అనే మూల స్తంభాలపై నిర్మితమైన ఈ ఆన్ లైన్ వేదిక.. దేశ వారసత్వాన్ని, ఆధునికత మధ్య వారధిగా నిలుస్తోంది. సాంకేతికత, సంప్రదాయం కలిసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా శక్తిమంతమైన కథనాలను ఎలా రూపొందించవచ్చో కలెక్టివ్ ఏఐ... మహాభారత్ తో కలిసి చేపట్టిన ఈ భాగస్వామ్యం వివరిస్తుంది. ఇది దేశంలోని అనేక భాషల ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
***
(Release ID: 2177478)
Visitor Counter : 28
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam