వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ 10న అత్యాధునిక సౌకర్యాలున్న విద్యుత్ వాహన (ఈవీ) నాణ్యతా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్న కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి


దేశీయంగా తయారీ రంగానికి మద్దతిచ్చే

శక్తిమంతమైన ఈవీ నాణ్యతా పరీక్షల దిశగా మౌలిక వసతులు

అంతర్జాతీయ స్థాయి పరీక్ష, ధ్రువీకరణ ద్వారా ఈవీలపై విశ్వాసం

प्रविष्टि तिथि: 09 SEP 2025 12:31PM by PIB Hyderabad

సుస్థిరమైన వాహన రంగాన్ని ప్రోత్సహించికార్బన్ ఉద్గారాలను తగ్గించాలనే భారత్ లక్ష్యానికి అనుగుణంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ వాహన (ఈవీపరీక్షా కేంద్రాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహరాలుఆహారంప్రజా పంపిణీనూతనపునరుత్పాదక శక్తి మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి 2025, సెప్టెంబర్ 10న ప్రారంభిస్తారుదీనిని కోల్‌కతాలోని అలిపోర్ ప్రాంతీయ ప్రయోగశాలలో ఏర్పాటు చేశారు.

అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలలో ఈవీ బ్యాటరీలుభాగాలపై కీలకమైన పరీక్షలు నిర్వహిస్తారువిద్యుత్ భద్రతఎఫ్‌సీసీ/ఐఎస్ఈడీ అమలుమన్నికవాతావరణ పరీక్షలు (ఐపీయూవీతుప్పు పట్టడం), యాంత్రికపదార్థ భద్రత (మండే స్వభావంగ్లో వైర్ తదితరమైనవిఅంశాలపై పరీక్షలు నిర్వహిస్తారుఈవీ బ్యాటరీ తయారీదారులకు ముఖ్యంగా తూర్పు భారత్‌‌లో విశ్వసనీయమైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరీక్షధ్రువీకరణను అందిస్తుందిఉత్పత్తి భద్రతపనితీరునియంత్రణల అమలుకు ఈ కేంద్రం హామీ ఇస్తుంది.

ఈవీల నాణ్యత హామీకి జాతీయ ప్రమాణంగా ఈ కేంద్రం పనిచేస్తుందిలోపాలను ముందుగానే తయారీదారులు గుర్తించడానికిఉత్పత్తి విశ్వసనీయతను పెంచడంకఠినమైన భద్రతపనితీరు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వీలు కల్పిస్తుందిఅలాగే ఈవీ వినియోగదారుల్లో విశ్వాసానాన్ని పెంపొందించిగ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది.

బలమైన ఈవీ వ్యవస్థను రూపొందించడానికిఎగుమతులను తగ్గించడానికీచౌకగా లభించే నాణ్యతా పరీక్షల సేవలతో దేశీయ వినియోగదారులను శక్తిమంతం చేయడం పట్ల భారత ప్రభుత్వ నిబద్ధతను ఈ కేంద్రం ప్రతిబింబిస్తుందిఈ అభివృద్ధితోసుస్థిర రవాణా వ్యవస్థను సాధించే దిశగా భారత్ పరివర్తనకునాణ్యతా ప్రమాణాలకు హామీ ఇచ్చే మౌలిక వసతులను కల్పించడంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ఎదగడంలో ఎన్‌టీహెచ్ తన పాత్రను బలోపేతం చేసుకుంటుంది.

శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్నిర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ.. పర్యావరణహిత రవాణా పరిష్కాల దిశగా ప్రపంచ పరివర్తనలో ఎలక్ట్రిక్ వాహనాలు ముందంజలో ఉన్నాయి. 2030 (30@30) నాటికి 30 శాతం ఈవీల విస్తరణ సాధించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందిఈ లక్ష్యానికి మద్దతు ఇచ్చేందుకు.. ఈవీలువాటికి సంబంధించిన భాగాలు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన పరీక్షప్రామాణికంధ్రువీకరణ పొందాయని నిర్దారించుకోవడం చాలా అవసరం.

 

***


(रिलीज़ आईडी: 2164936) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil , Kannada