ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డార్జిలింగ్‌లో వంతెన ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 05 OCT 2025 12:57PM by PIB Hyderabad

డార్జిలింగ్‌లో ఈ రోజు జరిగిన వంతెన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

 ‘ఎక్స్ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"డార్జిలింగ్‌ వంతెన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో డార్జిలింగ్, పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం."


(Release ID: 2175006) Visitor Counter : 5