ప్రధాన మంత్రి కార్యాలయం
త్రిపురలో ఉదయ్ పూర్ లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థనలు చేసిన ప్రధానమంత్రి
మాతా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలోని పనులను సమీక్షించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2025 9:13PM by PIB Hyderabad
త్రిపురలోని ఉదయ్ పూర్ లో మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు. "భారతీయులంతా ఆరోగ్యంగానూ, సుభిక్షంగానూ ఉండాలని కోరుకున్నాను" అని శ్రీ మోదీ తెలిపారు.
మాతా త్రిపుర సుందరీ ఆలయ ప్రాంగణంలోని పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ ఆలయాన్ని సందర్శించడంతోపాటు , త్రిపుర రాష్ట్రంలోని ప్రకృతి అందాలను చూసేందుకు వీలుగా దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"నవరాత్రి మొదటి రోజు, దుర్గాదేవిని పూజించే సందర్భంలో త్రిపురలోని ఉదయ్ పూర్ లో ఉన్న మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థన చేసే అవకాశం లభించింది. భారతీయులందరి క్షేమం, సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించాను.”
"మాతా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలోని పనులను సమీక్షించాను. అధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు త్రిపురను సందర్శించాలనీ, ఆలయంలో పూజలు చేయడంతోపాటు, త్రిపుర ప్రాంత అందాలను చూసేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం."
(రిలీజ్ ఐడి: 2169966)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam