ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపురలో ఉదయ్ పూర్ లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థనలు చేసిన ప్రధానమంత్రి


మాతా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలోని పనులను సమీక్షించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2025 9:13PM by PIB Hyderabad

త్రిపురలోని ఉదయ్ పూర్ లో మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు. "భారతీయులంతా ఆరోగ్యంగానూసుభిక్షంగానూ ఉండాలని కోరుకున్నానుఅని శ్రీ మోదీ తెలిపారు.

మాతా త్రిపుర సుందరీ ఆలయ ప్రాంగణంలోని పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ ఆలయాన్ని సందర్శించడంతోపాటు త్రిపుర రాష్ట్రంలోని ప్రకృతి అందాలను చూసేందుకు వీలుగా దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

 

‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"నవరాత్రి మొదటి రోజుదుర్గాదేవిని పూజించే సందర్భంలో త్రిపురలోని ఉదయ్ పూర్ లో ఉన్న మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థన చేసే అవకాశం లభించిందిభారతీయులందరి క్షేమంసుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించాను.”

 

"మాతా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలోని పనులను సమీక్షించానుఅధిక సంఖ్యలో భక్తులుపర్యాటకులు త్రిపురను సందర్శించాలనీఆలయంలో పూజలు చేయడంతోపాటుత్రిపుర ప్రాంత అందాలను చూసేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం."


(రిలీజ్ ఐడి: 2169966) సందర్శకుల సూచీ సంఖ్య : : 31