రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

మై భారత్ - జాతీయ సేవా పథకం అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 06 OCT 2025 2:16PM by PIB Hyderabad

2022-23 సంవత్సరానికిగానూ మై భారత్ జాతీయ సేవా పథకం అవార్డులను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (2025, అక్టోబర్ 6) రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేశారు.

 

మై భారత్ జాతీయ సేవా పథకం.. కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో ఒకటిస్వచ్ఛంద సమాజ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వంనైతిక విలువలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యందీనిని మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969లో ప్రారంభించారుఈ అవార్డులు యువతలో సేవా భావనను ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

 

మై భారత్-ఎన్ఎస్ఎస్ అవార్డులను 1993-94 నుంచీ యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ అందిస్తోందిఇది సమాజ సేవసామూహిక అభివృద్ధిజాతి నిర్మాణంలో యువత అందించిన అత్యుత్తమ సేవలను గౌరవిస్తూ ఇచ్చే అవార్డుల కార్యక్రమం.

 

***


(रिलीज़ आईडी: 2175330) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Malayalam