ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ - అమెరికా మధ్య బలమైన సంబంధాలున్నాయని స్పష్టం చేసిన ప్రధాని

Posted On: 10 SEP 2025 7:52AM by PIB Hyderabad

భారత్ అమెరికా మధ్య బలమైన సత్సంబంధాలున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారుఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై విశ్వాసం వ్యక్తం చేశారురెండు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా ఇరుదేశాలూ కలిసి పనిచేస్తాయని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అమెరికా అధ్యక్షుడు చేసిన ఓ పోస్టుకు ప్రతిస్పందిస్తూశ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

భారత్అమెరికా సన్నిహిత మిత్రదేశాలుసహజ భాగస్వాములుభారత్-అమెరికా భాగస్వామ్యంతో అపరిమిత అవకాశాలను ఆవిష్కరించే దిశగా మన వాణిజ్య చర్చలు మార్గాన్ని సుగమం చేస్తాయని విశ్వసిస్తున్నానువీలైనంత త్వరగా ఈ చర్చలను ఓ కొలిక్కి తెచ్చేలా మన బృందాలు కృషి చేస్తున్నాయిఅధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానుఇరు దేశాల ప్రజలకు ఉజ్వలమైనమరింత సుసంపన్నమైన భవితను అందించే దిశగా కలిసి పనిచేస్తాం.

@realDonaldTrump 

@POTUS” 


(Release ID: 2165198) Visitor Counter : 2