ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా...
భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ) డబ్లింగ్
రూ.3,169 కోట్ల వ్యయం... క్యాబినెట్ ఆమోదం
Posted On:
10 SEP 2025 3:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ.)ను మొత్తం సుమారు రూ.3,169 కోట్ల వ్యయంతో డబ్లింగ్ చేసేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
విస్తరించిన లైన్ సామర్థ్యం వల్ల రవాణాను, సామర్థ్యాన్ని మెరుగుపరిచి, విశ్వసనీయమైన సేవలను భారతీయ రైల్వేలు అందిస్తాయి. ఈ బహుళ-ట్రాకింగ్ ప్రతిపాదన.. కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. రద్దీని తగ్గిస్తుంది. అలాగే భారతీయ రైల్వేల్లో అత్యంత రద్దీగా ఉండే సెక్షన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవభారత లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించి సమగ్రాభివృద్ధి సాధించడం ద్వారా వారిని ‘ఆత్మ నిర్భర్’గా మారుస్తుంది.
సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ విధ అనుసంధానతను, రవాణా సామర్థ్యాన్ని విస్తరించడంపై దృష్టి సారించి పీఎం-గతి శక్తి జాతీయ ప్రణాళిక ఆధారంగా ఈ ప్రణాళికలను రూపొందించారు. ప్రజలు, వస్తువులు, సేవలకు ఎలాంటి అవరోధాలు లేని రవాణా సదుపాయాన్ని ఈ ప్రాజెక్టులు అందిస్తాయి.
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అయిదు జిల్లాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే 177 కి.మీ మేర ఉన్న వ్యవస్థను విస్తరిస్తుంది.
దేవఘర్ (బాబా బైద్యానాథ్ థామ్), తారాపీఠ్ (శక్తి పీఠం) తదితర ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు అనుసంధానతను ఈ ప్రాజెక్టు సెక్షన్ కల్పిస్తుంది. తద్వారా దేశం నలుమూలల నుంచి యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తుంది.
దాదాపుగా 441 గ్రామాలు, సుమారుగా 28.72 లక్షల జనాభాకు, మూడు ఆకాంక్షాత్మక జిల్లాలు (బంకా, గొడ్డా, దుమ్కా)కు రవాణా అనుసంధానాన్ని ఈ బహుళ ట్రాక్ ప్రాజెక్టు విస్తరించింది.
బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఇటుకలు, రాళ్లు తదితరమైన వస్తువులను తరలించడానికి ఇది ముఖ్యమైన మార్గం. సామర్థ్యాన్ని పెంచే పనుల వల్ల అదనంగా 15 ఎంపీటీఏ (ఏడాదికి మిలియన్ టన్నులు) పరిమాణంలో సరుకు రవాణా అవుతుంది. వాతావరణ లక్ష్యాలను సాధించడానికి, దేశంలో రవాణా ఖర్చులను, చమురు దిగుమతులను, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను (24 కోట్ల కేజీలు) తగ్గించడానికి పర్యావరణహితమైన, ఇంధన సామర్థ్యం కలిగిన రైల్వేలు తోడ్పడతాయి. ఇది కోటి చెట్లను నాటడంతో సమానం.
(Release ID: 2165294)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada